Political News

వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ ఇచ్చారు: లోకేశ్

విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు.

ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ, మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదని లోకేశ్ కితాబిచ్చారు. వెంటిలేటర్‌పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ అందించారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశాన్ని రో‌ల్ మోడల్‌గా ప్రధాని మోడీ చేశారని లోకేశ్ కొనియాడారు. చంద్రబాబు విజన్ హైదరాబాద్‌లో కనిపిస్తోందని, మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్‌గా చేస్తామని అన్నారు.

విజన్-2047 కోసం..వికసిత భారత్ కోసం మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కష్టపడుతున్నారని, అందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. హర్ ఘర్ తిరంగా..ఎక్కడ చూసినా మోడీ నినాదాలు మిన్నంటాయని అన్నారు. పేదల చిరునవ్వు నమో..మహిళల ఆశాదీపం నమో అని లోకేశ్ కొనియాడారు.

This post was last modified on January 9, 2025 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

సినిమాల్లేవ్ కానీ అంతటా ఆమే..

బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…

1 hour ago

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…

6 hours ago

మహేష్ రన్నింగ్ స్టైల్ మార్చడమేంటి జక్కన్నా?

తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…

7 hours ago

దురంధర్ VS విశ్వరూపం – ఎందుకీ రచ్చ?

ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…

7 hours ago

ర‌జినీ కూతురికే నచ్చని కూలీ

విప‌రీత‌మైన ప్రి రిలీజ్ హైప్ వ‌ల్ల వ‌సూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాత‌కు లాభం అందించి ఉండ‌చ్చు.…

9 hours ago

టార్గెట్ వైసీపీ… బాబు-ప‌వ‌న్ రచిస్తున్న వ్యూహం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు సుమారు గంట‌కుపైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. బుధ‌వారం ఉద‌యం ఉండ‌వ‌ల్లిలోని ముఖ్య‌మంత్రి నివాసానికి…

10 hours ago