సంక్రాంతి పండుగ అంటేనే అందరికీ వేడుక. కలవారు.. లేనివారు అనే తేడా లేకుండా చేసుకునే పండుగ ఇది. కనీసంలో కనీసం.. కొత్త బట్టలు కట్టుకుని కడుపు నిండా తినే పండుగ కూడా సంక్రాంతే. ఇక, కల వారి విషయానికి వస్తే.. 50 వేల రూపాయలకు తక్కువ కాకుండా.. బట్టలు కొనుగోలు చేసి ధరించే పండుగ కూడా! కానీ, మంత్రిగా ఉన్న నారా లోకేష్ తన సతీమణికి చేనేత చీరను కొనుగోలు చేసి కానుకగా ఇచ్చారు. దీని ఖరీదు 1300 లుగా పేర్కొన్నారు.
నిజానికిఇంత తక్కువ ఖరీదు దుస్తులు కట్టుకునే పరిస్థితిలో అయితే.. నారా కుటుంబం లేదు కదా! కానీ.. నారా లోకేష్ మాత్రం అంతే ఖరీదు పెట్టి ఆమెకు చీరను కొనుగోలు చేసి ఇచ్చారు. దీనికి కారణంగా.. తన సొంత నియోజకవర్గం మంగళగిరిలో చేనేతకు పెట్టింది పేరు. ఇక్కడ నేసే చీరలకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. అయితే.. ప్రభుత్వాల నుంచిసరైన సహకారం తమకు లభించడం లేదని ఇక్కడి వారు చెబుతున్నారు. ఈ క్రమంలో నారా లోకేష్ గెలిచిన తర్వాత నుంచిఇక్కడి వస్త్రాలను కార్మికులను కూడా ప్రోత్సహిస్తున్నారు.
దీనిలో భాగంగానే తరచుగా చేనేతలను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇక, అవకాశం ఉన్న ప్రతిసారీ.. తన కుటుంబానికి ఇక్కడి వారి చీరలను, దుస్తులనే కొనుగోలు చేస్తున్నారు. తాజాగా సంక్రాంతిని పురస్కరించుకుని నారా బ్రాహ్మణికి రూ.1300 విలువ చేసే చేనేతను స్వయంగా కొనగోలు చేసి.. కానుకగా అందించారు. ఇది విలువ తక్కువ కాదని.. నైపుణ్యం ఎక్కువగా ఉన్న చీరని నారా లోకేష్ పేర్కొన్నారు.
బంగారు, తెలుగు వర్ణం మిక్సింగ్తో రూపొందించిన ఈ చీర అద్భుతంగా ఉందని బ్రాహ్మణి మురిసిపోయారు. ఇక, నారా లోకేష్ కూడా ఇక్కడ వారు నేసిన వస్త్రాలతో నే తనకు, తన కుమారుడికి కూడా దుస్తులు కుట్టించుకున్నారు. మొత్తానికి చేనేతకు అప్పకటిత బ్రాండ్ అంబాసిడర్గా నారా లోకేష్ మారారని కార్మికులు చెబుతున్నారు.
This post was last modified on January 15, 2025 1:04 pm
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…