Political News

పార్టీ నేతల్లో మొదలైన ‘ఏలూరి’ టెన్షన్

ప్రకాశం జిల్లా తెలుగుదేశంపార్టీలో ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు టెన్షన్ మొదలైందిట. ఈమధ్యనే ఏలూరిని చంద్రబాబునాయుడు బాపట్ల పార్లమెంటు నియోజకవర్గానికి అధ్యక్షునిగా నియమించిన విషయం తెలిసిందే. నియామకం జరిగి 15 రోజులు అవుతున్నా ఎంఎల్ఏ ఇంతవరకు బాధ్యతలు తీసుకోలేదట. జిల్లా పార్టీలోని సీనియర్లను కూడా కలవలేదట. తనతో రోజు టచ్ లో ఉండే క్యాడర్ ని తప్ప ఇంకెవరినీ కలవటం లేదట. సరే ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదు అని విషయం పూర్తిగా ఎంఎల్ఏ ఇష్టమనటంలో సందేహం లేదు. మరి టీడీపీ నేతల్లో ఎందుకు టెన్షన్ పెరిగిపోతోంది ?

ఎందుకంటే ఏలూరికి వైసీపీ నుండి ఒత్తిళ్ళు వస్తున్నాయని, ఏదో రోజు టీడీపీని వదిలేసి వైసీపీలో చేరటం ఖాయమని ఎప్పటి నుండో ప్రచారం జరుగుతున్నది. ఇదే సమయంలో పార్టీకి భవిష్యత్తు లేదన్న కారణంతో ఎంఎల్ఏనే పార్టీ మారిపోదామని అనుకుంటున్నారనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. కారణం సరిగ్గా తెలియకపోయినా పార్టీ కార్యక్రమాలకు ఏలూరి మాత్రం చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. ఒక్క ఏలూరే కాదు జిల్లాలో కొండపి ఎంఎల్ఏ డాక్టర్ బాల వీరాంజనేయస్వామి, అద్దంకి ఎంఎల్ఏ గొట్టిపాటి రవికుమార్ కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా ఆసక్తి చూపటం లేదు.

ఏలూరికి నోవా బ్రాండ్ వ్యవసాయ ట్రాక్టర్ల బిజినెస్ బాగా జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎంఎల్ఏ బిజినెస్ దెబ్బ తింటోందట. తాను ప్రతిపక్షం ఎంఎల్ఏ కావటం వల్లే తన బిజినెస్ దెబ్బతింటోందనే భావన పెరిగిపోతోందట. దాంతో బిజినెస్ పెంచుకోవటంలో భాగంగానే పార్టీ కార్యక్రమాలతో అంటి ముట్టనట్లున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలోనే ఎంఎల్ఏకి బాపట్ల అధ్యక్ష బాధ్యతలు ఇవ్వటం ఎంత వరకు లాభమో ఎవరికీ అర్ధం కావటం లేదు.

అయితే ఇదే సమయంలో పార్టీ సీనియర్లలో మరో వాదన కూడా వినిపిస్తోంది. పార్టీ మారిపోతాడనే అనుమానం వల్లే అద్యక్ష పదవిని ఇచ్చి ఏలూరి ముందరి కాళ్ళకు చంద్రబాబు బంధం వేసినట్లు చెప్పుకుంటున్నారు. మరి చంద్రబాబు వ్యూహం వర్కవుటవుతుందా ? లేకపోతే ఏలూరి పార్టీ మారటం ఖాయమేనా అన్నది తొందరలోనే తేలిపోవటం ఖాయమనే అనిపిస్తోంది. ఏదేమైనా ఏలూరి కారణంగా పార్టీ నేతల్లో అయోమయం మాత్రం రోజురోజుకి పెరిగిపోతోంది.

This post was last modified on October 16, 2020 4:44 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

రజని – కమల్ – చరణ్ ఒకే వేదికపై

కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…

1 min ago

అమరావతి పోయినా విశాఖ వస్తుందని జగన్ నమ్మకమా?

ఏపీ రాజ‌ధాని ఏది?  అంటే.. ఇప్పుడు చెప్పుకొనే ప‌రిస్థితి లేదు. 2019కి ముందు వ‌ర‌కు రాజ‌ధాని అమ‌రావతి అని చెప్పుకొనే…

3 hours ago

గూగుల్ యాడ్స్ కే గుమ్మరించారు

దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…

4 hours ago

ఏజెంట్ గారూ ఇప్పటికైనా కరుణించండి

సరిగ్గా ఏడాది క్రితం ఇదే ఏప్రిల్ 28న భారీ అంచనాల మధ్య ఏజెంట్ విడుదలైన విషయం అక్కినేని అభిమానులు అంత…

4 hours ago

కల్కి నిర్ణయం ఆషామాషీ కాదు

అందరికీ ముందే లీకైపోయిన కల్కి 2898 ఏడి విడుదల తేదీని జూన్ 27 ప్రకటించడం ఆశ్చర్యం కలిగించలేదు కానీ వేసవి…

4 hours ago

ఆ టైటానిక్ ప్రయాణికుడి వాచ్ ఖరీదు రూ.12.17 కోట్లు

టైటానిక్ పడవకు ప్రమాదం జరిగి సముద్రంలో మునిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. 1912 ఏప్రిల్ 15న ప్రయాణికులతో సహా మునిగిపోయిన…

4 hours ago