Political News

కోళ్లు క‌లిపిన రాజకీయం.. ఈ ముచ్చ‌ట ఎక్క‌డా ఉండదేమో!

“నువ్వు అక్ర‌మాలు చేశావ్‌. అధికారంలో ఉండ‌గా దోచుకున్నావ్‌. మాపై కేసులు పెట్టించి వేధించావ్‌. నీ అంతు చూస్తాం”- గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్య‌లు ఇవి.

“మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీల‌పైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్ర‌భుత్వం.. వీరేం నాయ‌కులు.. అంద‌రూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొంద‌రు ప్ర‌త్య‌ర్థుల‌పై టీడీపీ నేత‌లు చేసిన విమ‌ర్శ‌లు ఇవి.

“గోదావ‌రి జిల్లాల ప‌రువు తీస్తున్నారు. శ‌వాన్ని డోర్ డెలివ‌రీ చేయ‌డ‌మా? ఇంత క‌న్నా ఘోరంఉంటుందా?. ఇలాంటి వారిని న‌డిరోడ్డుపై శిక్షించాలి” అప్ప‌ట్లో మార్మోగిన కీల‌క నేత‌ల కంఠాలు.

  • పైవ‌న్నీ.. వైసీపీ నేత‌ల‌పై టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ నాయ‌కులు చేసిన విమ‌ర్శ‌లు. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. ప‌దుల సంఖ్య‌లో నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. వైసీపీ పాల‌న‌పై దుమ్మెత్తిపోశారు. వైసీపీ నాయ‌కు ల‌పై నిప్పులు చెరిగారు. అధికారంలోకి వ‌స్తే… అంతు చూస్తామ‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు.. స‌వాళ్లు రువ్వారు. క‌ట్ చేస్తే.. ఆరు మాసాల త‌ర్వాత‌.. కూట‌మి స‌ర్కారు హ‌యాంలో జ‌రుగుతున్న సంక్రాంతి సంబ‌రాల్లో వీరంతా చెట్టాప‌ట్టాలేసుకుని వైసీపీ నాయ‌కుల‌తో ఖుషీగా గ‌డిపేస్తున్నారు.

‘పండ‌గ సంబ‌రాలు-సంస్కృతి’ పేరుతో పెద్ద పెద్ద బ‌రులు గీసి.. పందేల‌కు రెడీ అయ్యారు. ఇక్క‌డ త‌ర‌త‌మ బేధాలు లేవ్‌. పార్టీల ర‌గ‌డే అస‌లే ఉండ‌దు. అంతా సౌభ్రాతృత్వం! రాజ్యాంగంలో పేర్కొన్న సోద‌ర‌భావం.. కోడి పందేల బ‌రుల్లో ప‌క్కాగా విల‌సిల్లుతోంది. అన్ని కోస్తా జిల్లాల్లోనూ బ‌రులు పంచుకునే ద‌గ్గ‌ర నుంచి కోళ్ల‌ను కొనుగోలు చేసే వ‌ర‌కు.. పేకాట శిబిరాల నుంచి గుండాట వ‌ర‌కు వైసీపీ-టీడీపీ-జ‌న‌సేన నాయ‌కులతో పాటు క‌మ‌ల నాథుల్లో కొంద‌రు ఉత్సాహ‌వంతులు సైతం చేతులు క‌లిపారు.

అధికారుల‌ను త‌మ లైన్‌లోకి తెచ్చుకుని బ‌రులు సిద్ధం చేసుకున్నారు. సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకు న్నారు. గిల్లిక‌జ్జాల‌కు పోకుండా.. లాభాలు గిల్లుకునేందుకు రెడీ అయ్యారు. మైల‌వ‌రం, తిరువూరు నుంచి న‌ర‌సాపురం దాకా, గుంటూరులోని స‌త్తెన‌ప‌ల్లి (ప‌ల్నాడు ప్రాంతంలో కోళ్ల పందేలు ప్ర‌శిద్ది) నుంచి మంగ‌ళ‌గిరి వ‌ర‌కు అంద‌రూ ఒక‌టే.. అంద‌రి సంస్కృతి ఒక్క‌టే.

క‌లిసి మెలిసి పంచుకోవ‌డం.. పందేలు వేసుకోవ‌డం.. వ‌చ్చిన లాభాలు పంచుకోవ‌డం!! ఇలాంటి సంస్కృతి, సంప్ర‌దాయాలు ఒక్క ఏపీలోనే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి వ‌చ్చిన బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌పార్టీ నాయ‌కులు కూడా.. వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన‌ల‌తో క‌లిసిపోయి.. పందేలకు రెడీ అయిపోవ‌డం. వారికి ఇక్క‌డివారు అతిథి మ‌ర్యాద‌లు ఘ‌నంగా చేయ‌డం!!

This post was last modified on January 13, 2025 10:16 am

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

40 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

56 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

2 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

3 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago