Political News

`సారీ`కి సిద్ధం.. ప‌వ‌న్ మాట నెర‌వేర్చుతున్న టీటీడీ సభ్యులు!

తిరుప‌తిలో చోటు చేసుకున్న తొక్కిస‌లాట‌లో ఆరుగురు మృతి చెందిన విష‌యం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో మ‌రో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వ‌ల్పంగా గాయ‌ప‌డ్డారు. అయితే.. ఈ ఘ‌ట‌న‌కు నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మ‌ని పేర్కొన్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ప్ర‌భుత్వం త‌ర‌ఫున బ‌హిరంగ క్ష‌మాప‌ణ‌లు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌న్నారు. ఇక‌, టీటీడీ బోర్డు స‌భ్యులు.. బాధితుల కుటుంబాల వ‌ద్ద‌కు వెళ్లి.. సారీ చెప్పాల‌ని, ప‌రిహారం ఇవ్వాల‌ని కోరారు.

ఈ క్ర‌మంలో తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట నెర‌వేర్చేందుకు రెడీ అయింది. శ‌నివారం ఉద‌యం లేదా సాయంత్రం పాల‌క మండ‌లి స‌భ్యులు బాధితుల కుటుంబాలను ప‌రామ‌ర్శించ‌నున్న‌ట్టు తెలిసింది. అదేవిధంగా ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ప‌రిహారం తో పాటు.. టీటీడీ త‌ర‌ఫున కూడా ప‌రిహారం ప్ర‌క‌టించి.. దీనిని స్వ‌యంగా పాల‌క మండ‌లి స‌భ్యులు మృతి చెందిన వారి కుటుంబాల‌కు అందించ‌నున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్ప‌నున్నారు.

ఇక‌, ఈ తొక్కిస‌లాట‌లో గాయ‌ప‌డిన వారికి కూడా ఇళ్ల‌కు వెళ్లి ప‌రిహారం అందించ‌డంతోపాటు.. వారి ఆరోగ్య ప‌రిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊర‌డించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్ర‌వారం) సాయంత్రం పాల‌క మండ‌లి ప్ర‌త్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాల‌క మండ‌లి నుంచి న‌లుగురు, అధికారులు ఇద్ద‌రిని ఎంపిక చేసి బాధితుల ఇళ్ల‌కు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. త‌ద్వారా జ‌రిగిన ఘ‌ట‌న‌కు ఈ ద‌శ‌లో ఎండ్ కార్డు వేయ‌నున్నార‌ని స‌మాచారం.

Kumar

Recent Posts

దేశంలో ఒకే ఒక్కడు… మోడీ రికార్డ్‌!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ తాజాగా స‌రికొత్త రికార్డు సృష్టించారు. దేశాన్ని సుదీర్ఘ‌కాలం పాలించిన ప్ర‌ధాన మంత్రిగా ఇప్ప‌టి వ‌ర‌కు…

13 minutes ago

పది మెట్లు ఎక్కేసిన రామ్ చరణ్

పెద్ది కమర్షియల్ రేంజ్, వసూళ్ల లెక్కలు ఇంకా చాలా దూరం తర్వాత డిస్కస్ చేయాల్సిన మ్యాటర్. కానీ ముందే మాట్లాడుకోవాల్సిన…

51 minutes ago

కాంగ్రెస్ కు ఎంపీ సీటు… విజయ్ వ్యూహం అదుర్స్?

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవలే పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్… పాలనలో తనదైన శైలి కొత్త తరహాతో దూసుకుపోతున్నారు. అంతేకాదండోయ్..…

2 hours ago

తెలుగు రాష్ట్రాల థియేటర్లు ‘పెద్ది’ఫైడ్

నాలుగు నెలల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు నిండుగా కళకళలాడుతూ కనిపించాయి. కారణం పెద్ది. ఒక పెద్ద స్టార్ హీరో…

2 hours ago

రామాయణ ఇంకెప్పుడు మేలుకుంటుంది

ఇండియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన సినిమాగా చెప్పుకుంటున్న రామాయణ విడుదలకు జూన్ మినహాయిస్తే ఇంకో నాలుగు నెలలు మాత్రమే ఉంటుంది.…

7 hours ago

పెద్దోళ్ల కమిటీ… జగన్ కు నచ్చట్లేదా?

వైసీపీలో పొలిటిక‌ల్ అఫైర్స్ క‌మిటీ (పీసీఏ)ని ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. గ‌త ఎన్నిక‌ల్లో ప‌రాజయం త‌ర్వాత‌.. జ‌గ‌న్‌.. పీఏసీకి…

11 hours ago