Political News

ఏసీబీ విచారణపై కేటీఆర్ హాట్ కామెంట్స్

ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం హాజరయ్యారు. బీఆర్ఎస్ శ్రేణులు భయపడినట్టుగా ఈ కేసులో కేసీఆర్ ను విచారించిన ఏసీబీ అధికారులు… ఆయనను అరెస్ట్ అయితే చేయలేదు. దాదాపుగా 7 గంటల పాటు ఏసీబీ విచారణ కొనసాగగా…మధ్యాహ్నం ఓ అరగంట పాటు కేటీఆర్ కు లంచ్ బ్రేక్ దొరికింది. సాయంత్రం దాకా విచారణ కొనసాగగా… తమ విచారణ ప్రస్తుతానికి ముగిసిందని ఏసీబీ అధికారులు ప్రకటించగా… కేటీఆర్ ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.

ఏసీబీ విచారణకు తన న్యాయవాదిని వెంటబెట్టుకుని వెళ్లిన కేటీఆర్… విచారణకు పూర్తిగానే సహకరించినట్లు సమాచారం. విచారణ గదిలోకి తన లాయర్ ను అనుమతించాల్సిందేనని కేటీఆర్ పట్టుబట్టినా… అందుకు తెలంగాణ హైకోర్టు కూడా ఒప్పుకోకపోవడంతో ఆయన ఒంటరిగానే విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన వెంట వెళ్లిన లాయర్ రామచంద్రారావు విచారణ జరుగుతున్న తీరును విచారణ గది బయటే కూర్చుని పరిశీలించారు. మొత్తంగా ఏసీబీ విచారణ బీఆర్ఎస్ శ్రేణులు భయపడ్డ రీతిలో అయితే జరగలేదు. కేటీఆర్ ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండానే… విచారణ బృందం ఆయనను ప్రశ్నించినల్టు సమాచారం.

ఇక విచారణ అనంతరం ఏసీబీ కార్యాలయం బయట మీడియాతో మాట్లాడిన కేటీఆర్… విచారణ జరిగిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా రేసుల్లో నిధుల చెల్లింపు జరిగిందని, దానికి సంబంధించిన ఆధారాలు అన్నీ బహిరంగంగానే ఉన్నాయని చెప్పారు. అంతా ఓపెన్ గానే జరిగితే…ఇక అవినీతి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా ఏసీబీ అధికారులు విచారణలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి రాసినచ్చిన ప్రశ్నలనే అడిగారంటూ తీవ్ర ఆరోపణ చేశారు. కేవలం నాలుగు ప్రశ్నలను పట్టుకుని వచ్చిన ఏసీబీ అధికారులు… వాటినే తిప్పి తిప్పి అడిగి… 40 ప్రశ్నలు అడిగినట్లుగా కలరింగ్ ఇచ్చారన్నారు.

విచారణకు తాను పూర్తిగా సహకరించానని చెప్పిన కేటీఆర్… సంక్రాంతి తర్వాత మరోమారు విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారన్నారు. ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఎన్ని సార్లు విచారణకు పిలిచినా తాను హాజరవుతానని కూడా ఆయన చెప్పారు. విచారణలో తనకు తెలిసిన విషయాలను తన అవగాహన మేరకు సమాధానంగా చెప్పానని తెలిపారు. విచారణలో ఏ ఒక్కప్రశ్నకు కూడా తాను దాటవేత ధోరణిని అవలంభించలేదని కూడా కేటీఆర్ చెప్పారు. విచారణకు పిలిచిన ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారని భయపడ్డ బీఆర్ఎస్ శ్రేణులు… విచారణను ముగించుకుని ఆయన ఇంటికి చేరడంతో ఊపిరి పీల్చుకున్నాయి.

This post was last modified on January 9, 2025 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

50 minutes ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

2 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

2 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago