Political News

తిరుమల తొక్కిసలాటకు రీజన్ ఇదేనట

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది దాకా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కారణాన్ని తాజాగా శుక్రవారం వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధింది ప్రచారంలో ఉన్న పలు అంశాలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.

బైరాగిపట్టెడ కేంద్రం వద్ద అప్పటికే అన్ని కౌంటర్ల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కాగా… భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోయింది.అంతేకాకుండా ఉదయాన అనగా వచ్చిన భక్తులు టోకెన్ల కోసం రాత్రి దాకా అక్కడే పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఓ భక్తురాలు అస్వస్థతకు గురి కాగా… ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని సిబ్బంది యత్నించారు. ఈ క్రమంలో సదరు భక్తురాలు ఉన్న గేటు కాకుండా… పొరపాటున పక్కనున్న గేటును సిబ్బంది తెరిచారట. దీంతో టోకెన్ల పంపిణీ మొదలు అయిందేమోనన్న భావనతో భక్తులంతా తెరిచిన గేటు నుంచి లోపలికి వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుందని, అందులో ఆరుగురు భక్తులు చనిపోయారని మంత్రి ఆనం తెలిపారు.

ఇక ఈ ఘటనకు పూర్తిగా డీఎస్పీ రమణ కుమారే బాధ్యులని బుధవారం నుంచి కూడా ప్రచారం సాగుతూనే ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం జరిపిన ప్రాథమిక విచారణలో కూడా రమణ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని కూడా తేలింది. దీంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా శుక్రవారం మంత్రి ఆనం… ఘటన జరిగిన సమయంలో అక్కడ అసలు డీఎస్పీ స్థాయి అధికారే లేరని కూడా చెప్పారు. వెరసి ఈ ప్రకటనతో తిరుమల తొక్కిసలాటపై మంత్రి సరికొత్త చర్చకు తెర లేపినట్టైైంది.

Satya

Recent Posts

నైజామ్ టికెట్ రేట్లు… ఎడతెగని టెన్షన్లు

పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…

3 hours ago

బడ్జెట్ బయటికి చెప్పడం రిస్కంటారా

మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…

4 hours ago

మాటల్లో రాజీ లేదు.. చేతల్లో ఆలస్యం కాదు..

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…

5 hours ago

బాడీగార్డ్ గురించి ఓపెన్ అయిన చ‌ర‌ణ్‌

త‌న కొత్త సినిమా పెద్ది ప్ర‌మోష‌న్లలో భాగంగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఎక్క‌డికి వెళ్లినా… ఆయ‌న వెంట…

7 hours ago

30 దాటాక కూడా రేస్‌లో ఉండాలంటే…

ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…

13 hours ago

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రితో లోకేష్ భేటీ రీజ‌నేంటి?

మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ‌ణవీస్‌తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…

14 hours ago