ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
దాంతోపాటు కేటీఆర్ అరెస్ట్పై ఇప్పటివరకు ఉన్న స్టే కూడా హైకోర్టు ఎత్తివేసింది. అయితే, ఈ తీర్పుపై కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు స్పీడు పెంచనున్నారు. నిన్న విచారణకు వచ్చి వెనుదిరిగిన కేటీఆర్ కు మరోసారి విచారణకు రావాలని ఏసీబీ ఆల్రెడీ నోటీసులు జారీ చేసింది.
తాజాగా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మరోసారి కేటీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు, ఈ రోజు అదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో అందుకు ఈడీ అంగీకరించింది. అయితే, తాజాగా తీర్పు నేపథ్యంలో ఈడీ కూడా త్వరలోనే కేటీఆర్ ను విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది
This post was last modified on January 7, 2025 12:16 pm
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…
ఏపీ సీఎం చంద్రబాబు... `బీసీ బాబు`గా మారనున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న సమస్యను పరిష్కరించేందుకు నడుంబిగించారా? అంటే.. ఔననే…
జనసేన పార్టీ నాయకులకు ఆ పార్టీ సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్.. కీలక విషయాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు కీలక కసరత్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…