సహజంగా అధికారంలో ఉన్నవారికి ఫోన్లు రాకతప్పదు.. వారు ఆన్సర్ చేయకా తప్పదు. కానీ, తనకు ప్రతి శుక్రవారం ఫోన్లు వస్తున్నాయని.. వీటిని భరించలేక పోతున్నానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లే ఫోన్లు.. అసలు ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నా.. ఆఫీసుకు చేసి మరీ విసిగిస్తున్నారు. ఈ విషయంలో నాకు చాలా ఇరిటేట్గా ఉంది” అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.
దీంతో శుక్రవారం ఫోన్ల వ్యవహారం తొలిసారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూటమి సర్కారు 14 లక్షల కోట్లని, తర్వాత.. 10 లక్షల కోట్లని, అసెంబ్లీలో 6 లక్షల కోట్లని ఇలా.. తలా ఒక లెక్క చెప్పారు. వైసీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో 3.5 లక్షల కోట్లని, తమ హయాంలో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని.. దీనిలో ఎక్కువ భాగం ప్రజలకు పంచామని చెప్పుకొచ్చింది.
మొత్తానికి జగన్ హయాంలో అప్పులు అయితే చేశారు. దీనికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా కేంద్రం ప్రోత్సహం కూడా ఉంది. గ్రాంట్లు ఇవ్వకుండా.. రాష్ట్రాలను అప్పుల మయం చేసిన ఘనత కేంద్రానిదేనని ఆర్థిక నిపుణులు కూడా పెదవి విరిచారు. ఇక, వైసీపీ హయాంలో చేసిన అప్పుల పై వడ్డీలు కట్టాలి. దీనికి ప్రతి నెలా చివరి శుక్రవారం గడువు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ భారం కట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది.
కానీ, కూటమి సర్కారు వద్ద రూకలు లేక.. నానా రచ్చ సాగుతోంది. దీంతో గడువు మీరిన తర్వాత.. తమ వడ్డీ చెల్లించాలంటూ.. బ్యాంకుల నుంచి ప్రతి శుక్రవారం ప్రభుత్వానికి ఫోన్లు వస్తున్నాయట. ఈ విషయం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అయితే..ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఓవర్ డ్రాఫ్టులు తెచ్చుకుని కాలం గడపాల్సి వస్తోందని.. పెన్నులు, పెన్సిళ్లకు కూడా.. ఆచి తూచి ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ చేసిన అప్పులపై వడ్డీలకు సొమ్ములు చెల్లించలేక పోతున్నామని సెలవిచ్చారు.
This post was last modified on December 30, 2024 3:57 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…