తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో ఈ రోజు టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్టయ్యి బెయిలు మీద బయటికి వచ్చాక జరిగిన పరిణామాలతో పాటు ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించుకునే ప్రయత్నంగా దీన్ని నిర్వహించారు. నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్, కళ్యాణ్ రామ్, అడవి శేష్, నితిన్ తదితరులతో పాటు సురేష్ బాబు, కెఎల్ నారాయణ ఇతర నిర్మాతలు, దర్శకులు ఈ మీటింగ్ లో భాగం పంచుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వం వైపు నుంచి టాలీవుడ్ కు వచ్చిన ప్రతిపాదనల్లో కులగణన సర్వేల్లో నటీనటులు పాల్గొని ప్రజల్లో చైతన్యం పెంచడం, డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనడం, సినిమా ప్రారంభానికి ముందు మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా రూపొందించిన వీడియోలను ప్రదర్శించడం, ప్రతి టికెట్టు మీద సెస్సు వసూలు చేయడం, సామజిక స్పృహ కలిగించే విధంగా చొరవ తీసుకోవడం ప్రధానమైనవిగా చెబుతున్నారు. అంతే కాకుండా ఇకపై బెనిఫిట్ షోలు లేకుండా తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పట్లో మార్చే అవకాశం లేదనే సూచన చేసినట్టు తెలిసింది. గద్దర్ అవార్డుల గురించి డిస్కషన్ జరిగిందని సమాచారం.
వీటిలో అధిక శాతం సాధ్యమయ్యేవే కానీ కులగణన లాంటివి సినిమాలకు సంబంధం లేని విషయాలు కావడంతో దీనికి ఎలాంటి ప్రణాళిక వేసుకుంటారో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పటి నుంచి టాలీవుడ్ కు సరైన సహకారాలు అందుతూనే ఉన్నాయని, కానీ కొన్ని ఘటనల వల్ల ఇరువురికి చెడ్డ పేరు రావడం ఇకపై మళ్ళీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలనే దిశగా పలు సూచనలు రెండు వైపులా వచ్చినట్టు వినికిడి. కంక్లూజన్లు, సవరణలు, చర్యలు తదితర వివరాలు ప్రెస్ మీట్ ద్వారా దిల్ రాజు వెల్లడించే అవకాశముంది. సంక్రాంతి దగ్గరగా ఉన్న తరుణంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
This post was last modified on December 26, 2024 11:45 am
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…