తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
సింగపూర్ సిటీ మధ్యలో ఉన్న నదిలో బోటు షికారుకు రేవంత్ వెళ్లారు. ఈ సందర్బంగా బోటులో నిలుచుని… నదిలో నుంచి తనకు కనిపిస్తున్న భవంతులను చూస్తూ ఆయన పారవశ్యం పొందారు. అయితే అదేదో జల్సా షికారు అయితే కాదు. ఎందుకంటే… సింగపూర్ రివర్ లో బోటు షికారుకు వెళ్లిన రేవంత్… తన వెంట సింగపూర్ అధికారిని కూడా తీసుకుని వెళ్లారు. నదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… నదిని వారు కాపాడుకుంటున్న తీరు గురించి ఆసక్తిగా విన్నారు.
అలా సింగపూర్ రివర్లో జాలీగా షికారు కొడుతున్న వీడియోను స్వయంగా రేవంతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ బోటు షికారులో తాను ఏం గమనించానన్న విషయాన్ని కూడా సదరు పోస్టులో రాసుకొచ్చారు. సింగపూర్ సర్కారు నదిని పునరుద్ధరించిన తీరు, ఆపై దానిని కాపాడుకుంటున్న తీరు… అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నట్లు వివరించారు. ఆ చర్యలను హైదరాబాద్ కూ అప్లై చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక బోటు షికారుకు వెళ్లిన సందర్భంగా కలర్ షర్ట్ వేసిన రేవంత్… ఓ సీఎంగా, రాజకీయ నేతగా కాకుండా.. సింగపూర్ ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ గానే కనిపించారు.
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…