Political News

తిరుపతిలో చంద్రబాబు.. హడలిపోయిన అధికారులు

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు… సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆపై గురువారం ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎవరి తప్పిదం వల్ల జరిగిందని కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇలా తోపులాటల్లో చనిపోవడమేమిటనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నా… భక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అమరావతిలో సమీక్షా సమావేశాన్ని ముగించుకున్న వెంటనే హుటాహుటీన తిరుపతికి వెళ్లిపోయారు. తిరుపతిలో ల్యాండ్ అయిన వెంటనే చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం తోపులాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే చంద్రబాబు విశ్వరూపాన్ని చూసి అధికారులు వణికిపోయారు.

రోగుల పరామర్శకు ముందుగానే ఘటనా స్థలికి వెళ్లిన చంద్రబాబు…అక్కడే ప్రమాదం జరిగిన తీరుపై పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీటీడీ ఈవో, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు… ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ వారని నిలదీసినంత పనిచేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలుసు కదా… మరి ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా అంటూ చంద్రబాబు ఈవోను నిలదీశారు.

టీటీడీ తరఫున ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగని రీతిలోనే ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు చెప్పగా… మరి తోపులాట ఎలా జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏర్పాట్లు చేస్తే సరిపోతుందా?… వాటిని పర్చవేక్షంచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ఇతర అధికారులను నిలదీశారు. తోపులాట జరిగిన కౌంటర్ ను పరిశీలించిన చంద్రబాబు… 2000 మంది దాకా పట్టే ఈ కౌంటర్ లోకి ఒకేసారి 2,500 మందిని ఎలా పంపారంటూ మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నాక…దానిని నెరవేర్చాలి కదా అని చంద్రబాబు అనడంలో కలెక్టర్, ఎస్పీలు భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

This post was last modified on January 9, 2025 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

39 minutes ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

50 minutes ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

4 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

5 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

6 hours ago