తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
సింగపూర్ సిటీ మధ్యలో ఉన్న నదిలో బోటు షికారుకు రేవంత్ వెళ్లారు. ఈ సందర్బంగా బోటులో నిలుచుని… నదిలో నుంచి తనకు కనిపిస్తున్న భవంతులను చూస్తూ ఆయన పారవశ్యం పొందారు. అయితే అదేదో జల్సా షికారు అయితే కాదు. ఎందుకంటే… సింగపూర్ రివర్ లో బోటు షికారుకు వెళ్లిన రేవంత్… తన వెంట సింగపూర్ అధికారిని కూడా తీసుకుని వెళ్లారు. నదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… నదిని వారు కాపాడుకుంటున్న తీరు గురించి ఆసక్తిగా విన్నారు.
అలా సింగపూర్ రివర్లో జాలీగా షికారు కొడుతున్న వీడియోను స్వయంగా రేవంతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ బోటు షికారులో తాను ఏం గమనించానన్న విషయాన్ని కూడా సదరు పోస్టులో రాసుకొచ్చారు. సింగపూర్ సర్కారు నదిని పునరుద్ధరించిన తీరు, ఆపై దానిని కాపాడుకుంటున్న తీరు… అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నట్లు వివరించారు. ఆ చర్యలను హైదరాబాద్ కూ అప్లై చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక బోటు షికారుకు వెళ్లిన సందర్భంగా కలర్ షర్ట్ వేసిన రేవంత్… ఓ సీఎంగా, రాజకీయ నేతగా కాకుండా.. సింగపూర్ ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ గానే కనిపించారు.
This post was last modified on January 20, 2025 2:41 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…