తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. ఈ క్రమంలోనే ఆ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణలు చెప్పాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆ ఘటనలో తమ తప్పు లేకున్నా టీటీడీ తరఫున భక్తులందరికీ బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
అంతకుముందు, మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. క్షమాపణలు చెప్పడంలో తప్పులేదని, క్షమాపణలు చెప్పినంత మాత్రాన చనిపోయిన వారు తిరిగి రారని, ఎవరో ఏదో మాట్లాడారని అన్నింటికి స్పందించాల్సిన అవసరం లేదని బీఆర్ నాయుడు చేసిన కామెంట్లు పవన్ ను ఉద్దేశించి చేసినవేనని సోషల్ మీడియాలో టాక్ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ టాక్ పై బీఆర్ నాయుడు స్పందించారు.
ఆ వ్యాఖ్యలు పవన్ ను ఉద్దేశించి చేసినవి కావని, తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని బీఆర్ నాయుడు క్లారిటీనిచ్చారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్లపై స్పందించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతో తాను ఆ వ్యాఖ్యలు చేశానని ఆయన స్పష్టతనిచ్చారు. తన వ్యాఖ్యలను పవన్ కు ఆపాదించడం సరికాదని అన్నారు.
తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆ ఘటనకు బాధ్యులైన వారిని ఉపేక్షించేది లేదని చెప్పారు. చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని తమ దృష్టికి వచ్చిందని, న్యాయ విచారణలో తప్పు ఎవరిదన్న విషయం వెల్లడవుతుందని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
This post was last modified on January 11, 2025 10:24 am
ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…
సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…
మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…
ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…
దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…