సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు రేపు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప-2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 23, 2024 9:42 pm
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…