Political News

`సారీ`కి సిద్ధం.. ప‌వ‌న్ మాట నెర‌వేర్చుతున్న టీటీడీ సభ్యులు!

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో మ‌రో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఇక‌, టీటీడీ బోర్డు స‌భ్యులు.. బాధితుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళ్లి.. సారీ చెప్పాల‌ని, ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

ఈ క్ర‌మంలో తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట నెర‌వేర్చేందుకు రెడీ అయింది. శ‌నివారం ఉద‌యం లేదా సాయంత్రం పాల‌క మండ‌లి స‌భ్యులు బాధితుల కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం తో పాటు.. టీటీడీ త‌ర‌ఫున కూడా ప‌రిహారం ప్ర‌క‌టించి.. దీనిని స్వ‌యంగా పాల‌క మండ‌లి స‌భ్యులు మృతి చెందిన వారి కుటుంబాల‌కు అందించ‌నున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్ప‌నున్నారు.

ఇక‌, ఈ తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారికి కూడా ఇళ్ల‌కు వెళ్లి ప‌రిహారం అందించ‌డంతోపాటు.. వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊర‌డించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్ర‌వారం) సాయంత్రం పాల‌క మండ‌లి ప్ర‌త్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాల‌క మండ‌లి నుంచి న‌లుగురు, అధికారులు ఇద్ద‌రిని ఎంపిక చేసి బాధితుల ఇళ్ల‌కు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. త‌ద్వారా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఈ ద‌శ‌లో ఎండ్ కార్డు వేయ‌నున్నార‌ని స‌మాచారం.

Kumar

Recent Posts

టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వైభవ్‌కు నో ఎంట్రీ

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ టూర్‌లో ఊహించని పరిస్థితిని ఎదుర్కోబోతున్నాడు. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగే టీ20 మ్యాచ్‌తో…

15 minutes ago

రణబాలికి సర్దార్ టెన్షన్ ఉంటుందా

విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…

38 minutes ago

మోదీకి అందుకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదు

రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…

57 minutes ago

ఎండలో ఆ హుడీనే పట్టించింది.. పుణే వ్యాపారవేత్త హత్యలో షాకింగ్ నిజాలు!

మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…

1 hour ago

గ్రీన్ కార్డు గొప్ప‌లు వ‌ద్దు: సుప్రీంకోర్టు కొర‌డా ఇదిగో!

అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వ‌త నివాసం కోసం గ్రీన్ కార్డ్‌.. అత్యంత కీల‌కం. దీనిని సాధించ‌డ‌మే మ‌హా య‌జ్ఞం చేసినంత ప‌నిగా…

2 hours ago

‘అప్పుడు కేజీఎఫ్‌… ఇప్పుడు జొన్న‌గిరి’

ఒక‌ప్పుడు బంగారం నిల్వ‌ల విష‌యంలో కేజీఎఫ్ గురించి చ‌ర్చ జ‌రిగేద‌ని.. కానీ, ఇప్పుడు క‌ర్నూలు జిల్లాలోని జొన్న‌గిరి గురించి దేశ‌వ్యాప్తంగా…

3 hours ago