Political News

ఎన్నికల వేళ కేజ్రీ కి ఈడీ చిక్కులు?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం ఎన్నికల హీట్ ఉడికిస్తోంది. అదే సమయంలో అధికార పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని సమస్యలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఎన్నికల్లో ఆప్ ఫేవరేట్ గానే బరిలోకి దిగింది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న ఆప్… హ్యాట్రిక్ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది.

ఈ వ్యూహాలను తిప్పికొట్టేందుకు బీజేపీ ఓ రేంజ్ లో పావులు కదుపుతోంది. ఆప్ ను ఎదుర్కోవడం బీజేపీ కి ఈ దఫా కూడా కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నా.. ఎలాగైనా ఆప్ ను ఓడించి తీరాలన్న కసి బీజేపీ లో కనిపిస్తోంది.

ఇలాంటి కీలక తరుణంలో ఆప్ ను సమస్యలు చుట్టుముట్టాయి. ఓ వైపు ఢిల్లీ లిక్కర్ కేసు లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతి మంజూరు చేసింది.

సరిగ్గా ఎన్నికల ముందు ఈ పరిణామం ఆప్ కు పెను ప్రతిబంధకము అని చెప్పాలి. కేజ్రీవాల్ నామినేషన్ వేసేందుకు సిద్దమైన రోజే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే,.. కేజ్రీవాల్ కు మరోవైపు నుంచి కూడా ముప్పు పొంచి ఉంది, ఢిల్లీలో ఎన్నికల వేళ శాంతి భద్రతలను విచ్చిన్నం చేసే దిశగా కదులుతున్న ఖలిస్థాన్ మూకలు కేజ్రీ ని టార్గెట్ చేశాయట. ఈ మేరకు నిఘా వర్గాలు ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసాయి.

ఇలా కీలకమైన ఎన్నికల వేళ… ఓ వైపు కేంద్రం నుంచి విచారణలకు అనుమతులు, ఖలిస్తాని ఉగ్రవాదుల నుంచి నేరుగా కేజ్రీకి ప్రాణ హాని పొంచి ఉండటం ఆప్ కు పెను కష్టాలే స్వగతం చెబుతున్నాయని చెప్పాలి. ఈ సమస్యలను అధిగమించి ఆప్ ఎలా రాణిస్తుందన్న ఆసక్తి నెలకొంది.

This post was last modified on January 15, 2025 12:43 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

సాయిపల్లవి బరిలో ఉంటే అవార్డ్ ఇవ్వాల్సిందే

హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…

37 minutes ago

‘పవన్ హఠావో’ రచయిత మృతి కేసు మిస్టరీ వీడింది

“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…

1 hour ago

విన్యాసం మీదే బాక్సాఫీస్ ఆశలు

గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…

1 hour ago

ఇటు వివాదం… అటు ముహూర్తం

జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…

1 hour ago

కమల్ హీరో… రజినీ విలన్?

సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్‌ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…

2 hours ago

ప్రేమ పెళ్ళి.. తల్లిదండ్రులకు సమాచారం తప్పనిసరి

వివాహ నమోదు నిబంధనల్లో మార్పులు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చింది. పెళ్లి నమోదు చేసుకునే జంటలు…

3 hours ago