Political News

మళ్లీ ‘సింపతీ’ని నమ్ముకున్న జగన్

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా ఎదగడానికి, ముఖ్యమంత్రి కావడానికి సింపతీ బాగా ఉపయోగపడిందనడంలో సందేహం లేదు. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారిని పరామర్శించే పేరుతో ఏళ్ల తరబడి ఓదార్పు యాత్ర చేసి కావాల్సినంత సానుభూతిని రాబట్టుకున్నాడు జగన్. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి సానుభూతి ఫ్యాక్టర్ బాగా ఉపయోగపడిందన్నది స్పష్టం.

ఐతే అధికారంలోకి వచ్చాక ఐదేళ్లు ఏం జరిగిందో అందరూ చూశారు. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్‌కు ఘోర పరాభవాన్ని కట్టబెట్టారు. ఐతే ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే జగన్ మళ్లీ సానుభూతి ఫ్యాక్టర్ మీద దృష్టిపెట్టారు. నాటకీయ శైలిలో మాట్లాడుతూ.. మళ్లీ జనాల్లో సానుభూతి రాబట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కార్యకర్తల సమావేశంలో జగన్ మాట్లాడుతూ.. తాను పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టారు. ఓటమి పాలయ్యాం కదా అని నీరుగారి పోవాల్సిన అవసరం లేదని.. కష్టాలను ఎలా ఎదుర్కోవాలో చెప్పడానికి తన జీవితమే ఉదాహరణ అని ఆయన వ్యాఖ్యానించారు. తాను పడ్డ కష్టాలను బహుశా ఏ రాజకీయ నాయకుడూ పడి ఉండడని జగన్ అన్నారు.

తండ్రి మరణానంతరం తన చుట్టూ ఎవ్వరూ లేరని.. తాను, తన తల్లి మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చామని.. కొత్త పార్టీ పెడితే అది లేకుండా చేయాలని తన మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేశారని జగన్ అన్నారు. తాను జైల్లో ఉన్నపుడు బెయిల్ కోసం తన భార్య భారతి పడరాని కష్టాలు పడిందని.. 30 సార్లు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టిందని.. ప్రతిసారీ ఏదో కారణం చెప్పి తిరస్కరించేవారని.. అప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు చేతులు కలిపి తనకు బెయిల్ రాకుండా చేశారని జగన్ ఆరోపించారు. ఇంత చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా తనను ముఖ్యమంత్రి కాకుండా ఆపలేకపోయారని.. కాబట్టి ఇప్పుడు కార్యకర్తలందరూ కష్టాలకు బెదరకుండా పోరాడి మళ్లీ అధికారం చేపట్టడానికి తోడ్పడాలని జగన్ పిలుపునిచ్చారు.

ఐతే ఇంతకుముందు జగన్ కేసులు, జైలు జీవితంతో ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే కావచ్చు కానీ.. అవన్నీ తప్పుడు కేసులు, తాను అవినీతే చేయలేదు అంటే జనం నమ్మే పరిస్థితుల్లో ఉన్నారా అన్నది ప్రశ్న. ఇక గత ఐదేళ్లు అంతులేని అధికారం అనుభవించాక ఇప్పుడు తాను గతంలో పడ్డ కష్టాల గురించి ఏకరవు పెట్టి సానుభూతి రాబట్టాలని చూస్తే వర్కవుట్ అవుతుందా అన్నది సందేహం.

This post was last modified on December 26, 2024 10:18 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

43 minutes ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

3 hours ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

3 hours ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

4 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

6 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

8 hours ago