తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
సింగపూర్ సిటీ మధ్యలో ఉన్న నదిలో బోటు షికారుకు రేవంత్ వెళ్లారు. ఈ సందర్బంగా బోటులో నిలుచుని… నదిలో నుంచి తనకు కనిపిస్తున్న భవంతులను చూస్తూ ఆయన పారవశ్యం పొందారు. అయితే అదేదో జల్సా షికారు అయితే కాదు. ఎందుకంటే… సింగపూర్ రివర్ లో బోటు షికారుకు వెళ్లిన రేవంత్… తన వెంట సింగపూర్ అధికారిని కూడా తీసుకుని వెళ్లారు. నదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… నదిని వారు కాపాడుకుంటున్న తీరు గురించి ఆసక్తిగా విన్నారు.
అలా సింగపూర్ రివర్లో జాలీగా షికారు కొడుతున్న వీడియోను స్వయంగా రేవంతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ బోటు షికారులో తాను ఏం గమనించానన్న విషయాన్ని కూడా సదరు పోస్టులో రాసుకొచ్చారు. సింగపూర్ సర్కారు నదిని పునరుద్ధరించిన తీరు, ఆపై దానిని కాపాడుకుంటున్న తీరు… అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నట్లు వివరించారు. ఆ చర్యలను హైదరాబాద్ కూ అప్లై చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక బోటు షికారుకు వెళ్లిన సందర్భంగా కలర్ షర్ట్ వేసిన రేవంత్… ఓ సీఎంగా, రాజకీయ నేతగా కాకుండా.. సింగపూర్ ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ గానే కనిపించారు.
This post was last modified on January 20, 2025 2:41 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…