ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈరోజు ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానం చేస్తూ త్రివేణి సంగమాన్ని భక్తి భావంతో నింపేశారు. మొదటి రోజే దాదాపు 50 లక్షల మంది పవిత్ర స్నానంలో పాల్గొన్నారు. ఈ సారి మహా కుంభమేళా 45 రోజులపాటు జరగనుంది.
ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహా ఈవెంట్ను 40 కోట్లకు పైగా భక్తులు సందర్శించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2019 అర్ధ కుంభమేళాతో పోలిస్తే ఈ సారి రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేసింది.
ఈ మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రతి భక్తుడు సగటున రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తారని భావిస్తున్నారు. ఇది రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని వర్గాల అంచనా ప్రకారం, ఈ మొత్తం ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు.
2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, మహా కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.
మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం భక్తుల కోసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మహోన్నత ఈవెంట్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగవుతుందని నిపుణులు భావిస్తున్నారు.
This post was last modified on January 13, 2025 5:06 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…