Political News

కోళ్లు క‌లిపిన రాజకీయం.. ఈ ముచ్చ‌ట ఎక్క‌డా ఉండదేమో!

“నువ్వు అక్ర‌మాలు చేశావ్‌. అధికారంలో ఉండ‌గా దోచుకున్నావ్‌. మాపై కేసులు పెట్టించి వేధించావ్‌. నీ అంతు చూస్తాం”- గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇవి.

“మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీల‌పైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్ర‌భుత్వం.. వీరేం నాయ‌కులు.. అంద‌రూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొంద‌రు ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ నేత‌లు చేసిన విమ‌ర్శ‌లు ఇవి.

“గోదావ‌రి జిల్లాల ప‌రువు తీస్తున్నారు. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేయ‌డ‌మా? ఇంత క‌న్నా ఘోరంఉంటుందా?. ఇలాంటి వారిని న‌డిరోడ్డుపై శిక్షించాలి” అప్ప‌ట్లో మార్మోగిన కీల‌క నేత‌ల కంఠాలు.

  • పైవ‌న్నీ.. వైసీపీ నేత‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌లు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. వైసీపీ పాల‌న‌పై దుమ్మెత్తిపోశారు. వైసీపీ నాయ‌కు ల‌పై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌స్తే… అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. స‌వాళ్లు రువ్వారు. క‌ట్ చేస్తే.. ఆరు మాసాల త‌ర్వాత‌.. కూట‌మి స‌ర్కారు హ‌యాంలో జ‌రుగుతున్న సంక్రాంతి సంబ‌రాల్లో వీరంతా చెట్టాప‌ట్టాలేసుకుని వైసీపీ నాయ‌కుల‌తో ఖుషీగా గ‌డిపేస్తున్నారు.

‘పండ‌గ సంబ‌రాలు-సంస్కృతి’ పేరుతో పెద్ద పెద్ద బ‌రులు గీసి.. పందేల‌కు రెడీ అయ్యారు. ఇక్క‌డ త‌ర‌త‌మ బేధాలు లేవ్‌. పార్టీల ర‌గ‌డే అస‌లే ఉండ‌దు. అంతా సౌభ్రాతృత్వం! రాజ్యాంగంలో పేర్కొన్న సోద‌ర‌భావం.. కోడి పందేల బ‌రుల్లో ప‌క్కాగా విల‌సిల్లుతోంది. అన్ని కోస్తా జిల్లాల్లోనూ బ‌రులు పంచుకునే ద‌గ్గ‌ర నుంచి కోళ్ల‌ను కొనుగోలు చేసే వ‌ర‌కు.. పేకాట శిబిరాల నుంచి గుండాట వ‌ర‌కు వైసీపీ-టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులతో పాటు క‌మ‌ల నాథుల్లో కొంద‌రు ఉత్సాహ‌వంతులు సైతం చేతులు క‌లిపారు.

అధికారుల‌ను త‌మ లైన్‌లోకి తెచ్చుకుని బ‌రులు సిద్ధం చేసుకున్నారు. సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకు న్నారు. గిల్లిక‌జ్జాల‌కు పోకుండా.. లాభాలు గిల్లుకునేందుకు రెడీ అయ్యారు. మైల‌వ‌రం, తిరువూరు నుంచి న‌ర‌సాపురం దాకా, గుంటూరులోని స‌త్తెన‌ప‌ల్లి (ప‌ల్నాడు ప్రాంతంలో కోళ్ల పందేలు ప్ర‌శిద్ది) నుంచి మంగ‌ళ‌గిరి వ‌ర‌కు అంద‌రూ ఒక‌టే.. అంద‌రి సంస్కృతి ఒక్క‌టే.

క‌లిసి మెలిసి పంచుకోవ‌డం.. పందేలు వేసుకోవ‌డం.. వ‌చ్చిన లాభాలు పంచుకోవ‌డం!! ఇలాంటి సంస్కృతి, సంప్ర‌దాయాలు ఒక్క ఏపీలోనే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి వ‌చ్చిన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు కూడా.. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో క‌లిసిపోయి.. పందేలకు రెడీ అయిపోవ‌డం. వారికి ఇక్క‌డివారు అతిథి మ‌ర్యాద‌లు ఘ‌నంగా చేయ‌డం!!

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

57 minutes ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

3 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

5 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

6 hours ago