Political News

వాటీజ్ గోయింగ్ ఆన్?…  టీటీడీపై కేంద్రం నజర్!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నా… పాలక మండలి వ్యవహారాల్లో పెద్దగా ప్రభుత్వ జోక్యం కనిపించదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకున్న దాఖలానే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం… ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై కేంద్రం దృస్టి సారించింది. ఈ పరిణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల జారీ సందర్బంగా ఇటీవలే తిరుపతిలో తొక్కిసలాట జరగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఈ తరహా ఘటన టీటీడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకోగా… కూటమి పార్టీలు, వైసీపీ మధ్య రచ్చ సాగింది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు.

ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే తిరుమలలో లడ్డూ జారీ కౌంటర్లలో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. సార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. అయితే తొక్కిసలాట జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేవదేవుని గడపలో వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భక్తుల్లో ఓ రకమైన భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా టీటీడీ బోర్డు సామర్థ్యంపైనా చర్చ సాగుతోంది.

ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ప్రమాదాలపై దృష్టి సారించింది. అసలు తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకుని రావాలంటూ… అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నసంజీవ్ కుమార్ జిందాల్ ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో జిందాల్ రేపు తిరుమల రానున్నారు. ఆదివారంతో పాటు సోమవారం కూడా ఆయన తిరుమలలోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఘటనలపై వివరాలు సేకరించడంతో పాటుగా… వీటిపై టీటీడీ యంత్రాంగంతో సమీక్షించనున్నారు. జిందాల్ నివేదిక అందిన తర్వాత టీటీడీ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

This post was last modified on January 18, 2025 11:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: TTD

Recent Posts

విమర్శకులను పనితీరుతో కొడుతున్న లోకేష్..!

తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…

2 hours ago

రండి.. కూర్చుని మాట్లాడుకుందాం: ఏపీకి రేవంత్ రెడ్డి పిలుపు

ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…

2 hours ago

షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…

2 hours ago

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

11 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

11 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

12 hours ago