జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు పటాపంచలు అవుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఫుల్ టైమ్ పాలిటిక్స్ కోసం రాలేదని.. పార్ట్టైమ్ పాలిటిక్స్ చేస్తాడని ఎన్నికల్లో ఆయన మాటలు విని మోసపోవద్దని రోజా, కొడాలి నాని, పేర్ని నాని సహా.. పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. మరికొందరు సామాజిక వర్గం వారిగా కూడా విమర్శలు గుప్పించారు.
కాపుల ఓట్లను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ..పవన్పై విరుచుకు పడ్డారు. ఇక, కాపు నాయకులు, వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న వారు అయితే.. ఎన్నికలకు ముందు పొత్తులపైనా విషాన్ని చిమ్మారని జనసేన నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. సీఎం పోస్టు ఇవ్వాలని పట్టుబట్టాలని, మొత్తం 175 సీట్లలో 50కిపైగా సీట్లలో జనసేన పోటీ చేయాలని ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటివారు.. లేఖలు సంధించారు.
కట్ చేస్తే.. పవన్ వారి ఒత్తిళ్లకు లొంగలేదు. వారు చేసిన విమర్శలను కూడా పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదన్న ఏకైక అజెండాతో ముందుకు సాగారు. పట్టుబట్టి బీజేపీని పొత్తులోకి లాక్కొచ్చారు. ఇక, ఎన్నికల్లో విజయం తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. సత్తా చూపిస్తున్నారు. ఎవరైతే పార్ట్ టైమ్పొలిటీషియన్ అని విమర్శలు చేశారో.. వారి నోటికి తాళాలు వేశారు.
పాలనపై పట్టు సాగించడమే కాకుండా.. గత ఆరు మాసాలుగా ఆయన పూర్తిస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉన్నారు. అంతేకాదు.. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. జనసేన నాయకులు దారి తప్పకుండా కూడా మరోవైపు కాచుకుంటున్నారు.
ప్రభుత్వపరంగా అభివృద్ధి ప్రాధాన్య ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. మొత్తంగా పవన్ తనపై వచ్చిన మరకలను తుడిచేసుకోవడమే కాదు.. తానేంటనేది నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 14, 2025 1:14 pm
అల్లరి నరేష్ కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్కు ‘నాంది’ శుభారంభం పలికినా.. ఆ తర్వాత అతను నటించిన చిత్రాలేవీ ఆశించిన విజయాలందుకోలేరు.…
ఫస్ట్ గ్లింప్స్ రిలీజైన దగ్గర్నుంచి ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రేక్షకులకు షాకుల మీద షాకులు ఇస్తూనే ఉంది. ఇందులో నాని…
ప్రభాస్ దర్శకుల ఎంపిక ఎప్పుడూ ఒకే లెక్కలో ఉండదు. తన మార్కెట్కు సరిపోయే టాప్ డైరెక్టర్లతోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ…
టాలీవుడ్లో వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కూడా చాలామంది గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు. హిట్టు కోసం ప్రయత్నం ఆపట్లేదు.…
రాష్ట్రంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోతుంది. కన్నూ మిన్నూ కానకుండా విచ్చలవిడిగా దారుణాలకు పాల్పడుతుంది. గంజాయి మత్తులో జరుగుతున్న నేరాలు, ఘోరాలు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి చాలా కష్టపడి పెద్ద స్టార్లలో ఒకడిగా ఎదిగాడు మాస్…