సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం.. కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తినే పండుగ కూడా సంక్రాంతే. ఇక, కల వారి విషయానికి వస్తే.. 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా.. బట్టలు కొనుగోలు చేసి ధరించే పండుగ కూడా! కానీ, మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన సతీమణికి చేనేత చీరను కొనుగోలు చేసి కానుకగా ఇచ్చారు. దీని ఖరీదు 1300 లుగా పేర్కొన్నారు.
నిజానికిఇంత తక్కువ ఖరీదు దుస్తులు కట్టుకునే పరిస్థితిలో అయితే.. నారా కుటుంబం లేదు కదా! కానీ.. నారా లోకేష్ మాత్రం అంతే ఖరీదు పెట్టి ఆమెకు చీరను కొనుగోలు చేసి ఇచ్చారు. దీనికి కారణంగా.. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో చేనేతకు పెట్టింది పేరు. ఇక్కడ నేసే చీరలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే.. ప్రభుత్వాల నుంచిసరైన సహకారం తమకు లభించడం లేదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ గెలిచిన తర్వాత నుంచిఇక్కడి వస్త్రాలను కార్మికులను కూడా ప్రోత్సహిస్తున్నారు.
దీనిలో భాగంగానే తరచుగా చేనేతలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక, అవకాశం ఉన్న ప్రతిసారీ.. తన కుటుంబానికి ఇక్కడి వారి చీరలను, దుస్తులనే కొనుగోలు చేస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని నారా బ్రాహ్మణికి రూ.1300 విలువ చేసే చేనేతను స్వయంగా కొనగోలు చేసి.. కానుకగా అందించారు. ఇది విలువ తక్కువ కాదని.. నైపుణ్యం ఎక్కువగా ఉన్న చీరని నారా లోకేష్ పేర్కొన్నారు.
బంగారు, తెలుగు వర్ణం మిక్సింగ్తో రూపొందించిన ఈ చీర అద్భుతంగా ఉందని బ్రాహ్మణి మురిసిపోయారు. ఇక, నారా లోకేష్ కూడా ఇక్కడ వారు నేసిన వస్త్రాలతో నే తనకు, తన కుమారుడికి కూడా దుస్తులు కుట్టించుకున్నారు. మొత్తానికి చేనేతకు అప్పకటిత బ్రాండ్ అంబాసిడర్గా నారా లోకేష్ మారారని కార్మికులు చెబుతున్నారు.
This post was last modified on January 15, 2025 1:04 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…