తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదు చేసిన కేసు, భూపాలపల్లి జిల్లా సెషన్సు కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించినట్టయింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఏం జరిగింది?
కేసీఆర్ హయాంలో మేడిగడ్డ బ్యారేజీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే.. బ్యారేజ్లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై మహదేవ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అనంతరం.. ఈ బ్యారేజీని కేంద్ర జలవనరుల సంఘం పరిశీలించింది. బ్యారేజీలోని ఆరో బ్లాకు నుంచి ఎనిమిదో బ్లాకు దాకా.. 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ దాకా.. పరిశీలించారు.
అనంతరం.. స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ పిల్లర్లు కుంగిపోవడానికి.. బ్యారేజీ దెబ్బ తినడానికి కూడా.. అప్పటి సీఎం, మంత్రులే కారణమని పోలీసులు విడిగా మరోకేసు పెట్టారు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు వారిని విచారణకు కూడా పిలిచింది. అనంతరం.. కేసీఆర్, హరీష్రావులు ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా పలు విచారణల అనంతరం.. వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది.
This post was last modified on December 24, 2024 4:25 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…