Political News

జగన్ ఆరోపణలకు ఇదేనా పరిష్కారం ?

న్యాయ, రాజకీయ వ్యవస్ధల్లోని కొందరు ప్రముఖులపై జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీష్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరికొందరు జడ్జీలు చంద్రబాబు ప్రయోజనాల కోసమే పని చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలు చేశారు బాగానే ఉంది. మరి తన ఆరోపణలపై జగన్ ఎటువంటి పరిష్కారం కోరుకుంటున్నారు ? జగన్ చేసిన ఆరోపణలపై సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే ఏ విధంగా స్పందిస్తారు ? అన్నది ఇక్కడ కీలకమైంది.

ఓ టీవీ చర్చల్లో పాల్గొన్న కొందరు లాయర్ల అభిప్రాయం ప్రకారం రాష్ట్రానికి సంబందించిన కేసులను ఇక నుండి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో దేనికైనా బదిలి చేయించాల్సుంటుందని అభిప్రాయపడ్డారు. గతంలో తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత కు సంబంధించిన అదాయానికి మించిన అక్రమాస్తుల కేసులను కర్నాటక హైకోర్టులో విచారించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. తమిళనాడు హైకోర్టు విచారణపై తనకు నమ్మకం లేదని అప్పట్లో జయలలిత చేసిన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకుని సుప్రింకోర్టు పై నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఒక రాష్ట్రంలోని కేసులను ఇతర రాష్ట్రాల్లో విచారించిన ఘటనలు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు ఉద్దేశ్యపూర్వకంగా కక్షసాధింపు ధోరణిలో వ్యవహరిస్తోందని జగన్ ఆరోపించారు. అంటే హైకోర్టు విచారణపై తన నమ్మకం లేదన్న విషయాన్ని పరోక్షంగా చెప్పేశారు. కాబట్టి ఇపుడు విచారణలు జరుగుతున్న కేసులను ఇతర రాష్ట్రాల్లోని హైకోర్టులకు బదిలీ చేయటంతో పాటు ఇక నుండి ఏ కేసును కూడా హై కోర్టులో విచారణ జరగకపోవటమే మంచిదని అభిప్రాయపడ్డారు.

నిజానికి ప్రభుత్వ, న్యాయవ్యవస్ధల మధ్య తలెత్తకూడని వివాదం తల్లెత్తింది కాబట్టి సుప్రింకోర్టు తొందరగా ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందే అని చాలామంది లాయర్లు అభిప్రాయపడ్డారు. ఇపుడు గనుక వివాద పరిష్కారంలో ఆలస్యమైనా లేదా పట్టించుకోకపోయినా ఇవే సమస్యలు భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని లాయర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మామూలుగా ఏ రాష్ట్రంలో అయినా విధానపరమైన నిర్ణయాలపైన, ప్రభుత్వాలు జరిపించే విచారణల విషయాల్లో హైకోర్టులు తొందరగా జోక్యం చేసుకోవని స్పష్టంగా చెప్పారు. కానీ ఏపిలో మాత్రం ఇందుకు భన్నంగా జరుగుతోంది కాబట్టే వివాదం మొదలైందని అభిప్రాయపడ్డారు.

This post was last modified on October 12, 2020 11:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తమిళనాడు కూడా తేలింది.. కానీ కేరళ మాత్రం…

తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…

7 minutes ago

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

5 hours ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

6 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

7 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

7 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

8 hours ago