తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి శేష్, నితిన్ తదితరులతో పాటు సురేష్ బాబు, కెఎల్ నారాయణ ఇతర నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వం వైపు నుంచి టాలీవుడ్ కు వచ్చిన ప్రతిపాదనల్లో కులగణన సర్వేల్లో నటీనటులు పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సినిమా ప్రారంభానికి ముందు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం, ప్రతి టికెట్టు మీద సెస్సు వసూలు చేయడం, సామజిక స్పృహ కలిగించే విధంగా చొరవ తీసుకోవడం ప్రధానమైనవిగా చెబుతున్నారు. అంతే కాకుండా ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదనే సూచన చేసినట్టు తెలిసింది. గద్దర్ అవార్డుల గురించి డిస్కషన్ జరిగిందని సమాచారం.
వీటిలో అధిక శాతం సాధ్యమయ్యేవే కానీ కులగణన లాంటివి సినిమాలకు సంబంధం లేని విషయాలు కావడంతో దీనికి ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి టాలీవుడ్ కు సరైన సహకారాలు అందుతూనే ఉన్నాయని, కానీ కొన్ని ఘటనల వల్ల ఇరువురికి చెడ్డ పేరు రావడం ఇకపై మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలనే దిశగా పలు సూచనలు రెండు వైపులా వచ్చినట్టు వినికిడి. కంక్లూజన్లు, సవరణలు, చర్యలు తదితర వివరాలు ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు వెల్లడించే అవకాశముంది. సంక్రాంతి దగ్గరగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on December 26, 2024 11:45 am
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…