విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ, మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదని లోకేశ్ కితాబిచ్చారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ అందించారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశాన్ని రోల్ మోడల్గా ప్రధాని మోడీ చేశారని లోకేశ్ కొనియాడారు. చంద్రబాబు విజన్ హైదరాబాద్లో కనిపిస్తోందని, మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్గా చేస్తామని అన్నారు.
విజన్-2047 కోసం..వికసిత భారత్ కోసం మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కష్టపడుతున్నారని, అందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. హర్ ఘర్ తిరంగా..ఎక్కడ చూసినా మోడీ నినాదాలు మిన్నంటాయని అన్నారు. పేదల చిరునవ్వు నమో..మహిళల ఆశాదీపం నమో అని లోకేశ్ కొనియాడారు.
This post was last modified on January 9, 2025 10:56 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…