తిరుపతిలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. అదేవిధంగా 38 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఏడుగురు తీవ్రంగా 31 మంది స్వల్పంగా గాయపడ్డారు. అయితే.. ఈ ఘటనకు నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ప్రభుత్వం తరఫున బహిరంగ క్షమాపణలు కోరారు. అదేవిధంగా టీటీడీ అధికారులు కూడా క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక, టీటీడీ బోర్డు సభ్యులు.. బాధితుల కుటుంబాల వద్దకు వెళ్లి.. సారీ చెప్పాలని, పరిహారం ఇవ్వాలని కోరారు.
ఈ క్రమంలో తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పవన్ కల్యాణ్ మాట నెరవేర్చేందుకు రెడీ అయింది. శనివారం ఉదయం లేదా సాయంత్రం పాలక మండలి సభ్యులు బాధితుల కుటుంబాలను పరామర్శించనున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఇప్పటికే ప్రకటించిన పరిహారం తో పాటు.. టీటీడీ తరఫున కూడా పరిహారం ప్రకటించి.. దీనిని స్వయంగా పాలక మండలి సభ్యులు మృతి చెందిన వారి కుటుంబాలకు అందించనున్నారు. అదేవిధంగా సారీ కూడా చెప్పనున్నారు.
ఇక, ఈ తొక్కిసలాటలో గాయపడిన వారికి కూడా ఇళ్లకు వెళ్లి పరిహారం అందించడంతోపాటు.. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని.. వారిని కూడా ఊరడించే ప్రయత్నం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు(శుక్రవారం) సాయంత్రం పాలక మండలి ప్రత్యేకంగా భేటీ అవుతోంది. ఈ భేటీలో పాలక మండలి నుంచి నలుగురు, అధికారులు ఇద్దరిని ఎంపిక చేసి బాధితుల ఇళ్లకు పంపించేందుకు చొరవ తీసుకోను న్నారు. తద్వారా జరిగిన ఘటనకు ఈ దశలో ఎండ్ కార్డు వేయనున్నారని సమాచారం.
This post was last modified on January 10, 2025 3:10 pm
సౌత్ ఇండియన్ సినిమాలో మోస్ట్ సెలబ్రేటెడ్ సినీ బ్రదర్స్లో సూర్య-కార్తి ద్వయం ముందు వరుసలో ఉంటుంది. వీళ్లిద్దరూ తండ్రి శివకుమార్…
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…