తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి శేష్, నితిన్ తదితరులతో పాటు సురేష్ బాబు, కెఎల్ నారాయణ ఇతర నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వం వైపు నుంచి టాలీవుడ్ కు వచ్చిన ప్రతిపాదనల్లో కులగణన సర్వేల్లో నటీనటులు పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సినిమా ప్రారంభానికి ముందు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం, ప్రతి టికెట్టు మీద సెస్సు వసూలు చేయడం, సామజిక స్పృహ కలిగించే విధంగా చొరవ తీసుకోవడం ప్రధానమైనవిగా చెబుతున్నారు. అంతే కాకుండా ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదనే సూచన చేసినట్టు తెలిసింది. గద్దర్ అవార్డుల గురించి డిస్కషన్ జరిగిందని సమాచారం.
వీటిలో అధిక శాతం సాధ్యమయ్యేవే కానీ కులగణన లాంటివి సినిమాలకు సంబంధం లేని విషయాలు కావడంతో దీనికి ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి టాలీవుడ్ కు సరైన సహకారాలు అందుతూనే ఉన్నాయని, కానీ కొన్ని ఘటనల వల్ల ఇరువురికి చెడ్డ పేరు రావడం ఇకపై మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలనే దిశగా పలు సూచనలు రెండు వైపులా వచ్చినట్టు వినికిడి. కంక్లూజన్లు, సవరణలు, చర్యలు తదితర వివరాలు ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు వెల్లడించే అవకాశముంది. సంక్రాంతి దగ్గరగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on December 26, 2024 11:45 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…