Political News

జ‌గ‌న్‌కు బిగ్ షాట్లు.. ఉరుములు లేని పిడుగులు!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు 2024 భారీ షాకేన‌ని చెప్పాలి. పార్టీ ఓట‌మి, కీల‌క నాయ‌కుల జంపింగుల‌తో ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆ ప‌రిణామాల నుంచి కోలుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేదు. పైగా.. 2024 పోతూ పోతూ కూడా.. భారీ షాట్లే కొట్టింది. సోమ‌వారం సాయంత్రం ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. దీంతో ఈ ఊహించ‌ని పరిణామం వైసీపీకి భారీ షాక్ కొట్టిన‌ట్టయింది.

ఎవ‌రెవ‌రు?

మంగ‌ళ‌గిరి పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవి.. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌లేదు. పైగా ఎలాంటి ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. అనూహ్యంగా సోమ‌వారం సాయంత్రం ఆయ‌న పార్టీ మారి.. జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. ఆయ‌న‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి రాధ కూడా పార్టీలో చేరారు. ఆమె రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇదే తొలిసారి. చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవి 2014లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2019లో నారా లోకేష్ ఎంట్రీతో ఆయ‌న‌కు టికెట్ ద‌క్కలేదు. దీంతో అసంతృప్తికి గుర‌య్యారు.

త‌ర్వాత వైసీపీ బాట ప‌ట్టిన గంజి చిరంజీవికి ఏడాది ఎన్నిక‌ల్లో తొలుత ఆయ‌న‌కే టికెట్ ఇచ్చిన‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తీరా ఆయ‌న ఎన్నికల ప్ర‌చారానికి దిగే స‌మ‌యానికి వ్యూహం మార్చి మ‌హిళా అభ్య‌ర్థిని నిల‌బెట్టారు. దీంతో చిరంజీవి అప్ప‌టి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక‌, తాజాగా ఆయ‌న ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే జ‌గ‌న్‌కు బై చెప్పి.. జ‌న‌సేన కు జై కొట్టారు. ఇక‌, మ‌రో నాయ‌కుడు, ఎమ్మెల్సీగా ఉన్న జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ కూడా.. తాజాగా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి చెందిన బీసీ నాయ‌కుడు.

ఉమ్మ‌డికృష్ణాజిల్లా కైక‌లూరు నుంచి టీడీపీ త‌ర‌ఫున ఒక‌సారి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ రాలేదు. దీంతో పార్టీకి దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత‌.. వైసీపీలో చేరారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదు. బ‌దులుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. ఓడిపోయిన పార్టీలో ఉండ‌న‌ని.. అభివృద్ధి బాట‌లో ఉన్న కూట‌మికి జై కొడతానని పేర్కొంటూ..కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీకి కూడా రిజైన్ చేశారు. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసినా..అ ది ఇంకా పెండింగులోనే ఉంది. ఇంత‌లో టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగినా.. తాజాగా జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 31, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

2 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

16 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago