తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే స్మగ్లర్ల కథతో వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప చిత్రంపై విమర్శలు గుప్పించారు. చంకలో బిడ్డ పెట్టుకుని న్యాయం కోసం, హక్కుల కోసం ఓ మహిళ పోరాడిన సినిమాకు అవార్డు లేదని, స్మగ్లర్ పాత్ర ఉన్న సినిమాకు అవార్డు వచ్చిందని విమర్శించారు.
స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలని ప్రశ్నించారు. నేరప్రవృత్తిని పెంచేలా ఉన్న ఇటువంటి సినిమాలు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశముందని, మానవతా దృక్పథం ఉన్న సందేశాత్మక సినిమాలు రావాలని అన్నారు. ఎటువంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో… స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2024 4:28 pm
నేచురల్ స్టార్ నాని తన కెరీర్లోనే అతి పెద్ద పరీక్షకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గురువారం తన కొత్త చిత్రం ‘ది…
థియేటర్లకు వచ్చే జనం తగ్గిపోతున్నారు అని.. సింగిల్ స్క్రీన్లు మూతపడిపోతున్నాయని తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న దశలో గత మూడు నెలలుగా…
వచ్చే సంక్రాంతికి విశ్వంభర రిలీజవుతుందని, కాకా వేసవికి వెళ్లిపోవచ్చనే ప్రచారం గత వారం రోజులుగా చాలా బలంగా తిరుగుతోంది. తుది…
మొదటి వారం పూర్తి కాక ముందే సర్దార్ 2 ఎంత పెద్ద డిజాస్టరో జనాలకు అర్థమైపోయింది. యునానిమస్ గా ఫ్లాప్…
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కలయికలో రూపొందుతున్న కాకాలో ఒక కీలక పాత్రకు సంబంధించిన ఆర్టిస్ట్ సెలక్షన్ పెండింగ్…
ఉత్సాహంగా పండుగ చేసుకుంటున్న సమయంలో ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు విద్యార్థులు మరణించడంతో తెలంగాణాలో విషాదం నెలకొంది. మృతి చెందిన…