Political News

`సారీ`కి సిద్ధం.. ప‌వ‌న్ మాట నెర‌వేర్చుతున్న టీటీడీ సభ్యులు!

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో మ‌రో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఇక‌, టీటీడీ బోర్డు స‌భ్యులు.. బాధితుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళ్లి.. సారీ చెప్పాల‌ని, ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

ఈ క్ర‌మంలో తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట నెర‌వేర్చేందుకు రెడీ అయింది. శ‌నివారం ఉద‌యం లేదా సాయంత్రం పాల‌క మండ‌లి స‌భ్యులు బాధితుల కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం తో పాటు.. టీటీడీ త‌ర‌ఫున కూడా ప‌రిహారం ప్ర‌క‌టించి.. దీనిని స్వ‌యంగా పాల‌క మండ‌లి స‌భ్యులు మృతి చెందిన వారి కుటుంబాల‌కు అందించ‌నున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్ప‌నున్నారు.

ఇక‌, ఈ తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారికి కూడా ఇళ్ల‌కు వెళ్లి ప‌రిహారం అందించ‌డంతోపాటు.. వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊర‌డించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్ర‌వారం) సాయంత్రం పాల‌క మండ‌లి ప్ర‌త్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాల‌క మండ‌లి నుంచి న‌లుగురు, అధికారులు ఇద్ద‌రిని ఎంపిక చేసి బాధితుల ఇళ్ల‌కు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. త‌ద్వారా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఈ ద‌శ‌లో ఎండ్ కార్డు వేయ‌నున్నార‌ని స‌మాచారం.

Kumar

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

52 minutes ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

58 minutes ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

1 hour ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

3 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago