Political News

హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ బధూరి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. అయినా సరే అంతటితో ఆగని బధూరి… ఢిల్లీ సీఎం ఆతిషీపై కూడా నోరు పారేసుకున్నారు.

ఈ క్రమంలోనే నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నించాయి. రాళ్లు, కోడిగుడ్లు, కర్రలతో బీజేపీ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

అయితే, కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను అడ్డుకునేందుకు బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. కర్రలతో కాంగ్రెస్ శ్రేణులపై బీజేపీ శ్రేణులు తిరగబడ్డాయి. దీంతో, బీజేపీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

ఈ దాడిలో పలువురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ బీజేపీ కార్యకర్త తలకు బలమైన గాయం కావడంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అప్పటికే ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి చేయి దాటడంతో అదనపు బలగాలను రప్పించారు. ప్రస్తుతం నాంపల్లిలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆ ప్రాంతానికి ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరుకునేందుకు ప్రయత్నిస్తుండగా…పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు.

This post was last modified on January 7, 2025 3:16 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

21 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

4 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago