తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే స్మగ్లర్ల కథతో వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప చిత్రంపై విమర్శలు గుప్పించారు. చంకలో బిడ్డ పెట్టుకుని న్యాయం కోసం, హక్కుల కోసం ఓ మహిళ పోరాడిన సినిమాకు అవార్డు లేదని, స్మగ్లర్ పాత్ర ఉన్న సినిమాకు అవార్డు వచ్చిందని విమర్శించారు.
స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలని ప్రశ్నించారు. నేరప్రవృత్తిని పెంచేలా ఉన్న ఇటువంటి సినిమాలు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశముందని, మానవతా దృక్పథం ఉన్న సందేశాత్మక సినిమాలు రావాలని అన్నారు. ఎటువంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో… స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2024 4:28 pm
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…