Political News

లక్ష్మీపార్వతిపై విరుచుకుపడ్డ రాజేంద్ర ప్రసాద్!

తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు కానీ.. ఆయనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినవారే. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత ఇన్ ‌యాక్టివ్ అయిపోయారు. ఐతే ఆయన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులకు తెలుసు.

ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక పాడ్ కాస్ట్‌‌లో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎన్ఠీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్న ఆయన.. లక్ష్మీ పార్వతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారంటూ.. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీద ఎప్పుడూ ప్రత్యర్థులు విమర్శలు చేసి ఇబ్బంది పెట్టే వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘పెద్దాయన చనిపోయినపుడు వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చింది నేనే. మీరు వీడియో చూస్తే ఆయన బాడీ మీద పడుకుని ఏడ్చాను. ఎందుకు అనేది ఇవాళ చెబుతున్నాను ఫస్ట్ టైం. నా దృష్టిలో రామారావు గారు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు. కానీ ఒక స్టేజ్‌లో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆమె వచ్చాకే అంతా మారిపోయింది.

ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్ల. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని అందరూ బయటపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. ఆవిడ్ని నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆవిడ మీద మర్యాద లేదు నాకు.

ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరి ఆయన్ని మాకు లేకుండా చేసింది అన్నది నా అభిప్రాయం. అప్పటి ఎన్నికల కవరేజీ చూడండి. ఆవిడ మీద ఒంటి కాలి మీద లేచి ఆమెను తొక్కేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ముందుంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

Kumar

Recent Posts

చివరికి స్మశానాలను కూడా వదలలేదు

అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…

45 minutes ago

పిల్లోడు యాక్సిడెంట్ చేయడం సహజం: జగన్

మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…

2 hours ago

ఏనుగు ఇంతలా పగబట్టేసిందా

పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…

2 hours ago

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

4 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

4 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

4 hours ago