కడపలో ఎం జరిగినా సంచలనమే అవుతోంది. ఈ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కావడం, జిల్లాపై జగన్ పట్టును తగ్గించేందుకు టీడీపీ అమలు చేస్తున్న వ్యూహాలు, వాటిని తిప్పికొట్టేందుకు వైసీపీ వర్గాలు రచిస్తున్న ప్లాన్లతో.. కడపలో ఏ చిన్న ఘటన జరిగినా సంచలమే అవుతోంది. తాజాగా గురువారం… ఇందుకు భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.
కడపలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం కేంద్రంగా జరిగిన ఈ ఘటనలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లాలోని సిద్దవటం మండలం గుండ్లమూల పరిధిలోని ఇసుక క్వారీ కోసం గనుల శాఖ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్లను దక్కించుకునేందుకు కడప ఎమ్మెల్యే గా ఉన్న రెడ్డప్పగారి మాధవి, పులివెందుల నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోటీ పడ్డారు. ఈ ఇద్దరు నేతలు అక్కడ కనిపించనున్న.. వారి అనుచరులు మాత్రం హల్చల్ చేసారు. టెండర్లు దాఖలు చేయకుండా ఒకరిని మరొకరు అడ్డుకున్నారు.
ఈ సందర్బంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టరేట్ పరిధిలోని గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయం వేదికగా రవి, మాధవి వర్గాల మధ్య గొడవ జరుగుతోందన్న వార్తలు ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా వైరల్ గా మారిపోయాయి.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. ఆ తర్వాత ఇరు వర్గాలు ఎవరి టెండర్లు వారు దాఖలు చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…