తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.
తాజాగా జరిగిన విచారణలో, కోర్టు కేటీఆర్పై ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోకూడదని ఏసీబీని ఆదేశించింది. గతంలోనూ కోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయరాదంటూ డిసెంబర్ 21న మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణ మరింత సవివరంగా జరగాల్సి ఉందని కోర్టు విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.
కేసు వివరణలో ఏసీబీ కీలకంగా స్పందించింది. కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ కోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదనే ఆదేశాలను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. విచారణ కొనసాగుతోన్న ఈ దశలో, కేటీఆర్కు మంజూరైన రిలీఫ్ విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఏసీబీ అభిప్రాయపడింది.
కేటీఆర్ అరెస్టు విషయంలో హైకోర్టు మరోసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు విచారణను కొంతకాలం నిలిపి పెట్టినా, కోర్టు తుది నిర్ణయం మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ కేసు పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
This post was last modified on December 27, 2024 3:07 pm
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…