Political News

రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్న తమిళ స్టార్ హీరో

తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అనే పార్టీని స్థాపించిన విజయ్…వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పర్యటనలు చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇకపై సినిమాల్లో నటించనని, పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించిన విజయ్ తమిళనాట రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని టీవీకే అధినేత విజయ్ కలిశారు.

తమిళనాడులో శాంతి భద్రతలు పరిరక్షించాలని గవర్నర్ కు విజయ్ ఓ పిటిషన్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం తగు చర్యలు తీసుకోవాలని విజయ్ ఆ పిటిషన్ లో కోరారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని అత్యాచార ఘటనపై ఇప్పటికే లేఖ విడుదల చేసిన విజయ్.. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం గురించి గవర్నర్ దగ్గర ప్రస్తావించారు. డీఎంకే ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదని అన్నారు.

సీఎం స్టాలిన్ శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యారని విజయ్ లేఖ విడుదల చేసిన వెంటనే గవర్నర్ ను కలవడం తమిళనాట రాజకీయ రచ్చ రేపింది. అంతేకాకుండా, ఇటీవల తమిళనాడును కుదిపేసిన ఫెన్గల్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందలేదని గవర్నర్ దృష్టికి విజయ్ తీసుకువచ్చారు.

తుపాను బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని గవర్నర్ కు విజయ్ విజ్ఞప్తి చేశారు. మరి, విజయ్ కు డీఎంకే నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

This post was last modified on December 30, 2024 3:18 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

48 minutes ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

56 minutes ago

ఆ ప్రచారంపై మండిపడ్డ కోమటిరెడ్డి

తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…

2 hours ago

అమరావతిపై మాట్లాడే నైతిక హక్కు ఉందా జగన్!

ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…

2 hours ago

నాగ్ ఓకే అనడమే ఆలస్యం

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్‌కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…

3 hours ago

ప్రభాస్ సరదాలు ఓవర్… ఇక సమరమే!

ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…

4 hours ago