Political News

ఎన్నికల వేళ కేజ్రీ కి ఈడీ చిక్కులు?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఎన్నికల్లో ఆప్ ఫేవరేట్ గానే బరిలోకి దిగింది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న ఆప్… హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఈ వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఓ రేంజ్ లో పావులు కదుపుతోంది. ఆప్ ను ఎదుర్కోవడం బీజేపీ కి ఈ దఫా కూడా కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నా.. ఎలాగైనా ఆప్ ను ఓడించి తీరాలన్న కసి బీజేపీ లో కనిపిస్తోంది.

ఇలాంటి కీలక తరుణంలో ఆప్ ను సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి మంజూరు చేసింది.

సరిగ్గా ఎన్నికల ముందు ఈ పరిణామం ఆప్ కు పెను ప్రతిబంధకము అని చెప్పాలి. కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు సిద్దమైన రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే,.. కేజ్రీవాల్ కు మరోవైపు నుంచి కూడా ముప్పు పొంచి ఉంది, ఢిల్లీలో ఎన్నికల వేళ శాంతి భద్రతలను విచ్చిన్నం చేసే దిశగా కదులుతున్న ఖలిస్థాన్ మూకలు కేజ్రీ ని టార్గెట్ చేశాయట. ఈ మేరకు నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసాయి.

ఇలా కీలకమైన ఎన్నికల వేళ… ఓ వైపు కేంద్రం నుంచి విచారణలకు అనుమతులు, ఖలిస్తాని ఉగ్రవాదుల నుంచి నేరుగా కేజ్రీకి ప్రాణ హాని పొంచి ఉండటం ఆప్ కు పెను కష్టాలే స్వగతం చెబుతున్నాయని చెప్పాలి. ఈ సమస్యలను అధిగమించి ఆప్ ఎలా రాణిస్తుందన్న ఆసక్తి నెలకొంది.

This post was last modified on January 15, 2025 12:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

12 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

56 minutes ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

1 hour ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

2 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

2 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

3 hours ago