Political News

లోకేష్ ధైర్యం చేశాడంటున్నారు

మొత్తానికి నారా లోకేష్ చాలా ధైర్యమే చేశారు. చాలా కాలం తర్వాత హైదరాబాద్ ను వదిలి చంద్రబాబునాయుడుతో కలిసి లోకేష్ కూడా అమరావతికి వచ్చారు. అమరావతి రాజధాని కోసం జరుగుతున్న ఉద్యమం 300 రోజులు పూర్తియిన సందర్భంగా లోకేష్ కొన్ని రాజధాని గ్రామాల్లో పర్యటించారు. తండ్రి, కొడుకులు అమరావతికి వచ్చి ఐదు రోజులవుతున్నా ఇప్పటి వరకు పార్టీ నేతలెవరినీ కరకట్ట మీదున్న ఇంట్లోకి అనుమతించలేదు. చంద్రబాబు రాష్ట్రంలోకి వచ్చారన్న కారణంతో కలుద్దామని కరకట్ట ఇంటికి వచ్చిన నేతలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. దాంతో వాళ్ళు చంద్రబాబును కలవకుండానే వెనక్కు వెళ్ళిపోతున్నారు.

ఇదే సమయంలో ప్రతిరోజు చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశాలు పెట్టుకుంటునే ఉన్నారు. ఎలాగంటే జూమ్ యాప్ ద్వారానే వివిధ జిల్లాల్లోని నేతలతో సమావేశాలు జరుపుతున్నారు. ఇక్కడే నేతల్లో అసంతృప్తి పెరిగిపోతోంది. అమరావతికి వచ్చిన తర్వాత కూడా నేతలతో జూమ్ లోనే మాట్లాడుతుంటే ఇక హైదరాబాద్ నుండి ఎందుకు వచ్చినట్లు ? అని మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం చంద్రబాబు+లోకేష్ చెవిన పడిందట. ఇందుకనే తాను ఇంట్లోనే ఉండి లోకేష్ ను బయట పర్యటించేలా చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే లోకేష్ రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పైగా అమరావతి కోసం రాజధాని గ్రామాల్లో ఆందోళనలు మొదలుపెట్టి సోమవారానికి 300 రోజులు పూర్తయ్యాయి.

ఆందోళనలు చేస్తున్న వారికి నైతిక మద్దతు ఇచ్చేట్లుగా లోకేష్ అమరావతి ప్రాంతంలోని కురగల్లు, దొండపాడు, పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, తుళ్ళూరు, అనంతవరం గ్రామాల్లో పర్యటించారు. నిజానికి ఈపని లోకేష్ ఎప్పుడో చేసుండాలి. కరోనా వైరస్ కారణంగా చంద్రబాబు గడచిన ఏడు మాసాలుగా ఇంట్లోనే కూర్చున్నారంటే అర్ధముంది. చంద్రబాబు వయస్సు 70 ఏళ్ళు దాటింది కాబట్టి ఆరోగ్య జాగ్రత్తల కోసమని ఇంట్లోనే కూర్చున్నారని అనుకున్నా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ 40ల్లో ఉన్న లోకేష్ కూడా తన తండ్రి లాగే ఇంట్లేనే కూర్చుంటే ఎలా.

ధైర్యం చేసి బయటకు రావాలని నేతలందరు ఎప్పటి నుండో అనుకుంటున్నదే. దానికి తగ్గట్లే లోకేష్ ఒకేసారి ఐదారు గ్రామాల్లో పర్యటించారు. దొండపాడు గ్రామంలో కాస్త వ్యతిరేక గాలి వీచినా మొత్తం మీద గ్రామాల్లో పర్యటించటం నేతల్లో ఉత్సాహాన్ని నింపిందనే చెప్పాలి. పార్టీ క్యాడర్ తో గ్యాప్ వచ్చేస్తే నేతలకు ఎలా నష్టమో నేతలతో గ్యాప్ వచ్చేస్తే చంద్రబాబు, లోకేష్ కు నష్టం. చంద్రబాబును మినహాయించినా లోకేష్ మాత్రం గ్యాప్ రాకుండా చూసుకునుంటే బాగుండేది. సరే జరిగిపోయిన విషయం గురించి ఎంత మాట్లాడుకున్నా ఉపయోగం లేని మాట నిజమే. ఇప్పటి నుండైనా ట్విట్టర్ వేదికను వదిలిపెట్టి జనాల్లో లోకేష్ తిరగటాన్ని నిజంగా మెచ్చుకోవాల్సిందే.

This post was last modified on October 13, 2020 12:18 pm

Share
Show comments
Published by
Satya
Tags: LokeshTDP

Recent Posts

లడ్డూ విషయం పక్క దారి పట్టేసిందా

తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…

10 minutes ago

వారణాసి విశేషాలతో అభిమానుల్లో హుషారు

గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…

17 minutes ago

ఐమాక్స్ కోసం రాజమౌళి ధర్నా

ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…

26 minutes ago

యాటిట్యూడ్ స్టార్: మృణాల్ తో డేట్.. శ్రీలీలతో పెళ్లట..!

బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ తన ప్రతి ప్రెస్ మీట్ లో ఏదో ఒక వైరల్ కంటెంట్ ఇవ్వడం…

1 hour ago

‘జగన్ కు అధికారంలో రెడ్లు.. లేనపుడు కాపులు కావాలి’

జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును ముద్రగడ పద్మనాభం పరామర్శించడం, జనసేన పార్టీలో ఉన్నా ఆయన కుమార్తె ఈ…

2 hours ago

పరీక్షలో కథ రాసిన హీరో.. కట్ చేస్తే..!

డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.…

2 hours ago