Political News

దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో చంద్ర‌బాబు మ‌రో ఘ‌న‌త‌!

దేశంలో 31 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ స‌హా.. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్నారు. వీరంద‌రిలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త ఘ‌న‌త న‌మోదు చేసుకున్నారు. పాల‌న‌లో విజ‌న్‌తో దూసుకుపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆదాయంలోనూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో అత్య‌ధిక ధ‌న‌వంతుడైన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నిలిచారు. ఆయ‌న నిక‌ర ఆదాయం 931 కోట్ల‌రూపాయ‌లుగా ఏడీఆర్‌(అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్స్ రిఫార్మ్స్‌) సంస్థ తాజాగా వెలువ‌రించిన నివేదిక స్పష్టం చేసింది.

ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబుకు రూ.10 కోట్ల మేర‌కు అప్పులు వున్నాయ‌ని కూడా తెలిపింది. వ్యాపారాల విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానం.. ఆయ‌న విజ‌న్ వంటివి ఈ ఆదాయానికి కార‌ణ‌మ‌ని పేర్కొంది. ఇదంతా కుటుంబ ఆదాయ‌మేన‌ని తెలిపింది. ఇక‌, రెండో వ‌రుస‌లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పెమా ఖండు నిలిచారు. ఈయ‌న ఆదాయం 332 కోట్ల రూపాయ‌లు. అయితే.. ఈయ‌న‌కు 180 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అప్పులు ఉన్నాయ‌ని తెలిపింది. ఈయ‌న కూడా కుటుంబ వ్యాపారాల ద్వారానే సంప‌ద సంపాయించుకున్న‌ట్టు నివేదిక వివ‌రించింది.

ఇటీవ‌ల భూముల కుంభ‌కోణంలో చిక్కుకున్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య మాత్రం రూ.51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు. ఈయ‌న‌కు 23 కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్పులు ఉన్న‌ట్టు ఏడీఆర్ వివ‌రించింది. కేర‌ళ ముఖ్య‌మంత్రి, క‌మ్యూనిస్టు నాయ‌కుడు పిన‌ర‌యి విజ‌య‌న్ ఆస్తుల విలువ రూ.1.18 కోట్లుగా ఉంద‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈయ‌న కుటుంబ ఆస్తులు పెద్ద‌గా లేవ‌ని పేర్కొంది. ఇక‌, దేశంలోనే అత్యంత పేద ముఖ్య‌మంత్రి ఎవ‌రైనాఉన్నారంటే.. ఆమె ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీనేన‌ని ఏడీఆర్ తెలిపింది. ఈమె ఆస్తుల విలువ కేవలం రూ.15 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని వెల్ల‌డించింది. ఈమె అప్పులు 92 వేల‌ రూపాయ‌లుగా ఉన్నాయ‌ని తెలిపింది.

అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్ నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌ల బాద్య‌త‌లు చేప‌ట్టిన ఒమ‌ర్ అబ్దుల్లా ఆస్తులు కేవ‌లం 55ల‌క్ష‌లేన‌ని ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది. ఈయ‌న‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పులు ఉన్నాయ‌ని తెలిపింది. మొత్తంగా 31 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఆస్తుల విలువ రూ.1632 కోట్లుగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. వీరిలో 10 మందిపై క్రిమిన‌ల్ కేసులు, మ‌రో 10 మందిపై అతి తీవ్ర‌మైన కేసులు ఉన్నాయ‌ని తెలిపింది. కాగా.. ఇవ‌న్నీ.. ఈ ఏడాదివారు ఐటీకి స‌మ‌ర్పించిన ఆస్తుల వివ‌రాల ఆధారంగా నివేదిక రూపొందించిన‌ట్టు ఏడీఆర్ వివ‌రించింది.

This post was last modified on December 31, 2024 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

2 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

8 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago