Political News

జ‌గ‌న్‌కు బిగ్ షాట్లు.. ఉరుములు లేని పిడుగులు!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు 2024 భారీ షాకేన‌ని చెప్పాలి. పార్టీ ఓట‌మి, కీల‌క నాయ‌కుల జంపింగుల‌తో ఆయ‌న ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో ఆ ప‌రిణామాల నుంచి కోలుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. ఫ‌లించ‌డం లేదు. పైగా.. 2024 పోతూ పోతూ కూడా.. భారీ షాట్లే కొట్టింది. సోమ‌వారం సాయంత్రం ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ అధినేత‌, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌మ‌క్షంలో మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. దీంతో ఈ ఊహించ‌ని పరిణామం వైసీపీకి భారీ షాక్ కొట్టిన‌ట్టయింది.

ఎవ‌రెవ‌రు?

మంగ‌ళ‌గిరి పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న గంజి చిరంజీవి.. వైసీపీకి రాజీనామా చేశారు. అయితే.. ఆయ‌న ఎక్క‌డా బ‌య‌ట ప‌డ‌లేదు. పైగా ఎలాంటి ప్ర‌క‌ట‌న కూడా చేయ‌లేదు. అనూహ్యంగా సోమ‌వారం సాయంత్రం ఆయ‌న పార్టీ మారి.. జ‌న‌సేన కండువా క‌ప్పుకొన్నారు. ఆయ‌న‌తోపాటు ఆయ‌న స‌తీమ‌ణి రాధ కూడా పార్టీలో చేరారు. ఆమె రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇదే తొలిసారి. చేనేత సామాజిక వ‌ర్గానికి చెందిన గంజి చిరంజీవి 2014లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే.. ఆయ‌న ఆ ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. 2019లో నారా లోకేష్ ఎంట్రీతో ఆయ‌న‌కు టికెట్ ద‌క్కలేదు. దీంతో అసంతృప్తికి గుర‌య్యారు.

త‌ర్వాత వైసీపీ బాట ప‌ట్టిన గంజి చిరంజీవికి ఏడాది ఎన్నిక‌ల్లో తొలుత ఆయ‌న‌కే టికెట్ ఇచ్చిన‌ట్టు జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. తీరా ఆయ‌న ఎన్నికల ప్ర‌చారానికి దిగే స‌మ‌యానికి వ్యూహం మార్చి మ‌హిళా అభ్య‌ర్థిని నిల‌బెట్టారు. దీంతో చిరంజీవి అప్ప‌టి నుంచి కూడా వైసీపీకి దూరంగా ఉంటూ వ‌చ్చారు. ఇక‌, తాజాగా ఆయ‌న ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌కుండానే జ‌గ‌న్‌కు బై చెప్పి.. జ‌న‌సేన కు జై కొట్టారు. ఇక‌, మ‌రో నాయ‌కుడు, ఎమ్మెల్సీగా ఉన్న జ‌య‌మంగ‌ళ వెంక‌ట‌ర‌మ‌ణ కూడా.. తాజాగా జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. ఈయ‌న వ‌డ్డెర సామాజిక వ‌ర్గానికి చెందిన బీసీ నాయ‌కుడు.

ఉమ్మ‌డికృష్ణాజిల్లా కైక‌లూరు నుంచి టీడీపీ త‌ర‌ఫున ఒక‌సారి విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ రాలేదు. దీంతో పార్టీకి దూర‌మ‌య్యారు. ఆ త‌ర్వాత‌.. వైసీపీలో చేరారు. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు వైసీపీ టికెట్ ఇవ్వ‌లేదు. బ‌దులుగా ఎమ్మెల్సీ ఇచ్చారు. అయితే.. ఓడిపోయిన పార్టీలో ఉండ‌న‌ని.. అభివృద్ధి బాట‌లో ఉన్న కూట‌మికి జై కొడతానని పేర్కొంటూ..కొన్నాళ్ల కింద‌టే ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఇక‌, అదేస‌మ‌యంలో వైసీపీకి కూడా రిజైన్ చేశారు. ఆయ‌న ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసినా..అ ది ఇంకా పెండింగులోనే ఉంది. ఇంత‌లో టీడీపీలో చేర‌తార‌ని ప్ర‌చారం జ‌రిగినా.. తాజాగా జ‌న‌సేన పార్టీ కండువా క‌ప్పుకోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on December 31, 2024 1:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పూజా హెగ్డే… ఇది తగునా?

పూజా హెగ్డే ముంబయి అమ్మాయే అయినా.. ఆమెకు బ్రేక్ వచ్చింది.. ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే అన్న సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబు బాటలోనే లోకేశ్!…’అరకు’కు మహార్దశ పక్కా!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ…

2 hours ago

క్రేజీ సీక్వెల్‌కు బడ్జెట్ సమస్యలు…

తొలి సినిమా ‘కహో నా ప్యార్ హై’తో సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిన హీరో హృతిక్ రోషన్. ఈ సినిమాతో కేవలం…

2 hours ago

ఏపీలో ‘ఆ రాజ్యాంగ ప‌ద‌వులు’ వైసీపీకి ద‌క్క‌లేదు!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, తీసుకునే నిర్ణ‌యాల‌ను స‌మీక్షించి.. నిర్ణ‌యం తీసుకునేందుకు ప్ర‌త్యేకంగా మూడు క‌మిటీలు ఉంటాయి. ఇది…

3 hours ago

ప్ర‌జల సంతృప్తి.. చంద్ర‌బాబు అసంతృప్తి!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న ప్రారంభించి.. ఏడు మాసాలు పూర్త‌యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఏమనుకుంటున్నారు? ఫీడ్ బ్యాక్ ఏంటి?…

4 hours ago

రెట్రో : 42 వయసులో శ్రియ స్పెషల్ సాంగ్…

పాతికేళ్ల క్రితం 2001 సంవత్సరంలో ఇండస్ట్రీకి వచ్చిన శ్రియ టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడింది. చిరంజీవి, బాలకృష్ణతో మొదలుపెట్టి ప్రభాస్,…

4 hours ago