విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ, మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదని లోకేశ్ కితాబిచ్చారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ అందించారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశాన్ని రోల్ మోడల్గా ప్రధాని మోడీ చేశారని లోకేశ్ కొనియాడారు. చంద్రబాబు విజన్ హైదరాబాద్లో కనిపిస్తోందని, మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్గా చేస్తామని అన్నారు.
విజన్-2047 కోసం..వికసిత భారత్ కోసం మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కష్టపడుతున్నారని, అందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. హర్ ఘర్ తిరంగా..ఎక్కడ చూసినా మోడీ నినాదాలు మిన్నంటాయని అన్నారు. పేదల చిరునవ్వు నమో..మహిళల ఆశాదీపం నమో అని లోకేశ్ కొనియాడారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…
ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రముఖ ప్రవచ కర్త చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాలను పాఠ్యాంశాలుగా ప్రవేశ పెడుతున్నట్టు ప్రకటించింది. దీనికి సంబంధించి…
ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…
ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోమారు తెలంగాణ అంశం మీద నోరు విప్పారు. భారత దేశంలో…