Political News

లక్ష్మీపార్వతిపై విరుచుకుపడ్డ రాజేంద్ర ప్రసాద్!

తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు కానీ.. ఆయనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినవారే. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత ఇన్ ‌యాక్టివ్ అయిపోయారు. ఐతే ఆయన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులకు తెలుసు.

ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక పాడ్ కాస్ట్‌‌లో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎన్ఠీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్న ఆయన.. లక్ష్మీ పార్వతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారంటూ.. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీద ఎప్పుడూ ప్రత్యర్థులు విమర్శలు చేసి ఇబ్బంది పెట్టే వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘పెద్దాయన చనిపోయినపుడు వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చింది నేనే. మీరు వీడియో చూస్తే ఆయన బాడీ మీద పడుకుని ఏడ్చాను. ఎందుకు అనేది ఇవాళ చెబుతున్నాను ఫస్ట్ టైం. నా దృష్టిలో రామారావు గారు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు. కానీ ఒక స్టేజ్‌లో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆమె వచ్చాకే అంతా మారిపోయింది.

ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్ల. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని అందరూ బయటపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. ఆవిడ్ని నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆవిడ మీద మర్యాద లేదు నాకు.

ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరి ఆయన్ని మాకు లేకుండా చేసింది అన్నది నా అభిప్రాయం. అప్పటి ఎన్నికల కవరేజీ చూడండి. ఆవిడ మీద ఒంటి కాలి మీద లేచి ఆమెను తొక్కేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ముందుంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

This post was last modified on December 29, 2024 3:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

53 minutes ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

1 hour ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

3 hours ago

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

3 hours ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

4 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

5 hours ago