తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలలొ ఇప్పటి వరకు కొన్ని మాత్రమే అమలు చేసింది. ఇంకా మిగిలినవి చాలానే ఉన్నాయి. అయితే.. ఎప్పటికప్పుడు వాటిని అమలు చేస్తామని చెబుతున్నారే తప్ప. అమలు విషయంపై దృస్టి పెట్టడం లేదు. దీనికి కారణం… ఫైనా న్స్ ప్రాబ్లమే! ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత బస్సు వ్యవహారం సర్కారుకు తలనొప్పిగా మారింది. అయినా.. పంతం కొద్దీ దీనిని కొనసాగిస్తున్నారు.
మరోవైపు గ్యారెంటీల అమలుపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. మరోవైపుఎన్నికలు ముంచుకువస్తున్నాయి. స్థానిక సంస్థల్లో సత్తా చాటాలంటే.. ఖచ్చితంగా ఆయా పథకాల్లో కొన్నింటినైనా గాడిలో పెట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కొన్ని పథకాలకు ఈ నెల 26(గణతంత్ర దినోత్సవం) నుంచి అమలు చేయాలని నిర్ణయించి నట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధానంగా ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా- పంట పెట్టుబడి సాయం ఇవ్వాలని తద్వారా ఖరీఫ్కు సానుకూలంగా ఉంటుందని రైతులకుమేలు చేస్తుందని భావిస్తున్నారు. అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాను కూడా అమలు చేయనున్నట్టు సమాచారం. ఇక, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను అమలు చేయనున్నారు.
ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారు చేయనున్నట్టు తెలిసింది. లబ్ధి దారులను ఫీల్డ్ సర్వే ద్వారా రెండు నుంచి మూడు వడపోతల్లో ఎంపిక చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే.. వీటికి సొమ్ములు ఎక్కడ నుంచి తెస్తారన్నది చూడాలి. ఏదేమైనా.. ప్రతిపక్షాల విమర్శల నుంచి కొంతలో కొంతైనా తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు సంకేతాలు వస్తున్నాయి.
This post was last modified on January 17, 2025 4:38 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…