Political News

తెలంగాణకు సిసలైన సంక్రాంతి వచ్చింది…!

తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు.

ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే చెందిన పల్లె గంగా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన నేరుగా పలు పంచుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన వారే ఈ గంగా రెడ్డి. ఈ గ్రామంలోనే అత్యధిక సంఖ్యలో పసుపు రైతులు ఉన్నారు.

మరోవైపు నిజామాబాద్ ఎంపీ గా కొనసాగుతున్న బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన అరవింద్… తనను గెలిపిస్తే రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకుని వస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ హామీతోనే ఆ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ఆయన ఓడించారు. ఎన్నికల్లో గెలవగానే నిజామాబాద్ కు పసుపు బోర్డు ను తీసుకురావడానికి ఆయన తీవ్రంగానే కృషి చేశారు. అయితే 2024 ఎన్నికలదాకా అదుగో ఇదుగో అంటూ కేంద్రం సాగదీసింది. అయినా కూడా అరవింద్ ను నిజామాబాద్ ప్రజలు రెండోసారి కూడా ఎంపీ గా గెలిపించారు. దీంతో అరవింద్ ఒత్తిడితో కేంద్రం తాజాగా పసుపు బోర్డు ను ప్రారంభించేందుకు ఒప్పుకుంది.

This post was last modified on January 14, 2025 9:31 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

బాలయ్య దర్శకులకు అసలైన సవాల్

​నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…

7 minutes ago

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా…

25 minutes ago

ప్ర‌శంస‌లేనా.. ఛాన్సులూ ఇస్తారా?

80, 90 ద‌శ‌కాల్లో వైభ‌వం చూసిన క‌థానాయ‌కుల్లో రాజ‌శేఖ‌ర్ ఒక‌రు. స్వ‌త‌హాగా త‌మిళుడైన‌ప్ప‌టికీ.. తెలుగులోనే ఆయ‌న పెద్ద హీరోగాఎదిగారు. అంకుశం,…

43 minutes ago

వరల్డ్ ఫేమస్ సింగర్… హఠాత్తుగా ఇండియాలో ఎందుకు?

గ్లోబల్ పాప్ సెన్సేషన్ రిహానా పేరు వింటేనే ఒక రేంజ్ వైబ్ గుర్తొస్తుంది. అలాంటిది ఈ ఇంటర్నేషనల్ స్టార్ సడన్‌గా…

54 minutes ago

ఆర్టీసీ స‌మ్మె… అసలు కారణం ఇదేనా?

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె వెనుక ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశం, వాటి నిర్వహణ విధానం.. త‌ద్వారా ఉద్యోగాల‌కు పొంచి…

2 hours ago

నాయకుడు బయటికి వచ్చేది ఎప్పుడు

తమిళనాడు ఎన్నికలు నిన్నటితో అయిపోయాయి. ఫలితాలు రావడానికి ఇంకా పది రోజులు టైం ఉండటంతో ఇండస్ట్రీ, పొలిటికల్ వర్గాలు రిలాక్స్…

2 hours ago