తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి. అలానే.. పుష్ప-2 వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరుకున పడేశారు. జైభీమ్-పుష్ప-2కు.. జాతీయ అవార్డుకు లింకు పెట్టి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇదేకాదు.. అనేక విషయాల్లో సితక్క బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.
ఈ పరిణామాలు చూసిన తర్వాత.. సీతక్క లాంటి మంత్రి మనకూ కావాలా? అనే చర్చ ఏపీలో ఆసక్తిగా మారింది. నిజానికి ఏపీలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. కానీ, ఎవరూ కూడా ఇంత ఫైర్ అయితే కాదు. వంగలపూడి అనిత.. సబ్జెక్టు పరంగా కామెంట్లు చేయగలరు. ఇక, మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా.. తమ తమ స్థాయికే పరిమితం కానీ.. పెద్దగా ఫైర్ అయితే కాదు. దీంతో సీతక్క తరహాలో ఎవరైనా ఒక మహిళా మంత్రి ఉంటే.. సూపర్ అనే టాక్.. తమ్ముళ్ల మధ్య వినిపిస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ జరిగితే.. సీతక్క లాంటి వారు కావాలని చంద్రబాబు సైతం భావిస్తే.. ఇద్దరు కీలక నాయకురాళ్లు రెడీగా ఉన్నారు. ఒకరు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి. రెండు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి. ఈ ఇద్దరు కూడా.. ఫైర్ బ్రాండ్సే. మాధవీ రెడ్డి అయితే.. నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే అయిన మర్నాడే.. నియోజకవర్గంలో వైసీపీ నేతలకు దడ పుట్టించారన్న టాక్ ఉంది.
ఇక, కార్పొరేషన్లోనూ.. తనదైన శైలిలో మాధవి రెడ్డి.. సత్తా చాటుతున్నారు. నియోజకవర్గంలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఇక, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా ఫైరే! గతంలోనూ ఆమె మంత్రిగా పనిచేశారు. మాటకు మాట! అనే తరహాలో ఈ ఇద్దరు కూడా.. రాజకీయాల్లో సంచలనాలకు పెట్టింది పేరు. సో.. మనకు కూడా సీతక్కలు కావాలని అనుకుంటే.. చంద్రబాబు ఆప్షన్ వీరివైపే ఉంటుందన్న చర్చ సాగుతోంది. కానీ, చంద్రబాబు అలా చేయడం సాధ్యం కాకపోవచ్చు.
This post was last modified on December 27, 2024 9:20 am
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…