కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నా… పాలక మండలి వ్యవహారాల్లో పెద్దగా ప్రభుత్వ జోక్యం కనిపించదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకున్న దాఖలానే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం… ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై కేంద్రం దృస్టి సారించింది. ఈ పరిణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల జారీ సందర్బంగా ఇటీవలే తిరుపతిలో తొక్కిసలాట జరగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఈ తరహా ఘటన టీటీడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకోగా… కూటమి పార్టీలు, వైసీపీ మధ్య రచ్చ సాగింది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు.
ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే తిరుమలలో లడ్డూ జారీ కౌంటర్లలో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. సార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. అయితే తొక్కిసలాట జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేవదేవుని గడపలో వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భక్తుల్లో ఓ రకమైన భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా టీటీడీ బోర్డు సామర్థ్యంపైనా చర్చ సాగుతోంది.
ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ప్రమాదాలపై దృష్టి సారించింది. అసలు తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకుని రావాలంటూ… అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నసంజీవ్ కుమార్ జిందాల్ ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో జిందాల్ రేపు తిరుమల రానున్నారు. ఆదివారంతో పాటు సోమవారం కూడా ఆయన తిరుమలలోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఘటనలపై వివరాలు సేకరించడంతో పాటుగా… వీటిపై టీటీడీ యంత్రాంగంతో సమీక్షించనున్నారు. జిందాల్ నివేదిక అందిన తర్వాత టీటీడీ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on January 18, 2025 11:18 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…