Political News

తిరుపతిలో చంద్రబాబు.. హడలిపోయిన అధికారులు

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో విశాఖలో ఉన్న చంద్రబాబు వేగంగా స్పందించారు. ఘటన జరిగిన తీరుపై అధికారులతో ఆరా తీసిన చంద్రబాబు… సహాయక చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఆపై గురువారం ఉదయం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు… ఘటనకు దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అసలు ఈ ఘటన ఎవరి తప్పిదం వల్ల జరిగిందని కూడా ఆయన ఆరా తీసినట్లు సమాచారం. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఇలా తోపులాటల్లో చనిపోవడమేమిటనీ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తున్నా… భక్తులు ప్రాణాలు కోల్పోయిన తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.

అమరావతిలో సమీక్షా సమావేశాన్ని ముగించుకున్న వెంటనే హుటాహుటీన తిరుపతికి వెళ్లిపోయారు. తిరుపతిలో ల్యాండ్ అయిన వెంటనే చంద్రబాబు నేరుగా ఘటన జరిగిన బైరాగిపట్టెడ ప్రాంతానికి వెళ్లారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం తోపులాటలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని. ఏ ఒక్కరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన బాధితులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలు, వారి ఆరోగ్య స్థితిగతులపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందే చంద్రబాబు విశ్వరూపాన్ని చూసి అధికారులు వణికిపోయారు.

రోగుల పరామర్శకు ముందుగానే ఘటనా స్థలికి వెళ్లిన చంద్రబాబు…అక్కడే ప్రమాదం జరిగిన తీరుపై పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీటీడీ ఈవో, తిరుపతి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో మాట్లాడిన చంద్రబాబు… ఇంత నిర్లక్ష్యమైతే ఎలా అంటూ వారని నిలదీసినంత పనిచేశారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలుసు కదా… మరి ఏర్పాట్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలి కదా అంటూ చంద్రబాబు ఈవోను నిలదీశారు.

టీటీడీ తరఫున ఎంత మంది భక్తులు వచ్చినా ఇబ్బంది కలగని రీతిలోనే ఏర్పాట్లు చేశామని ఈవో శ్యామలరావు చెప్పగా… మరి తోపులాట ఎలా జరిగిందని చంద్రబాబు మండిపడ్డారు. ఏర్పాట్లు చేస్తే సరిపోతుందా?… వాటిని పర్చవేక్షంచాల్సిన అవసరం లేదా? అని చంద్రబాబు ఇతర అధికారులను నిలదీశారు. తోపులాట జరిగిన కౌంటర్ ను పరిశీలించిన చంద్రబాబు… 2000 మంది దాకా పట్టే ఈ కౌంటర్ లోకి ఒకేసారి 2,500 మందిని ఎలా పంపారంటూ మండిపడ్డారు. బాధ్యత తీసుకున్నాక…దానిని నెరవేర్చాలి కదా అని చంద్రబాబు అనడంలో కలెక్టర్, ఎస్పీలు భయంతో వణికిపోయారు. ఈ ఘటనకు కారణమైన వారు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని చంద్రబాబు హెచ్చరించారు.

This post was last modified on January 9, 2025 3:51 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

1 hour ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

2 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

3 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

3 hours ago

సీఎం విజయ్ కి బంపర్ ఆఫర్

తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ కి నిజంగానే బంపర్ ఆఫర్ వచ్చిందని చెప్పాలి. అదికార డీఎంకేతో…

3 hours ago

తారక్ ఫ్యాన్స్‌కు ఆ రోజు నిద్ర ఉండదు

మే నెల అంటే నందమూరి అభిమానులకు చాలా స్పెషల్. ఈ నెలలోనే లెజెండరీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక…

4 hours ago