సహజంగా అధికారంలో ఉన్నవారికి ఫోన్లు రాకతప్పదు.. వారు ఆన్సర్ చేయకా తప్పదు. కానీ, తనకు ప్రతి శుక్రవారం ఫోన్లు వస్తున్నాయని.. వీటిని భరించలేక పోతున్నానని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆవేదన వ్యక్తం చేశారు. “ప్రతి శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఫోన్లే ఫోన్లు.. అసలు ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నా.. ఆఫీసుకు చేసి మరీ విసిగిస్తున్నారు. ఈ విషయంలో నాకు చాలా ఇరిటేట్గా ఉంది” అని ఆయన తాజాగా వ్యాఖ్యానించారు.
దీంతో శుక్రవారం ఫోన్ల వ్యవహారం తొలిసారి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అప్పులు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కూటమి సర్కారు 14 లక్షల కోట్లని, తర్వాత.. 10 లక్షల కోట్లని, అసెంబ్లీలో 6 లక్షల కోట్లని ఇలా.. తలా ఒక లెక్క చెప్పారు. వైసీపీ విషయానికి వస్తే.. చంద్రబాబు హయాంలో 3.5 లక్షల కోట్లని, తమ హయాంలో 3 లక్షల కోట్లు మాత్రమే అప్పులు చేశామని.. దీనిలో ఎక్కువ భాగం ప్రజలకు పంచామని చెప్పుకొచ్చింది.
మొత్తానికి జగన్ హయాంలో అప్పులు అయితే చేశారు. దీనికి తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా కేంద్రం ప్రోత్సహం కూడా ఉంది. గ్రాంట్లు ఇవ్వకుండా.. రాష్ట్రాలను అప్పుల మయం చేసిన ఘనత కేంద్రానిదేనని ఆర్థిక నిపుణులు కూడా పెదవి విరిచారు. ఇక, వైసీపీ హయాంలో చేసిన అప్పుల పై వడ్డీలు కట్టాలి. దీనికి ప్రతి నెలా చివరి శుక్రవారం గడువు. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు ఆ భారం కట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది.
కానీ, కూటమి సర్కారు వద్ద రూకలు లేక.. నానా రచ్చ సాగుతోంది. దీంతో గడువు మీరిన తర్వాత.. తమ వడ్డీ చెల్లించాలంటూ.. బ్యాంకుల నుంచి ప్రతి శుక్రవారం ప్రభుత్వానికి ఫోన్లు వస్తున్నాయట. ఈ విషయం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పే వరకు ఎవరికీ తెలియక పోవడం గమనార్హం. అయితే..ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఓవర్ డ్రాఫ్టులు తెచ్చుకుని కాలం గడపాల్సి వస్తోందని.. పెన్నులు, పెన్సిళ్లకు కూడా.. ఆచి తూచి ఖర్చు చేయాల్సి వస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో వైసీపీ చేసిన అప్పులపై వడ్డీలకు సొమ్ములు చెల్లించలేక పోతున్నామని సెలవిచ్చారు.
This post was last modified on December 30, 2024 3:57 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…