Political News

`సారీ`కి సిద్ధం.. ప‌వ‌న్ మాట నెర‌వేర్చుతున్న టీటీడీ సభ్యులు!

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో మ‌రో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఇక‌, టీటీడీ బోర్డు స‌భ్యులు.. బాధితుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళ్లి.. సారీ చెప్పాల‌ని, ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

ఈ క్ర‌మంలో తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట నెర‌వేర్చేందుకు రెడీ అయింది. శ‌నివారం ఉద‌యం లేదా సాయంత్రం పాల‌క మండ‌లి స‌భ్యులు బాధితుల కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం తో పాటు.. టీటీడీ త‌ర‌ఫున కూడా ప‌రిహారం ప్ర‌క‌టించి.. దీనిని స్వ‌యంగా పాల‌క మండ‌లి స‌భ్యులు మృతి చెందిన వారి కుటుంబాల‌కు అందించ‌నున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్ప‌నున్నారు.

ఇక‌, ఈ తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారికి కూడా ఇళ్ల‌కు వెళ్లి ప‌రిహారం అందించ‌డంతోపాటు.. వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊర‌డించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్ర‌వారం) సాయంత్రం పాల‌క మండ‌లి ప్ర‌త్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాల‌క మండ‌లి నుంచి న‌లుగురు, అధికారులు ఇద్ద‌రిని ఎంపిక చేసి బాధితుల ఇళ్ల‌కు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. త‌ద్వారా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఈ ద‌శ‌లో ఎండ్ కార్డు వేయ‌నున్నార‌ని స‌మాచారం.

This post was last modified on January 10, 2025 3:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవన్, ఫాన్స్ ఉన్నారు… హైప్ వస్తుందిలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కేవలం ఎనిమిది నెలల్లో మూడో సినిమా రాబోతోంది. గత ఏడాది రెండు నెలల…

19 minutes ago

డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్…

3 hours ago

40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి…

3 hours ago

టికెట్ రేట్ల పెంపు లేదు… అయినా హ్యాపీనే

తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు జిఓ కోసం ఎదురు చూసిన మైత్రి సంస్థకు చివరికి అది జరిగే సూచనలు లేకపోవడంతో…

4 hours ago

SRH ఈ హెచ్చరికలు వినాల్సిందే..

'ద హండ్రెడ్' వేలంలో పాకిస్థాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను సన్‌రైజర్స్ లీడ్స్ కొనుగోలు చేయడం ఊహించని వివాదానికి దారితీస్తోంది. ఈ…

6 hours ago

మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం…

10 hours ago