తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక, టీటీడీ బోర్డు సభ్యులు.. బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి.. సారీ చెప్పాలని, పరిహారం ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పవన్ కల్యాణ్ మాట నెరవేర్చేందుకు రెడీ అయింది. శనివారం ఉదయం లేదా సాయంత్రం పాలక మండలి సభ్యులు బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటించిన పరిహారం తో పాటు.. టీటీడీ తరఫున కూడా పరిహారం ప్రకటించి.. దీనిని స్వయంగా పాలక మండలి సభ్యులు మృతి చెందిన వారి కుటుంబాలకు అందించనున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్పనున్నారు.
ఇక, ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా ఇళ్లకు వెళ్లి పరిహారం అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊరడించే ప్రయత్నం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం పాలక మండలి ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాలక మండలి నుంచి నలుగురు, అధికారులు ఇద్దరిని ఎంపిక చేసి బాధితుల ఇళ్లకు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. తద్వారా జరిగిన ఘటనకు ఈ దశలో ఎండ్ కార్డు వేయనున్నారని సమాచారం.
This post was last modified on January 10, 2025 3:10 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…