Political News

ఉపయోగం లేదని తెలిసినా వీల్ చెయిర్ లోనే రాజ్యసభకు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అనారోగ్య సమస్యల మధ్య కూడా దేశం కోసం తన బాధ్యతలను నిర్వర్తించిన వైనం నిజంగా స్ఫూర్తిదాయకం. గురువారం రోజు ఆయన కన్నుమూసిన విషయం తెలిసిందే. ఎంతోమంది మహోన్నత నాయకులతో కలిసి పని చేసిన అనుభవం, కఠిన సమయాల్లో కూడా ఎంతో నిబద్ధతో ఉండడం ఆయనకే చెల్లింది. విమర్శలు, ప్రశంసలపై ఏనాడు అతిగా ఉప్పొంగిపోలేదు.

మన్మోహన్ గతంలో ఆయన అనారోగ్యం కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ, దేశ ప్రజల కోసం తన బాధ్యతను నిర్వర్తించడంలో వెనుకడుగు వేయలేదు. ఆయన చేసిన ఎన్నో సేవలకు నిదర్శనంగా నిలిచే సంఘటన 2023 ఆగస్టులో చోటు చేసుకుంది. ఇప్పటికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఢిల్లీ సర్వీసెస్‌ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్‌ జరిగింది. ఈ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుపై ఓటింగ్‌ కీలకమైన సమయంలో మన్మోహన్‌ సింగ్‌ వీల్‌చైర్‌లో రాజ్యసభకు హాజరై, బిల్లుకు వ్యతిరేకంగా తన ఓటును నమోదు చేశారు. అప్పట్లో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తన బాధ్యతను నిర్లక్ష్యం చేయకుండా సభకు వచ్చారు.

మన్మోహన్‌ సింగ్‌ తుది ఫలితం ముందే తెలుసు, ఉపయోగం లేదని కూడా, తన ఓటు ముఖ్యమని భావించి సభకు హాజరవడం గమనార్హం. ఆయన చర్యలు ప్రజా ప్రతినిధిగా తన విధులు ఎంత గౌరవప్రదంగా చూసుకోవాలో ప్రజలకు గుర్తు చేశారు. ఈ అంశంపై నాడు ప్రధాని మోదీ కూడా సభలో ఆయన ధృఢతను ప్రశంసించారు. “మన్మోహన్‌ సింగ్‌ చేసిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయంగా ఉంటాయి.” అని మోదీ వ్యాఖ్యానించారు. ఇక మన్మోహన్‌ సింగ్‌ దేశానికి అందించిన సేవలు, ఆర్థిక విధానాలు, క్రమశిక్షణతో దేశంలో మార్పులకు బాటలు వేశాయి. ఆయన జీవితమంతా దేశ సేవలోనే గడిచిందని మరోసారి మోదీ ఆయన ఘనతను గుర్తు చేసుకున్నారు.

This post was last modified on December 27, 2024 11:36 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

9 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago