త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ బధూరి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయినా సరే అంతటితో ఆగని బధూరి… ఢిల్లీ సీఎం ఆతిషీపై కూడా నోరు పారేసుకున్నారు.
ఈ క్రమంలోనే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. రాళ్లు, కోడిగుడ్లు, కర్రలతో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అయితే, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలతో కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో, బీజేపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ బీజేపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అప్పటికే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి చేయి దాటడంతో అదనపు బలగాలను రప్పించారు. ప్రస్తుతం నాంపల్లిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ ప్రాంతానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా…పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు.
This post was last modified on January 7, 2025 3:16 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…