Political News

కోళ్లు క‌లిపిన రాజకీయం.. ఈ ముచ్చ‌ట ఎక్క‌డా ఉండదేమో!

“నువ్వు అక్ర‌మాలు చేశావ్‌. అధికారంలో ఉండ‌గా దోచుకున్నావ్‌. మాపై కేసులు పెట్టించి వేధించావ్‌. నీ అంతు చూస్తాం”- గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇవి.

“మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీల‌పైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్ర‌భుత్వం.. వీరేం నాయ‌కులు.. అంద‌రూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొంద‌రు ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ నేత‌లు చేసిన విమ‌ర్శ‌లు ఇవి.

“గోదావ‌రి జిల్లాల ప‌రువు తీస్తున్నారు. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేయ‌డ‌మా? ఇంత క‌న్నా ఘోరంఉంటుందా?. ఇలాంటి వారిని న‌డిరోడ్డుపై శిక్షించాలి” అప్ప‌ట్లో మార్మోగిన కీల‌క నేత‌ల కంఠాలు.

  • పైవ‌న్నీ.. వైసీపీ నేత‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌లు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. వైసీపీ పాల‌న‌పై దుమ్మెత్తిపోశారు. వైసీపీ నాయ‌కు ల‌పై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌స్తే… అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. స‌వాళ్లు రువ్వారు. క‌ట్ చేస్తే.. ఆరు మాసాల త‌ర్వాత‌.. కూట‌మి స‌ర్కారు హ‌యాంలో జ‌రుగుతున్న సంక్రాంతి సంబ‌రాల్లో వీరంతా చెట్టాప‌ట్టాలేసుకుని వైసీపీ నాయ‌కుల‌తో ఖుషీగా గ‌డిపేస్తున్నారు.

‘పండ‌గ సంబ‌రాలు-సంస్కృతి’ పేరుతో పెద్ద పెద్ద బ‌రులు గీసి.. పందేల‌కు రెడీ అయ్యారు. ఇక్క‌డ త‌ర‌త‌మ బేధాలు లేవ్‌. పార్టీల ర‌గ‌డే అస‌లే ఉండ‌దు. అంతా సౌభ్రాతృత్వం! రాజ్యాంగంలో పేర్కొన్న సోద‌ర‌భావం.. కోడి పందేల బ‌రుల్లో ప‌క్కాగా విల‌సిల్లుతోంది. అన్ని కోస్తా జిల్లాల్లోనూ బ‌రులు పంచుకునే ద‌గ్గ‌ర నుంచి కోళ్ల‌ను కొనుగోలు చేసే వ‌ర‌కు.. పేకాట శిబిరాల నుంచి గుండాట వ‌ర‌కు వైసీపీ-టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులతో పాటు క‌మ‌ల నాథుల్లో కొంద‌రు ఉత్సాహ‌వంతులు సైతం చేతులు క‌లిపారు.

అధికారుల‌ను త‌మ లైన్‌లోకి తెచ్చుకుని బ‌రులు సిద్ధం చేసుకున్నారు. సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకు న్నారు. గిల్లిక‌జ్జాల‌కు పోకుండా.. లాభాలు గిల్లుకునేందుకు రెడీ అయ్యారు. మైల‌వ‌రం, తిరువూరు నుంచి న‌ర‌సాపురం దాకా, గుంటూరులోని స‌త్తెన‌ప‌ల్లి (ప‌ల్నాడు ప్రాంతంలో కోళ్ల పందేలు ప్ర‌శిద్ది) నుంచి మంగ‌ళ‌గిరి వ‌ర‌కు అంద‌రూ ఒక‌టే.. అంద‌రి సంస్కృతి ఒక్క‌టే.

క‌లిసి మెలిసి పంచుకోవ‌డం.. పందేలు వేసుకోవ‌డం.. వ‌చ్చిన లాభాలు పంచుకోవ‌డం!! ఇలాంటి సంస్కృతి, సంప్ర‌దాయాలు ఒక్క ఏపీలోనే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి వ‌చ్చిన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు కూడా.. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో క‌లిసిపోయి.. పందేలకు రెడీ అయిపోవ‌డం. వారికి ఇక్క‌డివారు అతిథి మ‌ర్యాద‌లు ఘ‌నంగా చేయ‌డం!!

This post was last modified on January 13, 2025 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

2 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

2 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

3 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

5 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

5 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

6 hours ago