తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచారణకు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివరాలను పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో కేటీఆర్కు స్పష్టం చేసింది. అయితే.. విచారణ సందర్భంగా కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. వీరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకా వాలని ఈడి నోటీసులలో పేర్కొంది. దీంతో వీరు కూడా.. వాంగ్మూలం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అరెస్టు అంశాలపై మాత్రం వార్తలు వస్తున్నాయి.
ఏం జరిగింది.?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నది ఆరోపణ. ఈ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నిధులు మంజూరు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసులు నమోదు చేసింది.
మరోవైపుఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీని సైతం కుదిపేసింది. అసలు ఏమీ జరగని దానికి కేసులు ఎలా నమోదు చేస్తారని కేటీఆర్ అండ్ కో ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై చర్చకు సైతం తాము రెడీ అని.. తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ ఈడీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈడీ నుంచి కేటీఆర్కు నోటీసులు వచ్చాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…