తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు అల్లు అర్జున్ స్పందించడంతో వ్యవహారం ముదిరింది. ఆ తర్వాత అల్లు అర్జున్ పై, పుష్ప చిత్రంపై కాంగ్రెస్ నేతలు మరిన్ని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పుష్ప చిత్రంపై మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
జై భీమ్ వంటి సందేశాత్మక చిత్రాలకు అవార్డులు రాలేదని, పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే స్మగ్లర్ల కథతో వచ్చిన సినిమాలకు అవార్డులు ఇస్తున్నారని పుష్ప చిత్రంపై విమర్శలు గుప్పించారు. చంకలో బిడ్డ పెట్టుకుని న్యాయం కోసం, హక్కుల కోసం ఓ మహిళ పోరాడిన సినిమాకు అవార్డు లేదని, స్మగ్లర్ పాత్ర ఉన్న సినిమాకు అవార్డు వచ్చిందని విమర్శించారు.
స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని, ఇవేం సినిమాలని ప్రశ్నించారు. నేరప్రవృత్తిని పెంచేలా ఉన్న ఇటువంటి సినిమాలు సమాజంపై దుష్ప్రభావం చూపించే అవకాశముందని, మానవతా దృక్పథం ఉన్న సందేశాత్మక సినిమాలు రావాలని అన్నారు. ఎటువంటి సినిమాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో… స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారని ప్రశ్నించారు.
This post was last modified on December 23, 2024 4:28 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…