Political News

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించే పేరుతో ఏళ్ల తరబడి ఓదార్పు యాత్ర చేసి కావాల్సినంత సానుభూతిని రాబట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సానుభూతి ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందన్నది స్పష్టం.

ఐతే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. ఐతే ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జగన్ మళ్లీ సానుభూతి ఫ్యాక్టర్ మీద దృష్టిపెట్టారు. నాటకీయ శైలిలో మాట్లాడుతూ.. మళ్లీ జనాల్లో సానుభూతి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టారు. ఓటమి పాలయ్యాం కదా అని నీరుగారి పోవాల్సిన అవసరం లేదని.. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి తన జీవితమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను పడ్డ కష్టాలను బహుశా ఏ రాజకీయ నాయకుడూ పడి ఉండడని జగన్ అన్నారు.

తండ్రి మరణానంతరం తన చుట్టూ ఎవ్వరూ లేరని.. తాను, తన తల్లి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చామని.. కొత్త పార్టీ పెడితే అది లేకుండా చేయాలని తన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని జగన్ అన్నారు. తాను జైల్లో ఉన్నపుడు బెయిల్ కోసం తన భార్య భారతి పడరాని కష్టాలు పడిందని.. 30 సార్లు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టిందని.. ప్రతిసారీ ఏదో కారణం చెప్పి తిరస్కరించేవారని.. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపి తనకు బెయిల్ రాకుండా చేశారని జగన్ ఆరోపించారు. ఇంత చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనను ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయారని.. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలందరూ కష్టాలకు బెదరకుండా పోరాడి మళ్లీ అధికారం చేపట్టడానికి తోడ్పడాలని జగన్ పిలుపునిచ్చారు.

ఐతే ఇంతకుముందు జగన్ కేసులు, జైలు జీవితంతో ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే కావచ్చు కానీ.. అవన్నీ తప్పుడు కేసులు, తాను అవినీతే చేయలేదు అంటే జనం నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అన్నది ప్రశ్న. ఇక గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించాక ఇప్పుడు తాను గతంలో పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టి సానుభూతి రాబట్టాలని చూస్తే వర్కవుట్ అవుతుందా అన్నది సందేహం.

This post was last modified on December 26, 2024 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇప్పుడు 10 మంది.. రాబోయే రోజుల్లో 100 మంది.. మనసు దోచేసిన కిరణ్

ఇవ్వటంలో ఉండే ఆనందం అందరికి అర్థం కాదు. నలుగురికి సాయం చేసే ఛాన్సు దొరికితే కొందరు మాత్రమే ఆ దిశగా…

3 hours ago

జగన్ పై సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించి... ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించడంతో పాటుగా…

5 hours ago

దర్శకుడికి బ్రేక్ ఇవ్వనున్న రీ రిలీజ్

ఒక్కోసారి దర్శకుల్లో ఎంత ప్రతిభ ఉన్నా ఒక్క డిజాస్టర్ లేదా ఫ్లాప్ వాళ్ళ కెరీర్ నే మారుస్తుంది. శ్రీకాంత్ అడ్డాల…

6 hours ago

ట్రంప్ షాకింగ్ డీల్.. ఎలన్ మస్క్‌కు బూస్ట్?

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన చేసిన పని రాజకీయంగానే కాకుండా మార్కెట్‌లోనూ…

6 hours ago

SSMB 29 ప్రభావం – ఒడిశా టూరిజానికి వైభవం

టాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్లు ఇతర రాష్ట్రాలకు షూటింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడి టూరిజానికి ఏ స్థాయి బూస్ట్ దక్కుతుందో…

7 hours ago

ఊపేస్తున్న పవన్ డ్యాన్సులు

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో అర్థం కాదు. ప్రస్తుతం తెలుగు సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్…

7 hours ago