సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని దిల్ రాజు చెప్పారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను, రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించానని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, రేవతి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని దిల్ రాజు భరోసానిచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. కావాలని ఇలా ఎవరూ చేయరని, వినోదం కోసమే రేవతి కుటుంబం థియేటర్కు వెళ్లిందని, అనుకోకుండా ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.
రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ తో భేటీ అవుతామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
This post was last modified on December 24, 2024 6:46 pm
ఈటీవీ విన్.. పోస్టర్ మీద ఈ లోగో ఉంటే చాలు.. అది సినిమా అయినా, వెబ్ సిరీస్ అయినా అందులో…
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ట్రెండింగ్ టాపిక్గా మారుతుందో.. దేని మీద నెటిజన్లు చర్చలు పెడతారో చెప్పలేం. కొన్నిసార్లు ఎప్పటివో…
ఏపీలో అధికార కూటమిలోని పార్టీల మధ్య తరచూ చిన్న చిన్న వివాదాలు చెలరేగుతున్నాయి. అయితే ఈ వివాదాలన్నీ ఆయా పార్టీల కీలక నేతల ప్రమేయం…
థియేటర్లలో రిలీజైనపుడు ఆశించిన స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకునే సినిమాలు కొన్ని ఉంటాయి. ‘ఈ నగరానికి…
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…