Political News

మహా కుంభమేళా.. యూపీ ప్రభుత్వానికి ఊహించని ఆదాయం?

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ పట్టణం మహా కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. ప్రతి 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా కుంభమేళా ఈరోజు ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద భక్తులు పవిత్ర స్నానం చేస్తూ త్రివేణి సంగమాన్ని భక్తి భావంతో నింపేశారు. మొదటి రోజే దాదాపు 50 లక్షల మంది పవిత్ర స్నానంలో పాల్గొన్నారు. ఈ సారి మహా కుంభమేళా 45 రోజులపాటు జరగనుంది.

ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్న ఈ మహా ఈవెంట్‌ను 40 కోట్లకు పైగా భక్తులు సందర్శించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. 2019 అర్ధ కుంభమేళాతో పోలిస్తే ఈ సారి రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు చేసింది.

ఈ మహా కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారీ ఆదాయాన్ని ఆర్జించనుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రతి భక్తుడు సగటున రూ.5,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు చేస్తారని భావిస్తున్నారు. ఇది రాష్ట్రానికి రూ.2 లక్షల కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టవచ్చని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని వర్గాల అంచనా ప్రకారం, ఈ మొత్తం ఆదాయం రూ.4 లక్షల కోట్లకు చేరవచ్చని కూడా విశ్లేషిస్తున్నారు.

2019లో జరిగిన అర్ధ కుంభమేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు దాదాపు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈసారి భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉండటంతో, మహా కుంభమేళా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై మరింత సానుకూల ప్రభావం చూపుతుందని ప్రభుత్వ వర్గాలు నమ్మకంగా ఉన్నాయి.

మహా కుంభమేళా నేపథ్యంలో త్రివేణి సంగమం భక్తుల కోసం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ మహోన్నత ఈవెంట్ ద్వారా ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని, రాష్ట్ర ఖ్యాతి అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

This post was last modified on January 13, 2025 5:06 pm

Share

Recent Posts

సెకండాఫ్ జాగ్రత్త పడి ఉంటే కల్ట్ క్లాసిక్ అయ్యేది

మూడు రోజుల క్రితం విడుదలైన చెన్నై లవ్ స్టోరీ మొదటి వీకెండ్ ఘనంగా ముగిసింది. ఊహించిన దానికన్నా వసూళ్లు ఎక్కువే…

17 minutes ago

ఆ నలుగురు… ట్రెండు సృష్టిస్తారా

ఆ నలుగురు అంటే ఏదో రాజేంద్ర ప్రసాద్ సినిమా అనుకునేరు. ఇది దాని గురించి కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త…

34 minutes ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

5 hours ago

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

12 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

13 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

14 hours ago