Political News

మహా కుంభమేళా.. యూపీ ప్రభుత్వానికి ఊహించని ఆదాయం?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈరోజు ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానం చేస్తూ త్రివేణి సంగమాన్ని భక్తి భావంతో నింపేశారు. మొదటి రోజే దాదాపు 50 లక్షల మంది పవిత్ర స్నానంలో పాల్గొన్నారు. ఈ సారి మహా కుంభమేళా 45 రోజులపాటు జరగనుంది.

ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహా ఈవెంట్‌ను 40 కోట్లకు పైగా భక్తులు సందర్శించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2019 అర్ధ కుంభమేళాతో పోలిస్తే ఈ సారి రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేసింది.

ఈ మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రతి భక్తుడు సగటున రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తారని భావిస్తున్నారు. ఇది రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని వర్గాల అంచనా ప్రకారం, ఈ మొత్తం ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు.

2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, మహా కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం భక్తుల కోసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మహోన్నత ఈవెంట్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

This post was last modified on January 13, 2025 5:06 pm

Share

Recent Posts

కూతురికి ప్లాపొచ్చినా తల్లికి హిట్టు దక్కింది

గత నెల చివరి వారంలో వచ్చిన శ్రీనివాస మంగాపురం ప్రేక్షకులకు గుర్తే. ఘట్టమనేని మూడో తరం వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన…

1 hour ago

సంక్రాంతికి అప్పుడే హౌస్ ఫుల్ బోర్డు

టాలీవుడ్లో అత్యంత డిమాండ్ ఉండే షార్ట్ సీజన్.. సంక్రాంతి. ఈ టైంలో వచ్చే సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత…

2 hours ago

‘విక్రమ్ వేద’ డైరెక్టర్లు… ఆగిన చిరు సినిమాలో

గత దశాబ్ద కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ సినిమాల్లో ‘విక్రమ్ వేద’ ఒకటి. వినూత్నమైన కథ..…

3 hours ago

విశాల్ నుంచి ఇలాంటి సినిమా ఊహించలేదు

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే విశాల్ అంటే తమిళంలోనే కాదు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉండేది. పందెం కోడి,…

4 hours ago

డిసి 100 కోట్ల లక్ష్యానికి విశ్వనాథ్ బ్రేక్ ?

గత వారం విడుదలైన డిసికి ముందు రోజు వరకు పెద్దగా అంచనాలు లేవు. లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా ఎంత ఫాలోయింగ్…

5 hours ago

ఆగస్ట్ 15 మిలమిల… థియేటర్లు కళకళ

నిన్న స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చిన నేషనల్ హాలిడే బాక్సాఫీస్ కు సూపర్ గా కలిసి వచ్చింది. మాములుగానే వీకెండ్…

5 hours ago