ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది ఒకప్పటి నటి, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన ఖుష్బూ తన పాత పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే భాజపా తీర్థం పుచ్చుకున్న ఆమె.. వెంటనే తన పూర్వ పార్టీ మీద విమర్శలు గుప్పించారు. తాను ఇన్ని రోజులూ మానసిక వికలాంగుల పార్టీలో ఉన్నానని.. ఇప్పుడు దాన్నుంచి బయటపడ్డానని ఆమె వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యల కారణంగా ఖుష్బూ మీద ఒకేసారి 30కి పైగా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
ఖుష్బూ వ్యాఖ్యలు దివ్యాంగులను అవమానించేలా ఉన్నాయంటూ ఆ వర్గానికి చెందిన వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు ఒకేసారి తమిళనాడులోని 30 పోలీస్ స్టేషన్లలో ఖుష్బూపై ఫిర్యాదు చేశారు. అలాగే కుష్బూపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయానికీ ఫిర్యాదు వెళ్లింది. చెన్నై, కంజిపురం, చెంగల్పేట, మధురై, కోయంబత్తూరు, తిరువూర్ తదితర ప్రాంతాల్లో ఖుష్బూపై కేసులు పెట్టారు. రాజకీయ ప్రత్యర్థులపై ఏమైనా మాట్లాడే హక్కు కుష్భూకు ఉన్నప్పటికీ.. అంగ వైకల్యం ఉన్న వారిని కించపరిచేలా పదాలను ఉపయోగించడం ఆమోద యోగ్యం కాదని వారంటున్నారు. ఈ ఫిర్యాదులపై ఖుష్బూ ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఉత్తరాది అమ్మాయే అయినప్పటికీ తమిళ సినిమాల్లో కథానాయికగా ఒక వెలుగు వెలిగిన ఖుష్బూ.. ఆ తర్వాత దర్శకుడు సుందర్ను పెళ్లాడింది. హీరోయిన్ వేషాలకు గుడ్ బై చెప్పేశాక ఆమె అడపాదడపా కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసింది. స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో నటించింది.
దశాబ్దం కిందట డీఎంకే పార్జీతో ఖుష్బూ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కుష్బూ…2014లో ఆ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంది. అప్పటి నుంచి కాంగ్రెస్ ప్రచార కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె.. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తనకు టికెట్ ఇవ్వకపోవడం, పార్టీలో ప్రాధాన్యం తగ్గడం పట్ల కినుక వహించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీకి గుడ్బై చెప్పి భాజపాలో చేరింది.
This post was last modified on October 15, 2020 6:39 pm
రెండేళ్ల క్రితం 'ప్రేమలు' విడుదలైనప్పుడు అందులో హీరోకన్నా ఎక్కువ పేరు వచ్చింది మమిత బైజుకే. హుషారైన నటన, జెన్ జీని…
సినీ రంగంలో తమకు అవకాశాలు ఇచ్చిన వాళ్ల మీద కొందరు ఎంతో అభిమానం, కృతజ్ఞత చూపిస్తుంటారు. అందులో ఒక్కొక్కరు ఒక్కో…
చిన్న సినిమాలకు రిలీజ్ రోజు కంటే ఒకటి రెండు రోజుల ముందే పెయిడ్ ప్రిమియర్స్ ఎప్పట్నుంచో చూస్తున్నాం. ఐతే పెద్ద…
బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో నిద్రలేదు.…
ప్రస్తుతం నైజామ్ సింగల్ స్క్రీన్లలో పర్సెంటెజ్ విధానం తీసుకురావడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు రెండుగా చీలిపోయిన సంగతి తెలిసిందే.…
తెలుగు సినిమా చరిత్రలో ఎంతోమంది దిగ్గజ దర్శకులున్నారు. వారిలో సింగీతం శ్రీనివాసరావుది ప్రత్యేకమైన శైలి. ఆయన చేసినన్ని ప్రయోగాలు ఇండియన్…