తెలుగు నేలలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు హోరెత్తుతున్నాయి. ఈ పండుగ వేళ తెలంగాణకు నిజంగానే అదిరిపోయే గిఫ్ట్ దక్కిందని చెప్పాలి. ఏళ్ల తరబడి తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డు సరిగ్గా సంక్రాంతి పర్వదినాన నిజామాబాద్ లో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ గా ఢిల్లీ నుంచి బోర్డు ను ప్రారంభించనున్నారు.
ఇదిలా ఉంటే.. జాతీయ పసుపు బోర్డు చైర్మన్ గా నిజామాబాద్ కే చెందిన పల్లె గంగా రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఇప్పటికే కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. నేడు పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో ఆయన నేరుగా పలు పంచుకోనున్నారు. నిజామాబాద్ జిల్లా అంకాపూర్ కు చెందిన వారే ఈ గంగా రెడ్డి. ఈ గ్రామంలోనే అత్యధిక సంఖ్యలో పసుపు రైతులు ఉన్నారు.
మరోవైపు నిజామాబాద్ ఎంపీ గా కొనసాగుతున్న బీజేపీ యువనేత ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థి గా బరిలోకి దిగిన అరవింద్… తనను గెలిపిస్తే రాష్ట్రానికి పసుపు బోర్డు తీసుకుని వస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ హామీతోనే ఆ ఎన్నికల్లో బలమైన అభ్యర్థిగా బరిలోకి దిగిన కవితను ఆయన ఓడించారు. ఎన్నికల్లో గెలవగానే నిజామాబాద్ కు పసుపు బోర్డు ను తీసుకురావడానికి ఆయన తీవ్రంగానే కృషి చేశారు. అయితే 2024 ఎన్నికలదాకా అదుగో ఇదుగో అంటూ కేంద్రం సాగదీసింది. అయినా కూడా అరవింద్ ను నిజామాబాద్ ప్రజలు రెండోసారి కూడా ఎంపీ గా గెలిపించారు. దీంతో అరవింద్ ఒత్తిడితో కేంద్రం తాజాగా పసుపు బోర్డు ను ప్రారంభించేందుకు ఒప్పుకుంది.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…