Political News

వాటీజ్ గోయింగ్ ఆన్?…  టీటీడీపై కేంద్రం నజర్!

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి కంకర్యాలు, స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల బాగోగులను పర్యవేక్షఇంచేందుకు ఏర్పాటైనదే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఏపీ ప్రభుత్వమే ఈ పాలక మండలిని ఏర్పాటు చేస్తున్నా… పాలక మండలి వ్యవహారాల్లో పెద్దగా ప్రభుత్వ జోక్యం కనిపించదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటిదాకా టీటీడీ వ్యవహారాల్లో అసలు జోక్యం చేసుకున్న దాఖలానే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం… ఇప్పుడు టీటీడీ వ్యవహారాలపై కేంద్రం దృస్టి సారించింది. ఈ పరిణామంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

వైకుంఠ ద్వార దర్శనం కోసం ఉద్దేశించిన టోకెన్ల జారీ సందర్బంగా ఇటీవలే తిరుపతిలో తొక్కిసలాట జరగింది.ఈ ఘటనలో ఆరుగురు భక్తులు చనిపోయారు. ఈ తరహా ఘటన టీటీడీ చరిత్రలో ఇదే మొదటిది. ఈ ప్రమాదం రాజకీయ రంగు పులుముకోగా… కూటమి పార్టీలు, వైసీపీ మధ్య రచ్చ సాగింది. ఇక ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ తరఫున చైర్మన్ బీఆర్ నాయుడు భక్తులకు క్షమాపణలు చెప్పారు.

ఈ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే తిరుమలలో లడ్డూ జారీ కౌంటర్లలో అగ్ని ప్రమాదం చోటచేసుకుంది. సార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన ఈ ప్రమాదంలో పెద్దగా నష్టమేమీ జరగలేదు. అయితే తొక్కిసలాట జరిగిన రోజుల వ్యవధిలోనే ఈ ఘటన జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దేవదేవుని గడపలో వరుసగా రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడంతో భక్తుల్లో ఓ రకమైన భయాందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా టీటీడీ బోర్డు సామర్థ్యంపైనా చర్చ సాగుతోంది.

ఇలాంటి తరుణంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ టీటీడీ ప్రమాదాలపై దృష్టి సారించింది. అసలు తిరుమలలో ఏం జరుగుతుందో తెలుసుకుని రావాలంటూ… అదనపు కార్యదర్శిగా కొనసాగుతున్నసంజీవ్ కుమార్ జిందాల్ ను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. దీంతో జిందాల్ రేపు తిరుమల రానున్నారు. ఆదివారంతో పాటు సోమవారం కూడా ఆయన తిరుమలలోనే మకాం వేయనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఘటనలపై వివరాలు సేకరించడంతో పాటుగా… వీటిపై టీటీడీ యంత్రాంగంతో సమీక్షించనున్నారు. జిందాల్ నివేదిక అందిన తర్వాత టీటీడీ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 

Satya

Recent Posts

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

6 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

7 hours ago

నమ్మకం టన్నుల్లో… రామ్ చరణ్ మాటల్లో

విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…

8 hours ago

జ‌గ‌న్‌కు క‌విత మ‌ద్ద‌తిస్తున్నారా?

తెలంగాణ నాయ‌కురాలు, తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత తాజాగా చేసిన వ్యాఖ్య‌ల‌పై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున…

8 hours ago

మస్సా మస్సా… లెక్క సరిపోయింది

పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…

8 hours ago

ప‌క్కా మాస్… క‌ల్లు రుచి చూసిన బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. తాజాగా క‌ల్లు రుచి చూశారు. వాస్త‌వానికి ఆయ‌న ఇలాంటి వాటికి క‌డు దూరంగా ఉంటారు. అయితే..…

9 hours ago