Political News

లోకేష్ ధైర్యం చేశాడంటున్నారు

మొత్తానికి నారా లోకేష్ చాలా ధైర్యమే చేశారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ ను వదిలి చంద్రబాబునాయుడుతో కలిసి లోకేష్ కూడా అమరావతికి వచ్చారు. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమం 300 రోజులు పూర్తియిన సందర్భంగా లోకేష్ కొన్ని రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తండ్రి, కొడుకులు అమరావతికి వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు పార్టీ నేతలెవరినీ కరకట్ట మీదున్న ఇంట్లోకి అనుమతించలేదు. చంద్రబాబు రాష్ట్రంలోకి వచ్చారన్న కారణంతో కలుద్దామని కరకట్ట ఇంటికి వచ్చిన నేతలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దాంతో వాళ్ళు చంద్రబాబును కలవకుండానే వెనక్కు వెళ్ళిపోతున్నారు.

ఇదే సమయంలో ప్రతిరోజు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకుంటునే ఉన్నారు. ఎలాగంటే జూమ్ యాప్ ద్వారానే వివిధ జిల్లాల్లోని నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇక్కడే నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అమరావతికి వచ్చిన తర్వాత కూడా నేతలతో జూమ్ లోనే మాట్లాడుతుంటే ఇక హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చినట్లు ? అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు+లోకేష్ చెవిన పడిందట. ఇందుకనే తాను ఇంట్లోనే ఉండి లోకేష్ ను బయట పర్యటించేలా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే లోకేష్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పైగా అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మొదలుపెట్టి సోమవారానికి 300 రోజులు పూర్తయ్యాయి.

ఆందోళనలు చేస్తున్న వారికి నైతిక మద్దతు ఇచ్చేట్లుగా లోకేష్ అమరావతి ప్రాంతంలోని కురగల్లు, దొండపాడు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్ళూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించారు. నిజానికి ఈపని లోకేష్ ఎప్పుడో చేసుండాలి. కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు గడచిన ఏడు మాసాలుగా ఇంట్లోనే కూర్చున్నారంటే అర్ధముంది. చంద్రబాబు వయస్సు 70 ఏళ్ళు దాటింది కాబట్టి ఆరోగ్య జాగ్రత్తల కోసమని ఇంట్లోనే కూర్చున్నారని అనుకున్నా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ 40ల్లో ఉన్న లోకేష్ కూడా తన తండ్రి లాగే ఇంట్లేనే కూర్చుంటే ఎలా.

ధైర్యం చేసి బయటకు రావాలని నేతలందరు ఎప్పటి నుండో అనుకుంటున్నదే. దానికి తగ్గట్లే లోకేష్ ఒకేసారి ఐదారు గ్రామాల్లో పర్యటించారు. దొండపాడు గ్రామంలో కాస్త వ్యతిరేక గాలి వీచినా మొత్తం మీద గ్రామాల్లో పర్యటించటం నేతల్లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. పార్టీ క్యాడర్ తో గ్యాప్ వచ్చేస్తే నేతలకు ఎలా నష్టమో నేతలతో గ్యాప్ వచ్చేస్తే చంద్రబాబు, లోకేష్ కు నష్టం. చంద్రబాబును మినహాయించినా లోకేష్ మాత్రం గ్యాప్ రాకుండా చూసుకునుంటే బాగుండేది. సరే జరిగిపోయిన విషయం గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేని మాట నిజమే. ఇప్పటి నుండైనా ట్విట్టర్ వేదికను వదిలిపెట్టి జనాల్లో లోకేష్ తిరగటాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.

This post was last modified on October 13, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: LokeshTDP

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago