సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని దిల్ రాజు చెప్పారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను, రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించానని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, రేవతి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని దిల్ రాజు భరోసానిచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. కావాలని ఇలా ఎవరూ చేయరని, వినోదం కోసమే రేవతి కుటుంబం థియేటర్కు వెళ్లిందని, అనుకోకుండా ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.
రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ తో భేటీ అవుతామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
This post was last modified on December 24, 2024 6:46 pm
టిల్లు సిరీస్ తర్వాత సిద్దు జొన్నలగడ్డ చేస్తున్న సినిమాగా జాక్ మీద ఈపాటికి భారీ అంచనాలు నెలకొనాలి. అయితే బయట…
ఏపీ సీఎం చంద్రబాబుపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి పొగడ్తల వర్షం కురిపించారు. బాబు ఔదార్యం…
దేశంలో మహిళలు, బాలికలకు భద్రతే లేకుండా పోయింది. ఈ మాటలు కాస్తంత కఠువుగా ఉన్నా.. వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలు…
కొన్ని పాత్రల విషయంలో మేకర్స్ చాలా పర్టికులర్గా ఉంటారు. ఒక పాత్రను ఫలానా వాళ్లు చేస్తేనే సినిమా చేయాలని లేదంటే లేదని…
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకుంటున్న పలు నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోన్న సంగతి…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం అల్లూరి సీతారామ రాజు జిల్లా పర్యటనకు వెళ్లారు. గిరి…