Political News

లక్ష్మీపార్వతిపై విరుచుకుపడ్డ రాజేంద్ర ప్రసాద్!

తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులు రాజకీయాలతో సంబంధం ఉన్న వాళ్లే. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడరు కానీ.. ఆయనా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయినవారే. ఎన్టీఆర్ హయాంలో ఆయనకు మద్దతుగా ప్రచారం చేసిన ఆయన.. ఆ తర్వాత ఇన్ ‌యాక్టివ్ అయిపోయారు. ఐతే ఆయన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి మద్దతుదారనే విషయం సన్నిహితులకు తెలుసు.

ఎప్పుడో కానీ రాజకీయాల గురించి మాట్లాడని రాజేంద్ర ప్రసాద్ తాజాగా ఒక పాడ్ కాస్ట్‌‌లో రాజకీయాల గురించి విస్తృతంగా మాట్లాడారు. ఎన్ఠీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకున్న ఆయన.. లక్ష్మీ పార్వతి మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వల్లే ఎన్టీఆర్ తమ అందరికీ దూరమయ్యారంటూ.. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి మరీ ఎన్టీఆర్‌ను నాశనం చేశారని ఆరోపించారు. చంద్రబాబు మీద ఎప్పుడూ ప్రత్యర్థులు విమర్శలు చేసి ఇబ్బంది పెట్టే వైశ్రాయ్ ఎపిసోడ్ గురించి కూడా ఆయన ఈ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘‘పెద్దాయన చనిపోయినపుడు వాళ్ల పిల్లల కంటే ఎక్కువగా ఏడ్చింది నేనే. మీరు వీడియో చూస్తే ఆయన బాడీ మీద పడుకుని ఏడ్చాను. ఎందుకు అనేది ఇవాళ చెబుతున్నాను ఫస్ట్ టైం. నా దృష్టిలో రామారావు గారు ఒక దేవుడు. దేవుడంటే ఎలా ఉంటాడో చూపించి ఆ దేవుడిగా ఉన్న వ్యక్తే ఎన్టీ రామారావు గారు. కానీ ఒక స్టేజ్‌లో ఆయనకు ఒక దరిద్రం పట్టింది. ఆయన జీవితంలోకి ఆమె వచ్చాకే అంతా మారిపోయింది.

ఆవిడ ఓవరాక్షన్ భరించలేని స్థాయికి చేరుకుంది. ఆ స్థితిలో అందరూ కలిసి ఆ సమస్య నుంచి బయటపడింది నారా చంద్రబాబు నాయుడి వల్ల. ఆయన నాయకత్వంలో వీళ్లందరూ బయటికి వచ్చి.. ఆయన్ని అడ్డం పెట్టుకుని అందరూ బయటపడ్డారు. తెలుగు దేశం పార్టీని బతికించుకున్నారు. ఆవిడ్ని నేను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాను అనుకోవచ్చు. కానీ ఆవిడ మీద మర్యాద లేదు నాకు.

ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ప్లాన్ చేసుకుని వచ్చి పెద్దాయన జీవితంలోకి దూరి ఆయన్ని మాకు లేకుండా చేసింది అన్నది నా అభిప్రాయం. అప్పటి ఎన్నికల కవరేజీ చూడండి. ఆవిడ మీద ఒంటి కాలి మీద లేచి ఆమెను తొక్కేసిన ముఖ్యమైన వ్యక్తుల్లో నేను ముందుంటాను’’ అని రాజేంద్ర ప్రసాద్ వివరించారు.

This post was last modified on December 29, 2024 3:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పాక్ కు మద్దతు ఇచ్చిన దేశాలకు ఊహించని నష్టాలు

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం దేశవ్యాప్తంగా దేశభక్తి జ్వాలలు మిన్నంటుతున్నాయి. పాక్‌కు మద్దతు పలికిన…

11 minutes ago

ఉన్నది ఇద్దరే!.. ప్రాధాన్యం ఎనలేనిదే!

నిజమే.. ఏపీలోని కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి లోక్ సభలో ఉన్నది ఇద్దరంటే ఇద్దరు సభ్యులు మాత్రమే.…

13 minutes ago

నాని ప్లస్ అనిరుధ్ – అదిరిపోయే రేటు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ సెట్లో ఇంకా హీరో అడుగు పెట్టకుండానే…

48 minutes ago

ప్రభాస్ ఉండగా దీపికకు అంత రెమ్యునరేషనా

కల్కి 2898 ఏడిలో హీరోయిన్ గా కనిపించేది ఎక్కువసేపు కాకపోయినా ప్రాధాన్యం దక్కించుకున్న దీపికా పదుకునే రెండో భాగంలో ఉంటుందో…

1 hour ago

టెన్షన్ లేదు తమ్ముడు…మంచి డేటే

కింగ్ డమ్ కోసం ముందు అనుకున్న జూలై 4 త్యాగం చేసిన తమ్ముడు కొత్త విడుదల తేదీ జూలై 25…

1 hour ago

సింగిల్ డే… జగన్ కు డబుల్ స్ట్రోక్స్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బుధవారం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి…

3 hours ago