“నువ్వు అక్రమాలు చేశావ్. అధికారంలో ఉండగా దోచుకున్నావ్. మాపై కేసులు పెట్టించి వేధించావ్. నీ అంతు చూస్తాం”- గత ఏడాది ఎన్నికలకు ముందు మైలవరం నియోజకవర్గంలో టీడీపీ నేత చేసిన వ్యాఖ్యలు ఇవి.
“మా ఆస్తులు ధ్వంసంచేశారు. మాపైనే కేసులు పెట్టారు. ఎస్సీలపైనా దాడులు చేయించారు. తిరిగి వారిపైనే ఎస్సీ కేసులు పెట్టారు. ఇదేం ప్రభుత్వం.. వీరేం నాయకులు.. అందరూ సైకోలు”- గుంటూరు జిల్లాకు చెందిన కొందరు ప్రత్యర్థులపై టీడీపీ నేతలు చేసిన విమర్శలు ఇవి.
“గోదావరి జిల్లాల పరువు తీస్తున్నారు. శవాన్ని డోర్ డెలివరీ చేయడమా? ఇంత కన్నా ఘోరంఉంటుందా?. ఇలాంటి వారిని నడిరోడ్డుపై శిక్షించాలి” అప్పట్లో మార్మోగిన కీలక నేతల కంఠాలు.
‘పండగ సంబరాలు-సంస్కృతి’ పేరుతో పెద్ద పెద్ద బరులు గీసి.. పందేలకు రెడీ అయ్యారు. ఇక్కడ తరతమ బేధాలు లేవ్. పార్టీల రగడే అసలే ఉండదు. అంతా సౌభ్రాతృత్వం! రాజ్యాంగంలో పేర్కొన్న సోదరభావం.. కోడి పందేల బరుల్లో పక్కాగా విలసిల్లుతోంది. అన్ని కోస్తా జిల్లాల్లోనూ బరులు పంచుకునే దగ్గర నుంచి కోళ్లను కొనుగోలు చేసే వరకు.. పేకాట శిబిరాల నుంచి గుండాట వరకు వైసీపీ-టీడీపీ-జనసేన నాయకులతో పాటు కమల నాథుల్లో కొందరు ఉత్సాహవంతులు సైతం చేతులు కలిపారు.
అధికారులను తమ లైన్లోకి తెచ్చుకుని బరులు సిద్ధం చేసుకున్నారు. సంయుక్తంగా ఏర్పాట్లు చేసుకు న్నారు. గిల్లికజ్జాలకు పోకుండా.. లాభాలు గిల్లుకునేందుకు రెడీ అయ్యారు. మైలవరం, తిరువూరు నుంచి నరసాపురం దాకా, గుంటూరులోని సత్తెనపల్లి (పల్నాడు ప్రాంతంలో కోళ్ల పందేలు ప్రశిద్ది) నుంచి మంగళగిరి వరకు అందరూ ఒకటే.. అందరి సంస్కృతి ఒక్కటే.
కలిసి మెలిసి పంచుకోవడం.. పందేలు వేసుకోవడం.. వచ్చిన లాభాలు పంచుకోవడం!! ఇలాంటి సంస్కృతి, సంప్రదాయాలు ఒక్క ఏపీలోనే కనిపిస్తుండడం గమనార్హం. చిత్రం ఏంటంటే.. తెలంగాణ నుంచి వచ్చిన బీఆర్ ఎస్, కాంగ్రెస్పార్టీ నాయకులు కూడా.. వైసీపీ, టీడీపీ, జనసేనలతో కలిసిపోయి.. పందేలకు రెడీ అయిపోవడం. వారికి ఇక్కడివారు అతిథి మర్యాదలు ఘనంగా చేయడం!!
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…