తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సింగపూర్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దావోస్ లో సోమవారం నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాలుపంచుకునే ముందు.. సింగపూర్ కు వెళ్లిన సీఎం పెట్టుబడులను సాధించే పనిని అప్పుడే మొదలుపెట్టేశారు కూడా. ఇప్పటికే రెండు సింగపూర్ కంపెనీలను తెలంగాణకు రప్పించే దిశగా ఒప్పందాలు సాధించిన రేవంత్… ఆదివారం ఒకింత రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోయారు.
సింగపూర్ సిటీ మధ్యలో ఉన్న నదిలో బోటు షికారుకు రేవంత్ వెళ్లారు. ఈ సందర్బంగా బోటులో నిలుచుని… నదిలో నుంచి తనకు కనిపిస్తున్న భవంతులను చూస్తూ ఆయన పారవశ్యం పొందారు. అయితే అదేదో జల్సా షికారు అయితే కాదు. ఎందుకంటే… సింగపూర్ రివర్ లో బోటు షికారుకు వెళ్లిన రేవంత్… తన వెంట సింగపూర్ అధికారిని కూడా తీసుకుని వెళ్లారు. నదిలో ఆహ్లాదకర వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే… నదిని వారు కాపాడుకుంటున్న తీరు గురించి ఆసక్తిగా విన్నారు.
అలా సింగపూర్ రివర్లో జాలీగా షికారు కొడుతున్న వీడియోను స్వయంగా రేవంతే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా ఆ బోటు షికారులో తాను ఏం గమనించానన్న విషయాన్ని కూడా సదరు పోస్టులో రాసుకొచ్చారు. సింగపూర్ సర్కారు నదిని పునరుద్ధరించిన తీరు, ఆపై దానిని కాపాడుకుంటున్న తీరు… అందుకోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నట్లు వివరించారు. ఆ చర్యలను హైదరాబాద్ కూ అప్లై చేసే దిశగా ఆలోచన చేస్తామని తెలిపారు. ఇక బోటు షికారుకు వెళ్లిన సందర్భంగా కలర్ షర్ట్ వేసిన రేవంత్… ఓ సీఎంగా, రాజకీయ నేతగా కాకుండా.. సింగపూర్ ను చూసేందుకు వచ్చిన టూరిస్ట్ గానే కనిపించారు.
This post was last modified on January 20, 2025 2:41 am
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…