తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణకు సంబంధించి ఈడీ కీలక అడుగులు వేస్తుండగా, అదే సమయంలో బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ సమయంలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ కేసు సీరియస్ గా మారింది. అయితే, తనపై రాజకీయ కక్ష సాధింపుతోనే కేసు పెట్టారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే, ఈ విచారణలో ఈడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తుందని సమాచారం. దీనికి సంబంధించి హైకోర్టులో కేసు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించడంతో పాటు, సుప్రీంకోర్టు కూడా కలగజేసుకోలేమని స్పష్టమైన ప్రకటన చేసింది.
ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరవ్వడం, ఇప్పుడు అనూహ్యంగా హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా మరింత ఉత్కంఠను పెంచింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనకు సంబంధించి ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. అయితే, కేటీఆర్ విచారణ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండటాన్ని అనేకమంది ప్రత్యేకంగా గమనిస్తున్నారు. దీనికి సంబంధించి రాజకీయ పరోక్ష అర్థాలు లేకపోలేదని భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఈడీ కేటీఆర్ను మరింత ప్రశ్నించేందుకు సిద్ధమవుతుండటంతో, ఈ విచారణ ఎటువంటి మలుపు తీసుకుంటుందన్నది త్వరలోనే స్పష్టత వస్తుంది. మరోవైపు, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్కు మద్దతుగా నిలుస్తూ, ఈ ఆరోపణలను నిరాధారమైనవిగా ఖండిస్తున్నాయి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…