తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే స్మగ్లర్ల కథతో వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప చిత్రంపై విమర్శలు గుప్పించారు. చంకలో బిడ్డ పెట్టుకుని న్యాయం కోసం, హక్కుల కోసం ఓ మహిళ పోరాడిన సినిమాకు అవార్డు లేదని, స్మగ్లర్ పాత్ర ఉన్న సినిమాకు అవార్డు వచ్చిందని విమర్శించారు.
స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలని ప్రశ్నించారు. నేరప్రవృత్తిని పెంచేలా ఉన్న ఇటువంటి సినిమాలు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశముందని, మానవతా దృక్పథం ఉన్న సందేశాత్మక సినిమాలు రావాలని అన్నారు. ఎటువంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో… స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2024 4:28 pm
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…