Political News

లాయర్లు దూరాన కూర్చుంటే ఓకే… కేటీఆర్ కు హైకోర్టు షాక్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు హైకోర్టులో గట్టి షాకే తగిలింది. ఏసీబీ విచారణకు హాజరయ్యే సమయంలో తన వెంట తన న్యాయవాదులను తీసుకెళతానని, అందుకు అనుతించాలంటూ కేటీఆర్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఏసీబీ విచారణకు లాయర్ల అవసరం ఏముందని ఈ సందర్భంగా కోర్టు కేటీఆర్ ను ప్రశ్నంచింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ తో పాటు ఆయన లాయర్లు కూర్చోవడానికి వీల్లేదని కూడా కోర్టు తేల్చి చెప్పింది. వెరసి లాయర్ ను అనుమతిస్తేనే ఏసీబీ విచారణకు హాజరవుతానంటున్న కేటీఆర్ కు కోర్టు షాకిచ్చందనే చెప్పాలి.

ఫార్ములా ఈ కారు రేసుల వ్యవహారంలో ప్రజా ధనం దుర్వినియోగం అయ్యిందని, ఈ వ్యవహారంలో అంతిమంగా ఎవరికి లబ్ధి జరిగిందన్న విషయాన్ని తేల్చే దిశగా ఏసీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కారు రేసుల ఒప్పందాలు జరిగిన కాలంలో మంత్రిగా ఉన్న కేటీఆర్ తో పాటు నాడు మునిసిపల్ శాఖ ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. విచారణకు రావాలంటూ ముగ్గురికీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ నోటీసులకు సానుకూలంగానే స్పందించన కేటీఆర్… లాయర్లను వెంటబెట్టుకుని విచారణకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. లాయర్లను అనుమతించబోమని ఏసీబీ చెప్పగా…కేటీఆర్ విచారణకు వెళ్లకుండానే వెనుదిరిగారు. అయితే విచారణకు రావాలంటూ మరోమారు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.

ఈ క్రమంలో లాయర్లతో కలిసే విచారణకు హాజరవుతానని చెబుతున్న కేటీఆర్… అందుకు అనుమతించాలంటూ తెలంగాణ హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన కోర్టు… లంచ్ తర్వాత విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఏసీబీ విచారణకు లాయర్లతో కలిసి హాజరు కావడం కుదరదని కేటీఆర్ కు తేల్చిచెప్పింది. అయితే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారిస్తున్న సమయంలో… ఈ విచారణకు అల్లంత దూరాన కేటీఆర్ తరఫు లాయర్లు కూర్చునేందుకు కోర్టు అనుమతించింది. ఇలా కూర్చునే లాయర్లు ఎవరన్న విషయాన్ని కూడా తానే చెబుతానన్న కోర్టు… ఓ ముగ్గురు లాయర్ల పేర్లను ప్రతిపాదించాలని కేటీఆర్ కు సూచించింది. కేటీఆర్ సూచించే లాయర్లలో ఎవరు విచారణను పరిశీలించాలన్న విషయాన్ని చెబుతానని కోర్టు తెలిపింది.

This post was last modified on January 8, 2025 3:29 pm

Share

Recent Posts

గోరు ముద్దలు కాదు విషపు ముద్దలు తినిపించారు

వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…

11 minutes ago

టాక్సిక్ జీవోలు… దాటాల్సిన సవాళ్లు

రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…

17 minutes ago

వారణాసి తరువాత మహేష్ ఒప్పుకుంటే అనిల్ తోపే

వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…

2 hours ago

మహిళా ఎస్సైని కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…

3 hours ago

గీతూ మోహన్ దాస్… పెద్ద కథే గురూ

టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…

4 hours ago

ఇరుముడిని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉందా

ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…

4 hours ago