తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు కానీ.. ఆయనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినవారే. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత ఇన్ యాక్టివ్ అయిపోయారు. ఐతే ఆయన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులకు తెలుసు.
ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక పాడ్ కాస్ట్లో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎన్ఠీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్న ఆయన.. లక్ష్మీ పార్వతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారంటూ.. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్ను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీద ఎప్పుడూ ప్రత్యర్థులు విమర్శలు చేసి ఇబ్బంది పెట్టే వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
‘‘పెద్దాయన చనిపోయినపుడు వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చింది నేనే. మీరు వీడియో చూస్తే ఆయన బాడీ మీద పడుకుని ఏడ్చాను. ఎందుకు అనేది ఇవాళ చెబుతున్నాను ఫస్ట్ టైం. నా దృష్టిలో రామారావు గారు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు. కానీ ఒక స్టేజ్లో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆమె వచ్చాకే అంతా మారిపోయింది.
ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్ల. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని అందరూ బయటపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. ఆవిడ్ని నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆవిడ మీద మర్యాద లేదు నాకు.
ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరి ఆయన్ని మాకు లేకుండా చేసింది అన్నది నా అభిప్రాయం. అప్పటి ఎన్నికల కవరేజీ చూడండి. ఆవిడ మీద ఒంటి కాలి మీద లేచి ఆమెను తొక్కేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ముందుంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.
This post was last modified on December 29, 2024 3:00 pm
రాజకీయ సన్యాసం తీసుకున్న వైసీపీ మాజీ విజయసాయిరెడ్డికి సంబంధించిన రహస్యాలు ఒక్కొక్కటిగానే వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వచ్చిన ఓ విషయం…
ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లో టీమిండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో రికార్డు సృష్టించాడు. కఠిన సమయంలో మ్యాచ్…
టాలీవుడ్ ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మంచు మోహన్ బాబు కుటుంబంలో రేగిన ఆస్తుల పంచాయితీ సోమవారం మరో మలుపు…
భారతీయ రైల్వే తన ప్రయాణికుల కోసం అన్ని రకాల సేవలను ఒకే చోట అందించే కొత్త యాప్ను ప్రారంభించింది. ‘స్వరైల్…
అక్కినేని నాగచైతన్య కెరీర్లోనే అత్యధిక అంచనాల మధ్య విడుదల కాబోతోంది ‘తండేల్’ మూవీ. తన చివరి చిత్రాలు కస్టడీ, థాంక్యూ…
సినిమాల్లో విలనీ… రియల్ లైఫ్ లో సిసలైన నాయకుడిగా సాగుతున్న ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ సోమవారం నవ్యాంద్ర…