Political News

బాబుకు త‌ల‌నొప్పులు వారి నుంచే.. కానీ, మార్చే ప‌రిస్థితి లేద‌ట‌!

టీడీపీ అధినేత చంద్ర‌బాబును ద‌గ్గ‌ర‌గా చూసిన వారు.. ఒక మాట చెబుతారు. ఆయ‌న అతి మొహ‌మాట‌స్తుడ‌ని, న‌మ్మితే.. ఎంత‌టి వారినైనా నెత్తిన పెట్టుకుంటార‌ని, అదేస‌మ‌యంలో అలాంటివారు ఎన్ని త‌ప్పులు చేసినా.. చివ‌ర‌కు త‌న కాళ్ల‌కింద‌కే నీళ్లు వ‌చ్చేలా చేసినా.. స‌హిస్తార‌ని.. అంటారు. బ‌హుశ .. ఇది నిజం కావొచ్చు! ఎందుకంటే.. చంద్ర‌బాబు న‌మ్మిన‌వారు.. ఆయ‌న నెత్తిన పెట్టుకున్న‌వారు చాలా మంది.. త‌ల‌నొప్పిగా మారారు. పార్టీలోను, నియోజ‌క‌వ‌ర్గంలోనూ వారి వ‌ల్ల వివాదాలే త‌ప్ప చంద్ర‌బాబుకు వ‌చ్చిన ప్ర‌యోజ‌నం ఏమీ లేదు. ఇలాంటి స‌మ‌యంలో అలాంటి వారిపై చ‌ర్య‌లు తీసుకుని లేదా వారిని ప‌క్క‌న పెట్టి బాబు ముందుకు వెళ్లే చాన్స్ ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న అలా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు.

దీంతో పార్టీ ప్ర‌యోజ‌నాలు పూర్తిగా దెబ్బ‌తింటున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉదాహ‌ర‌ణ‌కు.. నెల్లూరు నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి. ఈయ‌న ఐదుసార్లుగా ఓడిపోతున్నారు. పైగా పార్టీని బ‌లోపేతం చేయ‌లేక‌పోతున్నారు. త‌న రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని కూడా ఆయ‌న పార్టీలో నిల‌బెట్ట‌లేక పోతున్నారు. ఆయ‌న వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి ప‌లువురు కీల‌క రెడ్డి నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. ఈ విష‌యం చంద్ర‌బాబుకు తెలిసి కూడా సోమిరెడ్డిపై ఉన్న వాత్స‌ల్యంతో ఆయ‌న‌ను ఏమీ అన‌లేక పోతున్నారు. ఇక‌, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు. ఈయ‌న పార్టీలో ఉన్నా.. పార్టీ ప్ర‌యోజ‌నాల క‌న్నా స్వ‌ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద‌పీట వేసుకున్నార‌నేది సీనియ‌ర్ల మాట‌.

మైనింగ్ ఆరోప‌ణ‌లు కూడా య‌ర‌ప‌తినేని ఉన్నాయి. సీబీఐ కూడా కేసు న‌మోదు చేసింది. పైగా గ‌త ఏడాది ఆయ‌న‌పై వ‌చ్చిన వ్య‌తిరేక‌త‌తో పార్టీపూర్తిగా న‌ష్ట‌పోయింది. ఇప్ప‌టికీ .. ఆయ‌న దూకుడు త‌గ్గ‌లేదు. అయినా.. చంద్ర‌బాబు మౌనం పాటిస్తున్నార‌ట‌. సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు.. అనే ప్రేమ‌తోనేన‌ని అంటున్నారు పార్టీ నేత‌లు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నేత చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌. పార్టీని ఎంత బ‌జారుకు ఈడ్చాలో అంతా ఈడ్చేశార‌ని.. ఆయ‌న పై ఇప్ప‌టికీ సీనియ‌ర్లు చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్న‌ప్పుడు.. త‌ర్వాత కూడా ఈయ‌న వివాదంగానే వ్య‌వ‌హ‌రించారు.

అయినా.. చంద్ర‌బాబు మార్చే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదని చెప్పుకొంటున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నాయ‌కులు పార్టీలోనే ఉండి.. పార్టీ కోసం కాకుండా త‌మ వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలే ప‌ర‌మార్థంగా ముందుకు సాగుతున్నా చంద్ర‌బాబు మౌనం వ‌హిస్తున్నార‌ని, ఇది పార్టీకి తీర‌ని న‌ష్టం క‌లిగిస్తోంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికైనా పార్టీని బాగు చేయాల‌ని అనుకుంటే.. మొహ‌మాటాల‌ను ప‌క్క‌న పెట్టి ప‌నిచేసేవారిని ప్రోత్స‌హించాల‌ని సీనియ‌ర్లు కోరుతున్నారు. మ‌రి బాబు ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on October 15, 2020 1:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

1 hour ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

4 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

4 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

5 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

5 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

7 hours ago