వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు ప్రధాన ప్రతిపక్ష హోదా అయితే రావడం లేదు. ఇది కోర్టులో ఉన్న వ్యవహారం. పైగా.. కూటమి సర్కారు కూడా దీనిని లైట్ తీసుకుంది. ప్రజలు ఇవ్వనప్పుడు తాము మాత్రం ఎలా ఇస్తామని.. కూటమి నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో జగన్ పరిస్థితి డోలాయమానంలో పడింది. దీంతో అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటున్నారు.
గతంలో వరదల సమయంలో సీఎం చంద్రబాబు హుటాహుటిన రంగంలోకి దిగారు. దీంతో అప్పటి వరకు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్న జగన్.. అనూహ్యంగా విజయవాడకు వచ్చారు. మోకాల్లోతు నీటిలో పర్యటించి.. సర్కారుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత మరోసారి వచ్చారు. అంతే.. దాంతో సరిపుచ్చారు. అయితే.. అప్పట్లో ఆయన అనుకున్న మైలేజీ అయితే రాలేదు. వరదల వ్యవహారంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్లు చేసినా.. వాటికి కూడా ప్రజల నుంచి స్పందన అయితే ఆశించిన విధంగా రాలేదు.
ఇక, ఇప్పుడు తిరుపతి వ్యవహారం వచ్చింది. ఈ విషయంలోనూ కూటమి సర్కారు హుటాహుటిన స్పందించింది. ఎవరూ డిమాండ్ చేయకుండాను రూ.25 లక్షలను పరిహారంగా ప్రకటించింది. అంతేకాదు.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లు కూడా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇది కొంత వరకు వేడిని తగ్గించిందనే చెప్పాలి. అయితే.. ఈ వేడిని ఇలాంటి ఘటనలనే సహజంగా ప్రతిపక్షాలు కోరుకుంటాయి కాబట్టి.. ఈ సమయంలోనే జగన్ స్పందించారు.
తానే నేరుగా రంగంలోకి వచ్చేశారు. వచ్చీరావడంతోనే ఆయన పరామర్శలకంటే కూడా.. విమర్శలపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ పరిణామం జగన్కు మార్కులు తెచ్చింది లేదా? అనేది పక్కన పెడితే.. ప్రధాన ప్రతిపక్షం కోసం.. ఆయన పడుతున్న ఆరాటాన్ని మాత్రం స్పష్టం చేసిందని టీడీపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు రాజకీయంగా కంటే కూడా.. మానవత్వంతో వ్యవహరించి ఉంటే బాగుండేదన్న సూచనలు వచ్చాయి. ఏదేమైనా ప్రధాన ప్రతిపక్షం కోసం జగన్ పోరాటమే కాదు.. ఆరాటం కూడా పడుతున్నారన్నది స్పస్టంగా తెలుస్తోంది.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…