తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచారణకు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివరాలను పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో కేటీఆర్కు స్పష్టం చేసింది. అయితే.. విచారణ సందర్భంగా కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. వీరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకా వాలని ఈడి నోటీసులలో పేర్కొంది. దీంతో వీరు కూడా.. వాంగ్మూలం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అరెస్టు అంశాలపై మాత్రం వార్తలు వస్తున్నాయి.
ఏం జరిగింది.?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నది ఆరోపణ. ఈ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నిధులు మంజూరు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసులు నమోదు చేసింది.
మరోవైపుఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీని సైతం కుదిపేసింది. అసలు ఏమీ జరగని దానికి కేసులు ఎలా నమోదు చేస్తారని కేటీఆర్ అండ్ కో ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై చర్చకు సైతం తాము రెడీ అని.. తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ ఈడీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈడీ నుంచి కేటీఆర్కు నోటీసులు వచ్చాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 2:13 pm
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఇప్పుడు అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది సల్మాన్ ఖానే. ఆయన నిఖార్సయిన బ్లాక్బస్టర్ కొట్టి దశాబ్దం…
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. ముందుగా తీసుకున్న…
మరీ డెడ్ డ్రైగా మారిపోయిన తెలుగు రాష్ట్రాల థియేటర్లు పెద్ద సినిమాలు లేక అల్లాడిపోతున్నాయి. రెండు మూడు రోజులు ప్రమోషన్లతో…
తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకునేందుకు కొనసాగిన ఉద్యమం కొత్త పుంతలు తొక్కింది. యావత్తు తెలంగాణ వేదికగా సాగిన ఈ ఉద్యమంలో…
``రాజకీయ నేతలు.. ప్రజల కోసం పనిచేసేది తక్కువ.. సెక్స్ వీడియోలు చూసేది ఎక్కువ. కావాలంటే.. నా ఫోన్ సహా.. రాష్ట్రంలోని…
బద్రి లాంటి సూపర్ హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు పూరి జగన్నాథ్. అరంగేట్రంలోనే అలాంటి హిట్ పడిందంటే ఇక…