సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో షాకిచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని అల్లు అర్జున్ కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులిచ్చారు. ఆ తొక్కిసలాట ఘటనపై విచారణ జరిపేందుకు అల్లు అర్జున్ కు నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం, అందులో చేసిన వ్యాఖ్యలపై కూడా పోలీసులు రేపు ప్రశ్నించే అవకాశముందని తెలుస్తోంది. మరోవైపు, అల్లు అర్జున్ తో పాటు దర్శకుడు సుకుమార్, పుష్ప-2 చిత్ర నిర్మాతలపై కాంగ్రెస్ ఎమ్మల్సీ తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ చిత్రంలో పోలీసులను చిన్నచూపు చూసేలా పలు సన్నివేశాలున్నాయని మల్లన్న ఆరోపించారు. ముఖ్యంగా ఆ చిత్రంలో స్విమ్మింగ్ పూల్ సన్నివేశంలో పోలీస్ అధికారి పడిపోవడం, ఆ తర్వాత సీన్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని మల్లన్న అన్నారు.
ఈ క్రమంలోనే అల్లు అర్జున్, సుకుమార్, నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.సెన్సార్ బోర్డు ఆ సీన్లకు కత్తెర వేయకుండా ఎందుకు అనుమతించిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఈ తరహా సినిమాల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని మల్లన్న ప్రశ్నించారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
This post was last modified on December 23, 2024 9:42 pm
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…