విశాఖలో ప్రధాని మోడీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రోడ్ షోకు జనం భారీగా హాజరయ్యారు. రోడ్డుకు ఇరువైపులా ఇసకేస్తే రాలనంత జనం వచ్చారు. ఆ తర్వాత ఆంధ్రా యూనివర్సీటీ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో వారు పాల్గొన్నారు. 2 లక్షల కోట్లకు పైగా విలువ గల అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ సభలో ముందుగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీపై లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
ఇప్పటిదాకా దేశాన్ని ఏలిన ఎంతో మంది ప్రధానులను చూశామని, కానీ, మోడీలా పని చేసిన ప్రధానిని ఇప్పటిదాకా చూడలేదని లోకేశ్ కితాబిచ్చారు. వెంటిలేటర్పై ఉన్న ఏపీకి మోడీ ఆక్సిజన్ అందించారని ప్రశంసించారు. అభివృద్ధిలో దేశాన్ని రోల్ మోడల్గా ప్రధాని మోడీ చేశారని లోకేశ్ కొనియాడారు. చంద్రబాబు విజన్ హైదరాబాద్లో కనిపిస్తోందని, మోడీ సహకారంతో ఏపీని నెంబర్ వన్గా చేస్తామని అన్నారు.
విజన్-2047 కోసం..వికసిత భారత్ కోసం మోదీ అహర్నిశలు కష్టపడుతున్నారని లోకేశ్ అన్నారు. 2047 నాటికి దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు మోడీ కష్టపడుతున్నారని, అందుకు ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం తమవంతు సహకారం అందిస్తుందని చెప్పారు. హర్ ఘర్ తిరంగా..ఎక్కడ చూసినా మోడీ నినాదాలు మిన్నంటాయని అన్నారు. పేదల చిరునవ్వు నమో..మహిళల ఆశాదీపం నమో అని లోకేశ్ కొనియాడారు.
This post was last modified on January 9, 2025 10:56 am
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…