2024.. మరో రెండు రోజుల్లో చరిత్రలో కలిసిపోనుంది. అయితే.. ఈ సంవత్సరం కొందరిని మురిపిస్తే.. మరింత మందికి గుణపాఠం చెప్పింది. ముఖ్యంగా దేశవ్యాప్తంగానే కాకుండా.. రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అనేక మంది నాయకుల తలరాతలను ఈ ఏడాది మార్చేసింది. కొందరికి కోరి కోరి పగ్గాలు ఎదురేగితే.. మరికొందరికి చివరి నిమిషాల్లో ఆశలను కబళించేసిన సంవత్సరం కూడా ఇదే కావడం గమనార్హం. అనేక మంది ఈ సంవత్సరంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు అయితే.. చివరి నిముషంలో టికెట్లు దక్కక ఈసురోమన్న నాయకులు కూడా ఉన్నారు. వీరికైనా.. వారికైనా 2024 కొత్తపాఠాలనే నేర్పించిందని చెప్పాలి.
గట్టి పట్టుదలతో గెలిచేందుకు ప్రయత్నించిన పిఠాపురం టీడీపీ నాయకులు వర్మకు చివరి నిమిషంలో ఆశాభంగమైతే.. ఇదే నియోజకవర్గం నుంచి చివరి నిముషంలో బరిలోకి దిగిన పవన్ కల్యాణ్ జయకేతనం ఎగురవేశారు. అదేవిధంగా చివరి నిముషం వరకు.. టికెట్ ప్రకటించకపోవడంతో తీవ్ర తర్జన భర్జనకు గురైన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రాధాకృష్ణలకు కూడా.. 2024 ఒక జ్ఞాపకంగానే కాకుండా.. పాఠంగా కూడా నిలిచిపోయింది. తెలుగు రాష్ట్రాల రాజకీయం ఎలా ఉందో చూసేందుకు వచ్చిన గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రి చంద్రశేఖర్కు అనూహ్య రీతిలో టికెట్ దక్కింది.
ఆయనకు కూడా 2024 ఒక మధుర జ్ఞాపకమే. ఇక, తనకు ఇక్కడ కాకపోతే.. మరోచోట అయినా.. టికెట్ ఖాయమని అనుకున్న దేవినేని ఉమా.. నిరాశకు గురైంది కూడా ఈ ఏడాదే. అదవిధంగా సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన అనేక మంది నాయకు లు ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. తమ గెలుపు రాసిపెట్టుకోవాలని శపథాలు చేసిన రోజా, అంబటి రాంబాబు వంటివారిని ఈ ఏడాది మట్టి కరిపించింది. తమకు 30 ఏళ్లపాటు తిరుగులేని విజయం దక్కుతుందని.. పాలన తమదేనని భావించిన జగన్ కూడా బొక్కబోర్లా పడింది.. 2024లోనే.
వీరు మాత్రమే కాదు.. అతిరథులను తీసుకుంటే.. మహిళా సెంటిమెంటుతో విజయం కోసం ప్రయత్నించిన కాంగ్రెస్ చీఫ్ షర్మిల నుంచి ‘ఈ ఒక్క సారే’ అంటూ.. సెంటిమెంటు పండించిన ఫైర్ బ్రాండ్ కొడాలి నాని వరకు అనేక మంది తమ తమ నియోజకవర్గా ల్లో ఓటమి చవిచూశారు. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు.. అనేందుకు 2024 ప్రబల ఉదాహరణగా నిలిచింది. రాజకీయం గా అనేక ఉత్థాన పతనాలను ప్రజలకు చూపించింది. రాజకీయాల్లో ఎలా ఉండాలో నాయకులకు నేర్పించింది. ఎలా ఉండకూడదో కూడా అనేక పాఠాలు చెప్పింది. వారు-వీరు అనే తేడా లేకుండా.. 2024లో అందరూ అనేక పాఠాలు నేర్చుకున్నారనడంలో సందేహం లేదు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…