Political News

తిరుమల తొక్కిసలాటకు రీజన్ ఇదేనట

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు వచ్చిన భక్తులు టోకెన్ల కోసం ఎగబడటం, ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోవడం, 40 మంది దాకా భక్తులు గాయపడిన సంగతి తెలిసిందే. తిరుపతి నగరంలోని బైరాగిపట్టెడ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన ఈ ఘటనకు దారి తీసిన కారణాలేమిటన్న దానిపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. అయితే దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ కారణాన్ని తాజాగా శుక్రవారం వెల్లడించారు. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధింది ప్రచారంలో ఉన్న పలు అంశాలపైనా ఆయన స్పష్టత ఇచ్చారు.

బైరాగిపట్టెడ కేంద్రం వద్ద అప్పటికే అన్ని కౌంటర్ల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో చేరిపోయారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభం కాగా… భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోయింది.అంతేకాకుండా ఉదయాన అనగా వచ్చిన భక్తులు టోకెన్ల కోసం రాత్రి దాకా అక్కడే పడిగాపులు కాశారు. ఈ క్రమంలో ఓ భక్తురాలు అస్వస్థతకు గురి కాగా… ఆమెను అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని సిబ్బంది యత్నించారు. ఈ క్రమంలో సదరు భక్తురాలు ఉన్న గేటు కాకుండా… పొరపాటున పక్కనున్న గేటును సిబ్బంది తెరిచారట. దీంతో టోకెన్ల పంపిణీ మొదలు అయిందేమోనన్న భావనతో భక్తులంతా తెరిచిన గేటు నుంచి లోపలికి వెళ్లే యత్నం చేశారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటుచేసుకుందని, అందులో ఆరుగురు భక్తులు చనిపోయారని మంత్రి ఆనం తెలిపారు.

ఇక ఈ ఘటనకు పూర్తిగా డీఎస్పీ రమణ కుమారే బాధ్యులని బుధవారం నుంచి కూడా ప్రచారం సాగుతూనే ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం జరిపిన ప్రాథమిక విచారణలో కూడా రమణ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని కూడా తేలింది. దీంతో ఆయనపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే తాజాగా శుక్రవారం మంత్రి ఆనం… ఘటన జరిగిన సమయంలో అక్కడ అసలు డీఎస్పీ స్థాయి అధికారే లేరని కూడా చెప్పారు. వెరసి ఈ ప్రకటనతో తిరుమల తొక్కిసలాటపై మంత్రి సరికొత్త చర్చకు తెర లేపినట్టైైంది.

This post was last modified on January 10, 2025 7:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

1 hour ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

4 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

9 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

9 hours ago