Political News

టాలీవుడ్ ముందు తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలు

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి శేష్, నితిన్ తదితరులతో పాటు సురేష్ బాబు, కెఎల్ నారాయణ ఇతర నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.

ప్రభుత్వం వైపు నుంచి టాలీవుడ్ కు వచ్చిన ప్రతిపాదనల్లో కులగణన సర్వేల్లో నటీనటులు పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సినిమా ప్రారంభానికి ముందు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం, ప్రతి టికెట్టు మీద సెస్సు వసూలు చేయడం, సామజిక స్పృహ కలిగించే విధంగా చొరవ తీసుకోవడం ప్రధానమైనవిగా చెబుతున్నారు. అంతే కాకుండా ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదనే సూచన చేసినట్టు తెలిసింది. గద్దర్ అవార్డుల గురించి డిస్కషన్ జరిగిందని సమాచారం.

వీటిలో అధిక శాతం సాధ్యమయ్యేవే కానీ కులగణన లాంటివి సినిమాలకు సంబంధం లేని విషయాలు కావడంతో దీనికి ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి టాలీవుడ్ కు సరైన సహకారాలు అందుతూనే ఉన్నాయని, కానీ కొన్ని ఘటనల వల్ల ఇరువురికి చెడ్డ పేరు రావడం ఇకపై మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలనే దిశగా పలు సూచనలు రెండు వైపులా వచ్చినట్టు వినికిడి. కంక్లూజన్లు, సవరణలు, చర్యలు తదితర వివరాలు ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు వెల్లడించే అవకాశముంది. సంక్రాంతి దగ్గరగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Kumar

Recent Posts

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

2 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

9 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

9 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

11 hours ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

14 hours ago