Political News

ప్రభుత్వానికి, ఇండస్ట్రీకి మధ్య వారధి అవుతా: దిల్ రాజు

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.

విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని దిల్ రాజు చెప్పారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించానని అన్నారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, రేవతి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని దిల్‌ రాజు భరోసానిచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. కావాలని ఇలా ఎవరూ చేయరని, వినోదం కోసమే రేవతి కుటుంబం థియేటర్‌కు వెళ్లిందని, అనుకోకుండా ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.

రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్‌ తో భేటీ అవుతామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.

This post was last modified on December 24, 2024 6:46 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

2 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

2 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

5 hours ago