జనసేన అధినేత పవన్ కల్యాణ్పై గతంలో వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు పటాపంచలు అవుతున్నాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు పవన్ కల్యాణ్పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఫుల్ టైమ్ పాలిటిక్స్ కోసం రాలేదని.. పార్ట్టైమ్ పాలిటిక్స్ చేస్తాడని ఎన్నికల్లో ఆయన మాటలు విని మోసపోవద్దని రోజా, కొడాలి నాని, పేర్ని నాని సహా.. పలువురు నాయకులు విమర్శలు గుప్పించారు. మరికొందరు సామాజిక వర్గం వారిగా కూడా విమర్శలు గుప్పించారు.
కాపుల ఓట్లను చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టేందుకు రాజకీయాలు చేస్తున్నారంటూ..పవన్పై విరుచుకు పడ్డారు. ఇక, కాపు నాయకులు, వైసీపీ సానుభూతిపరులుగా ఉన్న వారు అయితే.. ఎన్నికలకు ముందు పొత్తులపైనా విషాన్ని చిమ్మారని జనసేన నాయకులు ఆరోపించిన విషయం తెలిసిందే. సీఎం పోస్టు ఇవ్వాలని పట్టుబట్టాలని, మొత్తం 175 సీట్లలో 50కిపైగా సీట్లలో జనసేన పోటీ చేయాలని ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్య వంటివారు.. లేఖలు సంధించారు.
కట్ చేస్తే.. పవన్ వారి ఒత్తిళ్లకు లొంగలేదు. వారు చేసిన విమర్శలను కూడా పట్టించుకోలేదు. ఎన్నికల సమయంలో వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలకూడదన్న ఏకైక అజెండాతో ముందుకు సాగారు. పట్టుబట్టి బీజేపీని పొత్తులోకి లాక్కొచ్చారు. ఇక, ఎన్నికల్లో విజయం తర్వాత.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను డిప్యూటీ సీఎం అయిన తర్వాత.. సత్తా చూపిస్తున్నారు. ఎవరైతే పార్ట్ టైమ్పొలిటీషియన్ అని విమర్శలు చేశారో.. వారి నోటికి తాళాలు వేశారు.
పాలనపై పట్టు సాగించడమే కాకుండా.. గత ఆరు మాసాలుగా ఆయన పూర్తిస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి కూడా అందుబాటులో ఉన్నారు. అంతేకాదు.. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందిస్తున్నారు. జనసేన నాయకులు దారి తప్పకుండా కూడా మరోవైపు కాచుకుంటున్నారు.
ప్రభుత్వపరంగా అభివృద్ధి ప్రాధాన్య ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా.. మొత్తంగా పవన్ తనపై వచ్చిన మరకలను తుడిచేసుకోవడమే కాదు.. తానేంటనేది నిరూపిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on January 14, 2025 1:14 pm
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’లో ప్రగ్యా జైశ్వాల్ కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే.…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపు గురించి ఇటీవల పెద్ద చర్చే జరుగుతోంది. ఆల్రెడీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పెరుగుతున్న…