ఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కేబినెట్ మంత్రులకు పక్కా నిబంధన అమలు చేయాలని నిర్ణయించారు. జనవరి 1వ తేదీ నుంచి అమలు చేసే ఈ నిబంధనను అందరూ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రస్తుతం అధికారులకు, ఉద్యోగులకు మాత్రమే పరిమితమైన అటెండెన్సును.. ఆయన మంత్రులకు కూడా విస్తరించారు. జనవరి 1వ తేదీ నుంచి నూతనంగా అందు బాటులోకి తీసుకువచ్చే ప్రత్యేక యాప్లో అటెండెన్స్ వేయనున్నారు.
ప్రత్యేక యాప్ను ఇప్పటికే ప్రాథమికంగా పరిశీలించారు. దీనిని జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయనున్నారు. మంత్రులు ఎక్కడ ఉన్నా… వారు తమ ఫోన్లలో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. అంటే.. వారు నిరంతరం.. పనిలో ఉంటున్నారా? లేక సొంత వ్యవహారాలు చేసుకుంటున్నారా? అనే విషయంపై చంద్రబాబు పక్కాగా పరిశీలించనున్నారు. ఈ క్రమంలో మంత్రులు అందరూ.. ఉదయం 11 గంటలలో పల.. తాము ఎక్కడ విడిది చేసినా.. ఏ పనిలో ఉన్నా.. యాప్ ద్వారా అటెండెన్సు వేయాల్సి ఉంటుంది.
ఇది సీఎం డ్యాష్ బోర్డుకు చేరుతుంది. మంత్రుల పనితీరును అంచనా వేయడంలో దీనికి కూడా ప్రధాన మార్కులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. 2015-19 మధ్య కూడా.. కొన్నాళ్లు ఈ ప్రయత్నం చేసినా.. అది విఫలమైంది. కానీ, ఇప్పుడు పక్కాగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తాను కూడా ఈ అటెండెన్సును వేయనున్నారు. అదేవిధంగా.. మంత్రుల షెడ్యూల్ను కూడా విడుదల చేయనున్నారు.
ప్రస్తుతం షెడ్యూల్ విడుదల చేసే విషయంలో సీఎం చంద్రబాబు ముందున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిస్థితులను బట్టి.. షెడ్యూల్ ఉంటోంది. ఇక, మంత్రుల విషయంలో వారు ఎలాంటి పనులు చేస్తున్నారో.. ఏం చేస్తున్నారో.. కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అటు అటెండెన్సు.. ఇటు షెడ్యూల్ రెండూ కూడా.. జనవరి 1 నుంచి అమలు చేయనున్నారు. అయితే.. సెలవు దినాలు, పండుగలు వంటి రోజుల్లో మినహాయింపు ఉంటుంది. కాగా.. ఈ విధానం అమలు చేస్తున్న రెండో రాష్ట్రం ఏపీ కావడం విశేషం. తొలుత ఈ విధానాన్ని ఢిల్లీలో కేజ్రీవాల్ అమలు చేశారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…