Political News

నెవర్ బిఫోర్!… ‘సాక్షి’లో టీడీపీ యాడ్!

తెలుగు మీడియా రంగంలో ఇప్పుడు ఏ పత్రికను చూసినా… ఏ ఛానెల్ ను చూసినా…వాటి వెనుక ఉన్న రాజకీయ పార్టీలు కనిపిస్తున్నాయి. ఇది ఇప్పుడు ఆయా పార్టీలకు అనివార్యంగా మారిపోయిందని కూడా చెప్పక తప్పదు. సరే.. అదెలాగూ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ పత్రికా పఠనంపై ఆసక్తి కలిగిన వారికి ఈ ఉదయం భారీ షాకే తగిలి ఉంటుంది. ఎందుకంటే… వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న సాక్షిపత్రికలో శనివారం టీడీపీ యాడ్ కనిపించింది. అది కూడా ఏదో లోపలి పేజిల్లో కాదు… ఎంచక్కా… ఫస్ట్ పేజీ… ఫుల్ పేజీ యాడ్ టీడీపీదే. వెరసి సాక్షి పత్రిక టీడీపీ పక్షాన చేరిపోయిందా? అన్న సెటైర్లు పడ్డాయి.

అయితే ఈ షాకింగ్ భాగ్యం… ఏపీలోని అన్ని జిల్లాల ప్రజలకు కలగలేదులెంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాసులకు ఈ షాకింగ్ భాగ్యం దక్కింది. ఈ జిల్లాలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లాలోని కొవూరు శాసనసభ్యురాలిగా ఉన్న ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిలు రాజకీయంగా కీలకంగా వ్యవరిస్తున్నారు. వీరే శనివారం నాటి సాక్షి సంచికలో టీడీపీ యాడ్ ను వేయించారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని ఆ దంపతులు ఈ యాడ్ ను సాక్షికి విడుదల చేశారు. నెల్లూరు జిల్లా ఎడిషన్ వరకు మాత్రమే ఈ యాడ్ ప్రచురితమైంది.

సాధారణంగా ఈ తరహా యాడ్ లను సాక్షి తీసుకోదు అని చాలా మంది అనుకుంటారు. ఓ పత్రికగా తన వద్దకు వచ్చిన ప్రకటనకర్తల సమాచారాన్ని, యాడ్ లను సాక్షి ప్రచురించడంలో తప్పేమీ లేదు. తన వద్దకు వచ్చిన ఓ యాడ్ ను తిరస్కరించడం…ఆయా పత్రికల హక్కు అయినప్పటికీ… చట్టవిరుద్ధమైన వ్యవహారాలు మినహా మిగిలిన వాటి యాడ్ లను తిరస్కరించడం పత్రికా ధర్మం అనిపించుకోదు కూడా. ఈ అంచనాలు అన్నీ వేసుకున్న మీదటే సాక్షి ఈ యాడ్ ను స్వీకరించి ఉంటుంది.

ఇక వేమిరెడ్డి దంపతులు జారీ చేసిన ఈ యాడ్…టీడీపీ ప్రాభవాన్ని ఓ రేంజిలో చూపిస్తోంది. ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని టీడీపీ కేంద్ర కార్యాలయం రూపొందించిన యాడ్ నమూనాను వేమిరెడ్డి దంపతులు వాడుకున్నారు యాడ్ లో మధ్యలో ఎన్టీఆర్ తేజస్సుతో వెలిగిపోతుండగా… ఆయనకు ఓ వైపున సీఎం నారా చంద్రబాబునాయుడు, మరో వైపున మంత్రి నారా లోకేశ్ ఫొటోలు ఉన్నాయి. ఇటీవలే పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి కాగా… టీడీపీ సభ్యత్వం కోటి మార్కును దాటిందని, దానితో ఈ ఏడాది ఎన్టీఆర్ కు ఘన నివాళి అర్పిస్తున్నామని చెబుతూ వేమిరెడ్డి దంపతులు ఈ యాడ్ ను జారీ చేశారు.

సాక్షిపేపర్ లో ఇలా ఓ జిల్లాకు చెందిన మెయిన్ ఎడిషన్ లో టీడీపీకి చెందిన యాడ్… ఫుల్ పేజీలో కనిపించిన వైనంపై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. ఈ యాడ్ ను ముద్రించి సాక్షి తన స్థాయిని దిగజార్చుకుందని, ఎవరైనా తమ కిందకు రావాల్సిందేనన్న రీతిలో టీడీపీ యాక్టివిస్టులు పేర్కొంటున్నారు. అయితే ఇందులో తప్పేముంది… గతంలో ఈనాడులో వైసీపీ యాడ్లు రాలేదా? అంటూ వైసీపీ యాక్టివిస్టులు సమాధానమిస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో దీనిపై పెద్ద రచ్చే నడుస్తోంది.

This post was last modified on January 18, 2025 10:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రేవంత్ రెడ్డి `వ‌న్ మ్యాన్ ఆర్మీ`… సరిపోవట్లేదా?

తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్‌లో వ‌న్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి క‌నిపిస్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని అధికారంలోకి…

4 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో ఎవరిది పైచేయి?

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో ఒక‌ప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న టాక్ వినిపిస్తోంది. కీల‌క నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

4 hours ago

క‌ర‌ణం `క‌ల‌` ఏమైంద‌బ్బా ..!

క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణ‌మూర్తి.. రాజ‌కీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌. కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్‌ను ఎమ్మెల్యేగా చూసుకోవాల‌న్న…

8 hours ago

ఏలా చూసినా… మన సీట్లు పెరుగుతాయి

నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…

8 hours ago

RRR వల్ల కానిది దురంధర్ చేయగలదా

బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…

9 hours ago

అక్కడ నెలకు రెండు సార్లు జీతం? ఇదేదో బాగుందే..

ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…

9 hours ago