Political News

బీటెక్ వర్సెస్ రెడ్డమ్మ… కడపలో కొత్త కొట్లాట

కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాపై జగన్ పట్టును తగ్గించేందుకు టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ వర్గాలు రచిస్తున్న ప్లాన్లతో.. కడపలో ఏ చిన్న ఘటన జరిగినా సంచలమే అవుతోంది. తాజాగా గురువారం… ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.

కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల పరిధిలోని ఇసుక క్వారీ కోసం గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కడప ఎమ్మెల్యే గా ఉన్న రెడ్డప్పగారి మాధవి, పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోటీ పడ్డారు. ఈ ఇద్దరు నేతలు అక్కడ కనిపించనున్న.. వారి అనుచరులు మాత్రం హల్చల్ చేసారు. టెండర్లు దాఖలు చేయకుండా ఒకరిని మరొకరు అడ్డుకున్నారు.

ఈ సందర్బంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ పరిధిలోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వేదికగా రవి, మాధవి వర్గాల మధ్య గొడవ జరుగుతోందన్న వార్తలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఎవరి టెండర్లు వారు దాఖలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

This post was last modified on January 17, 2025 4:12 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

29 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago