Political News

దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో చంద్ర‌బాబు మ‌రో ఘ‌న‌త‌!

దేశంలో 31 మంది ముఖ్య‌మంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ స‌హా.. ఇత‌ర రాష్ట్రాల‌కు చెందిన వారు ఉన్నారు. వీరంద‌రిలోనూ ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌రికొత్త ఘ‌న‌త న‌మోదు చేసుకున్నారు. పాల‌న‌లో విజ‌న్‌తో దూసుకుపోతున్న ఆయ‌న‌.. ఇప్పుడు ఆదాయంలోనూ త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. దేశంలోని ముఖ్య‌మంత్రుల్లో అత్య‌ధిక ధ‌న‌వంతుడైన ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు నిలిచారు. ఆయ‌న నిక‌ర ఆదాయం 931 కోట్ల‌రూపాయ‌లుగా ఏడీఆర్‌(అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్ర‌టిక్స్ రిఫార్మ్స్‌) సంస్థ తాజాగా వెలువ‌రించిన నివేదిక స్పష్టం చేసింది.

ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబుకు రూ.10 కోట్ల మేర‌కు అప్పులు వున్నాయ‌ని కూడా తెలిపింది. వ్యాపారాల విష‌యంలో చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధానం.. ఆయ‌న విజ‌న్ వంటివి ఈ ఆదాయానికి కార‌ణ‌మ‌ని పేర్కొంది. ఇదంతా కుటుంబ ఆదాయ‌మేన‌ని తెలిపింది. ఇక‌, రెండో వ‌రుస‌లో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి పెమా ఖండు నిలిచారు. ఈయ‌న ఆదాయం 332 కోట్ల రూపాయ‌లు. అయితే.. ఈయ‌న‌కు 180 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అప్పులు ఉన్నాయ‌ని తెలిపింది. ఈయ‌న కూడా కుటుంబ వ్యాపారాల ద్వారానే సంప‌ద సంపాయించుకున్న‌ట్టు నివేదిక వివ‌రించింది.

ఇటీవ‌ల భూముల కుంభ‌కోణంలో చిక్కుకున్న క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య మాత్రం రూ.51 కోట్ల ఆస్తితో మూడో స్థానంలో ఉన్నారు. ఈయ‌న‌కు 23 కోట్ల రూపాయ‌ల మేర‌కు అప్పులు ఉన్న‌ట్టు ఏడీఆర్ వివ‌రించింది. కేర‌ళ ముఖ్య‌మంత్రి, క‌మ్యూనిస్టు నాయ‌కుడు పిన‌ర‌యి విజ‌య‌న్ ఆస్తుల విలువ రూ.1.18 కోట్లుగా ఉంద‌ని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. ఈయ‌న కుటుంబ ఆస్తులు పెద్ద‌గా లేవ‌ని పేర్కొంది. ఇక‌, దేశంలోనే అత్యంత పేద ముఖ్య‌మంత్రి ఎవ‌రైనాఉన్నారంటే.. ఆమె ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీనేన‌ని ఏడీఆర్ తెలిపింది. ఈమె ఆస్తుల విలువ కేవలం రూ.15 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ని వెల్ల‌డించింది. ఈమె అప్పులు 92 వేల‌ రూపాయ‌లుగా ఉన్నాయ‌ని తెలిపింది.

అదేవిధంగా జ‌మ్ము క‌శ్మీర్ నూత‌న ముఖ్య‌మంత్రిగా ఇటీవ‌ల బాద్య‌త‌లు చేప‌ట్టిన ఒమ‌ర్ అబ్దుల్లా ఆస్తులు కేవ‌లం 55ల‌క్ష‌లేన‌ని ఏడీఆర్ నివేదిక వెల్ల‌డించింది. ఈయ‌న‌కు రూ.3 ల‌క్ష‌ల వ‌ర‌కు అప్పులు ఉన్నాయ‌ని తెలిపింది. మొత్తంగా 31 రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఆస్తుల విలువ రూ.1632 కోట్లుగా ఉంద‌ని నివేదిక వెల్ల‌డించింది. వీరిలో 10 మందిపై క్రిమిన‌ల్ కేసులు, మ‌రో 10 మందిపై అతి తీవ్ర‌మైన కేసులు ఉన్నాయ‌ని తెలిపింది. కాగా.. ఇవ‌న్నీ.. ఈ ఏడాదివారు ఐటీకి స‌మ‌ర్పించిన ఆస్తుల వివ‌రాల ఆధారంగా నివేదిక రూపొందించిన‌ట్టు ఏడీఆర్ వివ‌రించింది.

This post was last modified on December 31, 2024 1:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తండేల్ రేట్ల పెంపుపై హాట్ డిస్కషన్లు

ఎల్లుండి విడుదల కాబోతున్న తండేల్ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది.…

26 minutes ago

చంద్రబాబు మార్క్… తెలుగులో తొలి జీవో విడుదల

దేశభాషలందు తెలుగు లెస్స అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారు అంటుంటే…ఏపీలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఏపీలో తెలుగు ‘లెస్’…

43 minutes ago

జపాన్ దేశానికి ‘శనివారం’ – సరిపోతుందా?

న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో రెండో వంద కోట్ల బ్లాక్ బస్టర్ గా నిలిచిన సరిపోదా శనివారం అభిమానులతో…

1 hour ago

గేమ్ ఛేంజర్ పైరసీ… బన్నీ వాస్ కామెంట్స్

గత నెల సంక్రాంతికి విడుదలైన గేమ్ ఛేంజర్ మొదటి రోజే హెచ్డి పైరసీకి గురి కావడం ఇండస్ట్రీ వర్గాలతో పాటు…

2 hours ago

రాంగ్ టైంలో రిలీజ్… దెబ్బ కొడుతోందా?

తమిళంలో బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడు అజిత్ కుమార్. సూపర్ స్టార్ రజినీకాంత్ జోరు తగ్గాక.. అటు విజయ్, ఇటు అజిత్…

7 hours ago

ఏది ఎక్కడ అడగాలో తెలియదా గురూ…!

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ…

8 hours ago