Political News

ప్రవాసులకు సవాలుగా మారిన ఆస్తుల నమోదు

తెలంగాణ రాష్ట్రంలోని వారంతా తమ ఆస్తుల్ని నమోదు చేసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం పిలుపునివ్వటం.. అందుకోసం భారీ కసరత్తు జరుగుతున్న సంగతి తెలిసిందే. వ్యవసాయేతర ఆస్తుల్ని నమోదు చేసుకుంటే.. వారికి బ్రౌన్ కలర్ బుక్ ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగా ఆన్ లైన్ లోనూ.. ఆఫ్ లైన్ లోనూ అవకాశం ఇస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఇక్కడే పెద్ద సమస్య వచ్చి పడింది. స్థానికులు పలువురికి ఆస్తుల నమోదులో బోలెడన్ని సందేహాలు వస్తుంటే.. విదేశాల్లో ఉన్న వారు.. అక్కడే స్థిరపడిన ప్రవాసుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందని చెబుతున్నారు.

ఎందుకంటే.. ఏళ్లకు ఏళ్లు విదేశాల్లో స్థిరపడిన వారిలో చాలామందికి ఆధార్ కార్డులు లేవు. అలాంటి వారి ఆస్తుల నమోదు సంగతి ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. ఆస్తుల నమోదుకు ఆధార్ తప్పనిసరి. ప్రవాసుల్లో ఆధార్ లేని వారి ఆస్తుల్ని ఎలా నమోదు చేసుకోవాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. తెలిసిన వారి ద్వారా సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి వారికి అధికారులు సైతం స్పష్టత ఇవ్వకపోవటం గమనార్హం.

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అయితే ఆధార్ లేని ప్రవాసుల ఆస్తుల్ని నమోదు చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఓవైపు ఆన్ లైన్ పోర్టల్ ఓపెన్ కావటం లేదన్న ఫిర్యాదులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గడువు తేదీ చెప్పి మరీ ఆస్తుల నమోదును పూర్తి చేయాలని చెబుతున్న ప్రభుత్వం మాటలు ప్రవాసులకు .. మరికొందరికి చుక్కలు చూపిస్తున్నాయని చెప్పక తప్పదు.

This post was last modified on October 13, 2020 7:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

28 minutes ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

1 hour ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

6 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

9 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 hours ago