Political News

ఈ మాజీ మంత్రిది ఒంటరి పోరాటమేనా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశంపార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షునిగా కొవ్వూరు మాజీ ఎంఎల్ఏ, మాజీమంత్రి జవహార్ నియమించిన విషయం అందరికీ తెలిసిందే. చాలా కాలంగా జవహర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బలమైన వర్గం ఇంకా వ్యతిరేకిస్తున్న కారణంగా మాజీ మంత్రి ఒంటరైపోయారు. నియోజకవర్గాల పునర్ విభజనలో భాగంగా కొవ్వూరు ఎస్సీ నియోజకవర్గంగా మారింది.

టీచర్ గా పనిచేస్తున్న జవహర్ 2014 ఎన్నికలకు ముందు పార్టీలో చేరి ఎంఎల్ఏ గా పోటిచేసి గెలిచారు. అదే ఊపులో మంత్రి కూడా అయిపోయారు. అప్పటి వరకు నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తున్న బలమైన వర్గానికి జవహర్ కు చెడింది. ఎంఎల్ఏగా ఉన్నంత వరకు సంబంధాలు బాగానే ఉన్నాయి. ఎప్పుడైతే జవహర్ మంత్రయ్యారో అప్పటి నుండి స్వతంత్రంగా వ్యవహరించటంలో బలమైన వర్గంలోని నేతలకు మండిపోయింది. దాంతో మంత్రికి వ్యతిరేకవర్గం నేతలకు బాగా చెడింది.

జవహర్ మంత్రిగా ఉన్నా నియోజకవర్గంలో పోటి కార్యక్రమాలను వ్యతిరేక వర్గం నిర్వహిస్తునే ఉంది. 2019 ఎన్నికల్లో జవహర్ కొవ్వూరులో పోటి చేసినా గెలిచే పరిస్ధితి లేకపోవటంతో కృష్ణా జిల్లాలోని తిరువూరుకు మార్చారు. విశాఖపట్నం జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం ఎంఎల్ఏ వంగలపూడి అనితను కొవ్వూరుకు చంద్రబాబునాయుడు షిఫ్ట్ చేశారు. అయితే ఇటు అనిత అటు జవహర్ ఇద్దరూ ఓడిపోయారు. దానికితోడు పార్టీ కూడా ఘోరంగా ఓడిపోవటంతో మళ్ళీ ఎవరి నియోజకవర్గాలకు వాళ్ళు వెళ్ళిపోయారు.

ఎటూ పార్టీతో పాటు జవహర్ కూడా ఓడిపోయారు కాబట్టి ఇక నియోజకవర్గంలో గొడవలుండవని అనుకున్నారు. అయితే మాజీమంత్రికి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షునిగా నియమించబోతున్న విషయం బయటకు వచ్చింది. దాంతో వ్యతిరేక వర్గం మళ్ళీ యాక్టివ్ అయి జవహర్ ను అధ్యక్షునిగా నియమించకూడదంటూ నేతలతో తీర్మానం చేయించి చంద్రబాబుకు ఇచ్చారు. అయితే ఇంతమంది చెప్పినా వినకుండా చంద్రబాబు మాత్రం మాజీమంత్రినే అధ్యక్షునిగా నియమించారు. దాంతో మాజీమంత్రికి మళ్ళీ బలమైన వర్గం నుండి వ్యతిరేకత మొదలైంది.

పార్టీ కార్యక్రమాల్లో దేనిలో కూడా జవహర్ కు వ్యతిరేకవర్గం సహకరించటం లేదని సమాచారం. మరి బలమైన వ్యతిరేకవర్గంను కాదని మాజీమంత్రి ఎన్నిరోజులు పార్టీ కార్యక్రమాలు నిర్వహించగలరు ? అన్నదే ఇఫుడు టాక్ ఆఫ్ ది నియోజకవర్గం అయ్యింది. మాజీమంత్రికి ఇంతటి బలమైన వ్యతిరేకవర్గం ఉందని తెలిసినా సయోధ్యం చేసే విషయంలో చంద్రబాబు ఎందుకు ప్రయత్నించటం లేదో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. జవహర్ చెప్పేది వింటున్నారు. అటు వ్యతిరేకవర్గంతోను సమావేశం అవుతున్నారు. దాంతో నియోజకవర్గంపై చంద్రబాబు మనసులో ఏముందో అర్ధంకాక అందరు అయోమయంలో ఉన్నారు. పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా నేతల మధ్య ఇన్ని విభేదాలుంటే పార్టీ ఎలా బలోపేతమవుతుందో ఏమో.

This post was last modified on October 16, 2020 2:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

1 hour ago

లేడీ డాన్లకు వార్నింగ్ ఇచ్చిన సీఎం

ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…

2 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

3 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

3 hours ago

శివన్న డెడికేషనే వేరు

తెలంగాణ‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…

4 hours ago

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

5 hours ago