Political News

ఏపీ పాలిటిక్స్ : 2024 పాఠం నేర్పిన తీరు.. !

2024.. మ‌రో రెండు రోజుల్లో చ‌రిత్ర‌లో క‌లిసిపోనుంది. అయితే.. ఈ సంవ‌త్స‌రం కొంద‌రిని మురిపిస్తే.. మ‌రింత మందికి గుణ‌పాఠం చెప్పింది. ముఖ్యంగా దేశ‌వ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో అనేక మంది నాయ‌కుల త‌ల‌రాత‌ల‌ను ఈ ఏడాది మార్చేసింది. కొంద‌రికి కోరి కోరి ప‌గ్గాలు ఎదురేగితే.. మ‌రికొంద‌రికి చివ‌రి నిమిషాల్లో ఆశ‌ల‌ను క‌బ‌ళించేసిన సంవ‌త్స‌రం కూడా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. అనేక మంది ఈ సంవ‌త్స‌రంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే.. చివ‌రి నిముషంలో టికెట్లు ద‌క్క‌క ఈసురోమ‌న్న నాయ‌కులు కూడా ఉన్నారు. వీరికైనా.. వారికైనా 2024 కొత్త‌పాఠాల‌నే నేర్పించింద‌ని చెప్పాలి.

గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో గెలిచేందుకు ప్ర‌య‌త్నించిన పిఠాపురం టీడీపీ నాయ‌కులు వ‌ర్మ‌కు చివ‌రి నిమిషంలో ఆశాభంగ‌మైతే.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి చివరి నిముషంలో బ‌రిలోకి దిగిన ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌య‌కేత‌నం ఎగుర‌వేశారు. అదేవిధంగా చివ‌రి నిముషం వ‌రకు.. టికెట్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో తీవ్ర త‌ర్జ‌న భ‌ర్జ‌న‌కు గురైన పెన‌మ‌లూరు ఎమ్మెల్యే బోడే ప్ర‌సాద్‌, బీజేపీ ఎమ్మెల్యే న‌ల్లమిల్లి రాధాకృష్ణ‌ల‌కు కూడా.. 2024 ఒక జ్ఞాప‌కంగానే కాకుండా.. పాఠంగా కూడా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల రాజ‌కీయం ఎలా ఉందో చూసేందుకు వ‌చ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి చంద్ర‌శేఖ‌ర్‌కు అనూహ్య‌ రీతిలో టికెట్ ద‌క్కింది.

ఆయ‌నకు కూడా 2024 ఒక మ‌ధుర జ్ఞాప‌క‌మే. ఇక‌, త‌న‌కు ఇక్క‌డ కాక‌పోతే.. మ‌రోచోట అయినా.. టికెట్ ఖాయ‌మ‌ని అనుకున్న దేవినేని ఉమా.. నిరాశ‌కు గురైంది కూడా ఈ ఏడాదే. అద‌విధంగా సుదీర్ఘ‌కాలం రాజ‌కీయాలు చేసిన అనేక మంది నాయ‌కు లు ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. త‌మ గెలుపు రాసిపెట్టుకోవాల‌ని శ‌ప‌థాలు చేసిన రోజా, అంబ‌టి రాంబాబు వంటివారిని ఈ ఏడాది మ‌ట్టి క‌రిపించింది. త‌మ‌కు 30 ఏళ్ల‌పాటు తిరుగులేని విజ‌యం ద‌క్కుతుంద‌ని.. పాల‌న త‌మ‌దేన‌ని భావించిన జ‌గ‌న్ కూడా బొక్క‌బోర్లా ప‌డింది.. 2024లోనే.

వీరు మాత్ర‌మే కాదు.. అతిర‌థుల‌ను తీసుకుంటే.. మ‌హిళా సెంటిమెంటుతో విజ‌యం కోసం ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ చీఫ్ ష‌ర్మిల నుంచి ‘ఈ ఒక్క సారే’ అంటూ.. సెంటిమెంటు పండించిన ఫైర్ బ్రాండ్‌ కొడాలి నాని వ‌ర‌కు అనేక మంది త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గా ల్లో ఓట‌మి చ‌విచూశారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండ‌దు.. అనేందుకు 2024 ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది. రాజ‌కీయం గా అనేక ఉత్థాన ప‌త‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు చూపించింది. రాజ‌కీయాల్లో ఎలా ఉండాలో నాయ‌కుల‌కు నేర్పించింది. ఎలా ఉండ‌కూడ‌దో కూడా అనేక పాఠాలు చెప్పింది. వారు-వీరు అనే తేడా లేకుండా.. 2024లో అంద‌రూ అనేక పాఠాలు నేర్చుకున్నార‌న‌డంలో సందేహం లేదు.

This post was last modified on December 31, 2024 1:43 pm

Share

Recent Posts

దేవిశ్రీ మళ్లీ విజృంభించబోతున్నాడా?

సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…

10 minutes ago

పట్టు విడువని విక్రమార్కుడిలా…

ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…

27 minutes ago

కొవిడ్ మత్తులో మెగా హీరో చేసిన తప్పులు

ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…

1 hour ago

సహజీవనంలోనూ గృహ హింస కేసుకు ఛాన్స్!

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…

2 hours ago

ఇండియన్ స్టార్ హీరోల సరసన టామ్ హాలండ్

అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…

2 hours ago

బెంగ‌ళూరులో స్ట్రాట‌జిస్టుల‌తో జ‌గ‌న్ భేటీ?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌లువురు కీల‌క రాజకీయ వ్యూహ‌క‌ర్త‌ల‌తో భేటీ అయ్యారా?  వ‌చ్చే ఎన్నిక‌లు.. దీనికి ముందు ఆయ‌న చేయ‌నున్న…

3 hours ago