Political News

తిరుపతిలో చంద్రబాబు.. హడలిపోయిన అధికారులు

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు… సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆపై గురువారం ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎవరి తప్పిదం వల్ల జరిగిందని కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇలా తోపులాటల్లో చనిపోవడమేమిటనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నా… భక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అమరావతిలో సమీక్షా సమావేశాన్ని ముగించుకున్న వెంటనే హుటాహుటీన తిరుపతికి వెళ్లిపోయారు. తిరుపతిలో ల్యాండ్ అయిన వెంటనే చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం తోపులాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే చంద్రబాబు విశ్వరూపాన్ని చూసి అధికారులు వణికిపోయారు.

రోగుల పరామర్శకు ముందుగానే ఘటనా స్థలికి వెళ్లిన చంద్రబాబు…అక్కడే ప్రమాదం జరిగిన తీరుపై పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీటీడీ ఈవో, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు… ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ వారని నిలదీసినంత పనిచేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలుసు కదా… మరి ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా అంటూ చంద్రబాబు ఈవోను నిలదీశారు.

టీటీడీ తరఫున ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగని రీతిలోనే ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు చెప్పగా… మరి తోపులాట ఎలా జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏర్పాట్లు చేస్తే సరిపోతుందా?… వాటిని పర్చవేక్షంచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ఇతర అధికారులను నిలదీశారు. తోపులాట జరిగిన కౌంటర్ ను పరిశీలించిన చంద్రబాబు… 2000 మంది దాకా పట్టే ఈ కౌంటర్ లోకి ఒకేసారి 2,500 మందిని ఎలా పంపారంటూ మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నాక…దానిని నెరవేర్చాలి కదా అని చంద్రబాబు అనడంలో కలెక్టర్, ఎస్పీలు భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

This post was last modified on January 9, 2025 3:51 pm

Share

Recent Posts

నాని సినిమా… సూపర్ స్ట్రాటజీ

యుఎస్‌లో పెద్ద పెద్ద స్టార్లను మించి మంచి మార్కెట్ సంపాదించుకున్న హీరో.. నాని. హీరోగా తొలి అడుగులు వేస్తున్న రోజుల్లోనే…

1 hour ago

అవును… సోనియా పుస్త‌కం ప్ర‌చురించం!

కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్య‌క్షురాలు, ప్ర‌స్తుత రాజ్య‌స‌భ స‌భ్యురాలు సోనియా గాంధీ రాసిన ఆత్మక‌థ ..పుస్త‌కం ముద్రణ వ్య‌వ‌హారం వివాదంగా మారింది.…

3 hours ago

సెప్టెంబర్ బోణీ వారం… పోటీ రసవత్తరం

ఆగస్ట్ అయిపోతోంది. ఎన్ని సినిమాలు రిలీజైనా ఇరుముడినే క్లియర్ విన్నర్ గా నిలిచి రికార్డుల భరతం పట్టేసింది. విశ్వనాథ్ అండ్…

3 hours ago

మీ ఫిజిక‌ల్ హెల్ప్ వ‌ద్దు… డ‌బ్బుంటే ఇవ్వండి!

ఆక‌స్మిక ప్ర‌చండ వ‌ర‌ద‌ల‌తో అత‌లాకుత‌ల‌మైన నేపాల్ తాజాగా ప్ర‌పంచ దేశాల‌ను ఉద్దేశించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ``భౌతికంగా మీరు మాకు…

3 hours ago

‘ఇరుముడి’లో చరణ్… రూమర్‌ను నిజం చేద్దామని

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ బాక్సాఫీస్‌లో అతి పెద్ద సంచలనం ‘ఇరుముడి’ సినిమానే అని చెప్పాలి. ఈ సినిమా రేంజికి…

4 hours ago

కన్నడిగుల ఆక్రోశం అర్థరహితం

సినిమా బాగుంటే భాషా భేదం లేకుండా తెలుగు ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇందుకు చరిత్రలో…

4 hours ago