తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆయన మేనల్లుడు, అప్పటి ఆర్థిక మంత్రి హరీష్రావులకు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వారిపై నమోదు చేసిన కేసు, భూపాలపల్లి జిల్లా సెషన్సు కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం సస్పెండ్ చేసింది. దీంతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించినట్టయింది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. జిల్లా కోర్టు ఇచ్చిన ఆర్డర్స్ సరిగ్గా లేవని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఏం జరిగింది?
కేసీఆర్ హయాంలో మేడిగడ్డ బ్యారేజీని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అయితే.. బ్యారేజ్లోని 7వ బ్లాక్ వద్ద మూడు పిల్లర్లు కుంగిపోయాయి. దీనిపై మహదేవ్పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లర్ కింద భారీ శబ్దం రావడంతో కుట్ర కోణం ఉందన్న అనుమానంతో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రవికాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు. అనంతరం.. ఈ బ్యారేజీని కేంద్ర జలవనరుల సంఘం పరిశీలించింది. బ్యారేజీలోని ఆరో బ్లాకు నుంచి ఎనిమిదో బ్లాకు దాకా.. 15వ పిల్లర్ నుంచి 20వ పిల్లర్ దాకా.. పరిశీలించారు.
అనంతరం.. స్థానిక నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ పిల్లర్లు కుంగిపోవడానికి.. బ్యారేజీ దెబ్బ తినడానికి కూడా.. అప్పటి సీఎం, మంత్రులే కారణమని పోలీసులు విడిగా మరోకేసు పెట్టారు. ఈ క్రమంలోనే స్థానిక కోర్టు వారిని విచారణకు కూడా పిలిచింది. అనంతరం.. కేసీఆర్, హరీష్రావులు ఈ కేసును క్వాష్ చేయాలని కోరుతూ.. హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా పలు విచారణల అనంతరం.. వారికి అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్థానిక కోర్టు ఆదేశాలను తోసిపుచ్చింది.
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం విడుదల తేదీకి అఫీషియల్ ముద్ర పడిపోయింది. అక్టోబర్ 2…
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ సమీప రహదారికి 'డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ'గా నామకరణం చేయడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం…
అదేంటో గానీ… పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కు ఎటు వెళ్లినా విమర్శల జడివానే తప్పడం లేదు. సాధారణ…
ప్రస్తుత జెన్ జీ, జెన్ ఆల్ఫా వర్గానికి చెందిన యువతలానే నేనూ జెన్ జీని అంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు…
డ్రాగన్ విడుదల ఇంకా సంవత్సరం ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు కాలం భారంగా గడిచిపోతోంది. ఒకవేళ వార్ 2 బ్లాక్…
అమరావతిలోని ఉండవల్లిలో వైసీపీ నాయకుల పర్యటన ఉద్రిక్తతంగా మారింది. ఆ పర్యటనను రాజధాని రైతులు, టీడీపీ వర్గాలు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి.…