తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్కు ‘ఫార్ములా ఈ – రేస్’ ఉచ్చు బిగుసుకుంటోంది. ఈ కేసును ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఏసీబీ అధికారులు దీనిపై విచారణకు ఈడీని కూడా కోరారు. దీంతో ఈడీ ఈ కేసు వివరాలను పరిశీలించింది. ఈ క్రమంలో తాజాగా కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న విచారణకు రావాలని నోటీసుల్లో కేటీఆర్కు స్పష్టం చేసింది. అయితే.. విచారణ సందర్భంగా కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదిలావుంటే.. ఈ కేసులోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిలకు కూడా ఈడీ అధికారులు శనివారం నోటీసులు జారీ చేశారు. వీరిని మాత్రం జనవరి 2, 3 తేదీల్లో విచారణకు హాజరుకా వాలని ఈడి నోటీసులలో పేర్కొంది. దీంతో వీరు కూడా.. వాంగ్మూలం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే.. అరెస్టు అంశాలపై మాత్రం వార్తలు వస్తున్నాయి.
ఏం జరిగింది.?
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేస్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో హైదరాబాద్ మెట్రో కార్పొరేషన్ నుంచి సుమారు 15 కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారన్నది ఆరోపణ. ఈ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు నిధులు మంజూరు చేశారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సర్కారు ఏసీబీకి ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసులు నమోదు చేసింది.
మరోవైపుఈ వ్యవహారం ఇటీవల అసెంబ్లీని సైతం కుదిపేసింది. అసలు ఏమీ జరగని దానికి కేసులు ఎలా నమోదు చేస్తారని కేటీఆర్ అండ్ కో ప్రశ్నించారు. అంతేకాదు.. దీనిపై చర్చకు సైతం తాము రెడీ అని.. తేల్చి చెప్పారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటూ ఈడీకి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఈడీ నుంచి కేటీఆర్కు నోటీసులు వచ్చాయి. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on December 28, 2024 2:13 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…