Political News

బాబుకు విన్న‌పం: పింఛ‌న్ల జోలికి వెళ్ల‌క‌పోతేనే బెట‌ర్‌!

సామాజిక భ‌ద్ర‌తా పింఛ‌న్‌.. ఇది చాలా సునిశిత‌మైన అంశం. ఆర్థికంగా ముడిప‌డిన వ్య‌వ‌హార‌మే అయినా .. అత్యంత సెన్సిటివ్ అంశం. దీనిపై ఆధార‌ప‌డి దాదాపు 80 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. వీరిలో దివ్యాంగులు , వృద్ధులు, వితంతువులు, ఒంట‌రి మ‌హిళ‌లు.. ఇలా అనేక వ‌ర్గాలు ఉన్నాయి. ఇలాంటి సెన్సిటివ్ అంశాన్ని ఆలంబ‌న‌గా చేసుకునే ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో కూట‌మి స‌ర్కారు విజ‌యం దిశ‌గా దూసుకుపోయింది. పించ‌న్ల‌ను రూ.4000ల‌కు పెంచుతామ‌న్న హామీ బాగా వ‌ర్క‌వుట్ అయింది.

అంతేకాదు.. ఇచ్చిన హామీకి క‌ట్టుబ‌డి కూట‌మి స‌ర్కారు కూడా.. వెంట‌నే పింఛ‌ను పెంచింది. ఇంటికే తెచ్చి ఇస్తోంది. దీనివ‌ల్ల చంద్ర‌బాబు కు మైలేజీ కూడా పెరిగింది. ఆయ‌న ఏం చేస్తున్నారు? అనేది సెకండ‌రీ అయిపోయింది. కానీ, ఇప్పుడు పింఛ‌న్ల వ్య‌వ‌హారం.. ఎన్నిక‌ల‌కు ముందు ఎలా అయితే.. టాక్ ఆఫ్‌ది ఇంట్ర‌స్ట్ అయిందో.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లోనూ ఇదే చ‌ర్చ సాగుతోంది. త‌మ పింఛ‌ను ఉంటుందో ఉండ‌దో ? అనే చ‌ర్చ గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ వినిపిస్తోంది.

“పింఛ‌ను పెంచ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు.. మా పింఛ‌ను మాకు ఉంటే చాలు!” అనే మాట వినిపిస్తోంది. దీనికి కార‌ణం.. పింఛ‌న్ల ఏరివేత‌కు సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుబ‌ట్ట‌డం. అన‌ర్హులు తీసుకుంటున్నార‌ని.. వారిని ఏరివేయాల‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ ఏరి వేత‌లు.. నిజ‌మైన అనర్హుల‌ను ఏరేస్తే.. ఫ‌ర్వాలేదు. కానీ, దీనికి రాజ‌కీయాలు ముసురుకున్నాయి. క్షేత్ర‌స్తాయిలో త‌మ్ముళ్లు.. రెచ్చిపోతున్నారు. త‌మ‌కు అనుకూలంగా లేని వారి కుటుంబాల్లో పించ‌న్ల‌ను తొల‌గించేస్తున్నారు.

ఇది రాజ‌కీయంగా ఇబ్బందిగా మారే అవ‌కాశం క‌నిపిస్తోంది. తాజాగా అనంత‌పురం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో ల‌క్ష మందికిపైగా పింఛ‌ను దారుల‌కు నోటీసులు ఇచ్చారు. దీంతో వారంతా.. ఇప్పుడు కూట‌మి స‌ర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. తాము రెండు ద‌శాబ్దాలుగా పింఛ‌న్లు తీసుకుంటున్నామ‌ని.. ఇప్పుడు ఎలా తొల‌గిస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రోవైపు దివ్యాంగులు కూడా.. గాబ‌రా ప‌డుతున్నారు. తమ పింఛ‌న్లు తొల‌గించ‌వ‌ద్దంటూ.. ఎమ్మెల్యే కార్యాల‌యాల చుట్టూ తిరుగుతున్నారు. ఇది చంద్ర‌బాబుకు మైన‌స్‌గా మారే అవ‌కాశం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కాబ‌ట్టి.. పింఛ‌న్ల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌న్న సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on December 26, 2024 2:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మొన్న పెంగ్విన్.. నేడు పంచ్! ప్రపంచాన్ని కదిలించాయి

నిజమే, ఈ రెండు మూగజీవాల కథలు సోషల్ మీడియాలో నెటిజన్ల హృదయాలను పిండేశాయి. నిహిలిస్ట్ పెంగ్విన్ : ఒక డాక్యుమెంటరీలో…

4 hours ago

ఒక్క లుక్‌తో మంటలు పుట్టించిన రుక్కు

కొందరు హీరోయిన్లు కెరీర్ ఆరంభంలో చేసిన సంప్రదాయ పాత్రల కారణంగా వారి మీద ఒక ముద్ర పడిపోతుంది. వాళ్లను గ్లామర్ కోణంలో…

9 hours ago

కొత్త దర్శకుడి మీద బాలయ్య ఆసక్తి ?

అఖండ తాండవం 2 తర్వాత బాలకృష్ణ కొత్త సినిమా ఇంకా మొదలుకాలేదు. దర్శకడు గోపిచంద్ మలినేని సబ్జెక్టు మారిపోవడంతో గ్యాప్…

12 hours ago

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే…

14 hours ago

మనసు మార్చుకున్న రామ్

యువ కథానాయకుడు రామ్ ఓ నిఖార్సయిన హిట్టు కొట్టి చాలా ఏళ్లయింది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత తన చిత్రాలన్నీ బోల్తా…

15 hours ago

నెత్తుటి క్లబ్బులో ‘కల్ట్’ విధ్వంసం

వరస ఫ్లాపులతో సతమతమవుతున్న విశ్వక్ సేన్ తిరిగి దర్శకత్వంలోకి వచ్చేశాడు. ఫలక్ నుమా దాస్, దాస్ కా ధమ్కీ తర్వాత…

16 hours ago