టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు వ్యూహకర్తలు పనిచేశారు. రాబిన్ శర్మ తన టీంను రంగంలోకి దింపి.. ఎప్పటికప్పుడు ఆలోచనలు పంచుకుని.. వ్యూహాలు వేసి.. పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఇప్పుడు మరోసారి కూడా ఆయన పార్టీకి పనిచేసేందుకు రేపోమాపో రంగంలోకి దిగుతున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఆయన మరోసారి పనిలోకి దిగడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. అయితే.. కూటమి సర్కారుకు అనుకున్న మైలేజీ వస్తున్నా.. ఇంకా రావాలన్న తపన ఉంది.
ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబు రాబిన్ శర్మను రంగంలోకి దింపారని తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు రాబిన్ శర్మ పనిచేశారు. ఇది వర్కవుట్ అయింది. వచ్చే ఏడాది ఢిల్లీ, సహా యూపీ ఎన్నికలు ఉన్నాయి. అయినా.. ఆయన ఏపీపైనే కాన్సన్ట్రేట్ చేయనున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నుంచి రాబిన్ శర్మ కు ఆహ్వానం వెళ్లడం.. ఆయన కూడా ఏపీకి వచ్చేందుకు రెడీ కావడం గమనార్హం.
ఇప్పుడు ఏం చేస్తారు?
ప్రభుత్వ పాలనపై రాబిన్ శర్మ తనదైన ముద్ర వేయనున్నారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వ పరంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే.. వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యేలు, మంత్రులకు చెబుతున్నారు. కానీ, చంద్రబాబు తరహాలో వారు ప్రచారం చేయలేక పోతున్నారు. ఈ క్రమంలో రాబిన్ శర్మ నేతృత్వంలో సరికొత్త ప్రచారం ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.
దీని ప్రకారం.. సీఎం పేషీలో జరుగుతున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలపై 50 మంది యువకులకు శిక్షణ ఇవ్వనున్నారు. వీరిని త్వరలోనే జిల్లాలకు పంపించి.. జిల్లాలకు ఇద్దరితో ప్రచారం చేయించనున్నారు. తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా.. చూడడంతోపాటు, చంద్రబాబు పాలనను ప్రజలకు వివరించేలా వీరు చేయనున్నారు. ఇదేసమయంలో ప్రజల నాడిని కూడా పసిగట్టనున్నారు. ప్రజా వ్యతిరేకత రాకుండా.. కాపుకాచే బాధ్యతలను రాబిన్ శర్మకు అప్పగించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
This post was last modified on December 29, 2024 4:22 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…