తెలంగాణ మంత్రి ధరసరి సీతక్క.. ఫైర్.. ఫైర్బ్రాండ్! కొన్ని కొన్ని విషయాల్లో ఆమె చేసిన, చేస్తున్న కామెంట్లు కూడా ఆలోచింపజేస్తున్నాయి. అలానే.. పుష్ప-2 వివాదంపైనా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కారును ఇరుకున పడేశారు. జైభీమ్-పుష్ప-2కు.. జాతీయ అవార్డుకు లింకు పెట్టి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్ ఇవ్వలేకపోయింది. ఇదేకాదు.. అనేక విషయాల్లో సితక్క బలమైన వాయిస్ వినిపిస్తున్నారు.
ఈ పరిణామాలు చూసిన తర్వాత.. సీతక్క లాంటి మంత్రి మనకూ కావాలా? అనే చర్చ ఏపీలో ఆసక్తిగా మారింది. నిజానికి ఏపీలో ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు. కానీ, ఎవరూ కూడా ఇంత ఫైర్ అయితే కాదు. వంగలపూడి అనిత.. సబ్జెక్టు పరంగా కామెంట్లు చేయగలరు. ఇక, మిగిలిన ఇద్దరు మంత్రులు కూడా.. తమ తమ స్థాయికే పరిమితం కానీ.. పెద్దగా ఫైర్ అయితే కాదు. దీంతో సీతక్క తరహాలో ఎవరైనా ఒక మహిళా మంత్రి ఉంటే.. సూపర్ అనే టాక్.. తమ్ముళ్ల మధ్య వినిపిస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం లేదు. ఒకవేళ జరిగితే.. సీతక్క లాంటి వారు కావాలని చంద్రబాబు సైతం భావిస్తే.. ఇద్దరు కీలక నాయకురాళ్లు రెడీగా ఉన్నారు. ఒకరు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీ రెడ్డి. రెండు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి. ఈ ఇద్దరు కూడా.. ఫైర్ బ్రాండ్సే. మాధవీ రెడ్డి అయితే.. నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యే అయిన మర్నాడే.. నియోజకవర్గంలో వైసీపీ నేతలకు దడ పుట్టించారన్న టాక్ ఉంది.
ఇక, కార్పొరేషన్లోనూ.. తనదైన శైలిలో మాధవి రెడ్డి.. సత్తా చాటుతున్నారు. నియోజకవర్గంలోనూ పట్టు సాధించే ప్రయత్నం చేస్తూ.. ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోతున్నారు. ఇక, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ కూడా ఫైరే! గతంలోనూ ఆమె మంత్రిగా పనిచేశారు. మాటకు మాట! అనే తరహాలో ఈ ఇద్దరు కూడా.. రాజకీయాల్లో సంచలనాలకు పెట్టింది పేరు. సో.. మనకు కూడా సీతక్కలు కావాలని అనుకుంటే.. చంద్రబాబు ఆప్షన్ వీరివైపే ఉంటుందన్న చర్చ సాగుతోంది. కానీ, చంద్రబాబు అలా చేయడం సాధ్యం కాకపోవచ్చు.
This post was last modified on December 27, 2024 9:20 am
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…