సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు రేపు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప-2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 23, 2024 9:42 pm
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…