Political News

రాజధాని కేసుల విచారణ ప్రత్యక్షప్రసారం చేస్తారా ?

రాజధాని అమరావతి కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేస్తారా ? ఇదో ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే రాజధాని అమరావతికి అనుకూలంగాను వ్యతిరేకంగాను చాలా కేసులు హైకోర్టులో దాఖలయ్యాయి. మొత్తంమీద రాజధాని వివాదంపై సుమారు 144 కేసులు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు రోజువారి విచారాణకు రెడీ అయ్యింది. ఈ నేపధ్యంలోనే విజయవాడకు చెందిన లా స్టూడెంట్ వేమూరు లీలాకృష్ణ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. లీలాకృష్ణ బెనారస్ యూనివర్సిటిలో లా చదువుతున్నారు.

దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన కేసు కాబట్టి అమరావతి రాజధాని విచారణను ప్రత్యక్షప్రసారం చేయాలంటూ ఈ విద్యార్ధి హైకోర్టును అభ్యర్ధించారు. విచారణ జరుగుతున్నపుడు ప్రభుత్వ వాదనేంటి, ప్రతిపక్షాలు, ప్రత్యర్ధుల వాదనేంటి అనే విషయాలను తెలుసుకోవాలని జనాల్లో ఆసక్తి ఎక్కువగా ఉందని లీలాకృష్ణ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి వాద ప్రతివాదనలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే అందరూ నేరుగా చూసే అవకాశం ఉంటుందన్నారు. లీలాకృష్ణ అభ్యర్ధను కోర్టు సానుకూలంగా స్పందించే అవకాశం కూడా ఉందనే ప్రచారం మొదలైంది.

ఎందుకంటే ఇఫ్పటికే పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాలను లైవ్ టెలికాస్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తమ నియోజకవర్గ ప్రతినిధి అసెంబ్లీలో ఏ విధంగా సమస్యలను ప్రస్తావిస్తున్నారనే విషయాన్ని ప్రజలందరు గమనిస్తున్నారు. సభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన, వాగ్ధాటి, సమస్యలను ప్రస్తావించే విధానం తదితరాలను జనాలందరు చూస్తున్నారు. కాబట్టి ఇదే పద్దతిలో కోర్టులో జరిగే వాద ప్రతివాదనలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఈ విద్యార్ధి భావించినట్లుంది. అందుకనే హైకోర్టులో ఓ పిటీషన్ వేశారు. మరి కోర్టు ఏమంటుందో చూడాలి.

This post was last modified on October 15, 2020 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిన్న తర్వాత ఈ ఒక్క పని చేస్తే మీ ఆరోగ్యం పదిలం..

మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…

16 minutes ago

బాలయ్య పుట్టిన రోజు కానుకలు ఇవేనా?

నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…

3 hours ago

కన్నడ నుంచి మరో బిగ్ మూవీ

ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…

6 hours ago

ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…

9 hours ago

పొట్ట తగ్గటానికి ఈ పండ్లు తింటే చాలు

ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…

10 hours ago

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మంత్రులు

ఏపీ మంత్రి వ‌ర్గంలో సీఎం చంద్ర‌బాబు గీస్తున్న ల‌క్ష్మ‌ణ రేఖ‌ల‌కు.. ఆయ‌న ఆదేశాల‌కు కూడా.. పెద్ద‌గా రెస్పాన్స్ ఉండ‌డం లేద‌ని…

10 hours ago