తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచారణకు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివరాలను పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో కేటీఆర్కు స్పష్టం చేసింది. అయితే.. విచారణ సందర్భంగా కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. వీరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకా వాలని ఈడి నోటీసులలో పేర్కొంది. దీంతో వీరు కూడా.. వాంగ్మూలం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అరెస్టు అంశాలపై మాత్రం వార్తలు వస్తున్నాయి.
ఏం జరిగింది.?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నది ఆరోపణ. ఈ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నిధులు మంజూరు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసులు నమోదు చేసింది.
మరోవైపుఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీని సైతం కుదిపేసింది. అసలు ఏమీ జరగని దానికి కేసులు ఎలా నమోదు చేస్తారని కేటీఆర్ అండ్ కో ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై చర్చకు సైతం తాము రెడీ అని.. తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ ఈడీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈడీ నుంచి కేటీఆర్కు నోటీసులు వచ్చాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 2:13 pm
గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా…
లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…
బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…
డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…
లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…