సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు అల్లు అర్జున్ పోలీసుల విచారణకు కూడా హాజరయ్యారు. ఈ ఇష్యూ నేపథ్యంలో ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెరుగుతోందని చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రభుత్వానికి, అటు ఇండస్ట్రీకి మధ్య వారధిలా ఉంటానని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు అన్నారు.
విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని దిల్ రాజు చెప్పారు. కిమ్స్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను, రేవతి కుటుంబ సభ్యులను పరామర్శించానని అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడానని, రేవతి కుటుంబానికి అన్నివిధాలుగా అండగా ఉంటానని దిల్ రాజు భరోసానిచ్చారు. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడుతుందని, త్వరగా రికవరీ అవుతున్నాడని చెప్పారు. కావాలని ఇలా ఎవరూ చేయరని, వినోదం కోసమే రేవతి కుటుంబం థియేటర్కు వెళ్లిందని, అనుకోకుండా ఇలా జరగడం దురదృష్టకరమని చెప్పారు.
రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామని, వాళ్ల బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు ప్రముఖులతో రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ తో భేటీ అవుతామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎఫ్ డీసీ ఛైర్మన్ గా తాను బాధ్యత తీసుకుంటానని చెప్పారు.
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…