తెలంగాణ హైకోర్టులో ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై శుక్రవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.
తాజాగా జరిగిన విచారణలో, కోర్టు కేటీఆర్పై ఎలాంటి అరెస్టు చర్యలు తీసుకోకూడదని ఏసీబీని ఆదేశించింది. గతంలోనూ కోర్టు కేటీఆర్ను అరెస్ట్ చేయరాదంటూ డిసెంబర్ 21న మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. విచారణ మరింత సవివరంగా జరగాల్సి ఉందని కోర్టు విచారణను డిసెంబర్ 31వ తేదీకి వాయిదా వేసింది.
కేసు వివరణలో ఏసీబీ కీలకంగా స్పందించింది. కేటీఆర్ను విచారించేందుకు అనుమతించాలంటూ కోర్టుకు కౌంటర్ దాఖలు చేసింది. కేటీఆర్ను అరెస్ట్ చేయకూడదనే ఆదేశాలను రద్దు చేయాలని ఏసీబీ కోరింది. విచారణ కొనసాగుతోన్న ఈ దశలో, కేటీఆర్కు మంజూరైన రిలీఫ్ విచారణకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని ఏసీబీ అభిప్రాయపడింది.
కేటీఆర్ అరెస్టు విషయంలో హైకోర్టు మరోసారి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు విచారణను కొంతకాలం నిలిపి పెట్టినా, కోర్టు తుది నిర్ణయం మరింత ఆసక్తిని రేకిత్తిస్తోంది. ఈ కేసు పరిణామాలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
This post was last modified on December 27, 2024 3:07 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…