తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు సంబంధించి ఈడీ కీలక అడుగులు వేస్తుండగా, అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ సమయంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు సీరియస్ గా మారింది. అయితే, తనపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఈ విచారణలో ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుందని సమాచారం. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడంతో పాటు, సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోలేమని స్పష్టమైన ప్రకటన చేసింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవ్వడం, ఇప్పుడు అనూహ్యంగా హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా మరింత ఉత్కంఠను పెంచింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే, కేటీఆర్ విచారణ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండటాన్ని అనేకమంది ప్రత్యేకంగా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి రాజకీయ పరోక్ష అర్థాలు లేకపోలేదని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈడీ కేటీఆర్ను మరింత ప్రశ్నించేందుకు సిద్ధమవుతుండటంతో, ఈ విచారణ ఎటువంటి మలుపు తీసుకుంటుందన్నది త్వరలోనే స్పష్టత వస్తుంది. మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్కు మద్దతుగా నిలుస్తూ, ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండిస్తున్నాయి.
This post was last modified on January 16, 2025 4:06 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…