సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు రేపు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప-2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 23, 2024 9:42 pm
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…
‘ఆర్ఎక్స్ 100’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యువ దర్శకుడు అజయ్ భూపతి, మళ్లీ తన పవర్ చూపించిన సినిమా..…
విశాఖ రైల్వే జోన్..ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన కీలక హామీలలో ఒకటి. జగన్ హయాంలో అదిగో…
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే వలసదారులపై కఠిన…
అగ్రరాజ్యం అమెరికాలో నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోడీ మురిసిపోయారు. "నా ప్రియ…