తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. తమిళగ వెట్రి కళగం(టీవీకే) అనే పార్టీని స్థాపించిన విజయ్…వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పర్యటనలు చేసే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇకపై సినిమాల్లో నటించనని, పూర్తి స్థాయి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొంటానని ప్రకటించిన విజయ్ తమిళనాట రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవిని టీవీకే అధినేత విజయ్ కలిశారు.
తమిళనాడులో శాంతి భద్రతలు పరిరక్షించాలని గవర్నర్ కు విజయ్ ఓ పిటిషన్ ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రత కోసం తగు చర్యలు తీసుకోవాలని విజయ్ ఆ పిటిషన్ లో కోరారు. అన్నా యూనివర్సిటీలో విద్యార్థిని అత్యాచార ఘటనపై ఇప్పటికే లేఖ విడుదల చేసిన విజయ్.. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, శాంతి భద్రతల వైఫల్యం గురించి గవర్నర్ దగ్గర ప్రస్తావించారు. డీఎంకే ప్రభుత్వాన్ని పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేదని అన్నారు.
సీఎం స్టాలిన్ శాంతి భద్రతల విషయంలో విఫలమయ్యారని విజయ్ లేఖ విడుదల చేసిన వెంటనే గవర్నర్ ను కలవడం తమిళనాట రాజకీయ రచ్చ రేపింది. అంతేకాకుండా, ఇటీవల తమిళనాడును కుదిపేసిన ఫెన్గల్ తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు నష్టపరిహారం అందలేదని గవర్నర్ దృష్టికి విజయ్ తీసుకువచ్చారు.
తుపాను బాధితుల సహాయార్థం రాష్ట్ర ప్రభుత్వం కోరిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసేలా చూడాలని గవర్నర్ కు విజయ్ విజ్ఞప్తి చేశారు. మరి, విజయ్ కు డీఎంకే నేతల కౌంటర్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
This post was last modified on December 30, 2024 3:18 pm
తమిళనాడు ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసుకున్న విజయ్ పార్టీ టీవీకే 110 స్థానాల్లో ఆధిక్యం సంపాయించింది. అయితే.. అధికారంలోకి…
లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…
శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…
తమిళనాట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ విజయదుందుభి మోగించారు. ఏకపక్షంగా 110 స్థానాల్లో ఆయన విజయం దక్కించుకునే దిశగా…
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…