Political News

ఆయ‌న సినిమా హీరో అంతే: డీజీపీ

అల్లు అర్జున్‌-పుష్ప‌-2 వివాదంపై తాజాగా తెలంగాణ‌ డీజీపీ జితేంద‌ర్‌ స్పందించారు. ఆయ‌న సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్య‌వ‌హారంపై కామెంట్ చేశారు. ఎవ‌రైనా చ‌ట్టం ముందు స‌మాన‌మేన‌ని చెప్పా రు. బాధితుల ప‌క్షానే పోలీసులు, ప్ర‌భుత్వం కూడా ఉంటాయ‌ని తెలిపారు. త‌మ‌కు ఎవ‌రిపైనా ప‌క్ష‌పాతం ఉండ‌ద‌ని చెప్పారు. సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న విష‌యంలో తాము ఎవ‌రికీ అనుమ‌తి ఇవ్వ‌లేద‌ని.. సంధ్య థియేట‌ర్ అనుమ‌తి కోరినా.. ప‌రిస్థితిని అర్ధం చేసుకున్న అధికారులు అనుమ‌తులు ఇవ్వ‌లేద‌న్నారు.

హీరోలు.. స్థానిక ప‌రిస్థితుల‌ను అర్థం చేసుకోవాల‌ని.. డీజీపీ సూచించారు. ఉన్న‌త స్థాయిలో ఉన్న‌వారు త‌మ గౌర‌వానికి, హుందాత‌నానికి అనుగుణంగా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని సూచించారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్య ధియేట‌ర్ విష‌యంలో ఇప్ప టికే కేసులు న‌మోద‌య్యాయ‌ని, ఈ కేసు హైకోర్టు ప‌రిధిలో ఉంద‌ని డీజీపీ వ్యాఖ్యానించారు. త‌మ‌కు రాజ‌కీయాలను అంట‌గ‌ట్ట‌వ‌ద్ద‌న్నారు.

ఇక‌, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు కుటుంబ ర‌గ‌డ విష‌యాన్ని ప్ర‌స్తావించిన డీజీపీ జితేంద్ర .. అది వారి కుటుంబ స‌మ‌స్య‌గా పేర్కొన్నారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల‌తో వారు ప‌రిష్క‌రించుకుంటే మంచిదేన‌ని చెప్పారు. కానీ.. చ‌ట్ట ప్ర‌కారం.. ఎవ‌రు వ‌చ్చినా తాము ర‌క్ష‌ణ క‌ల్పించే ప్ర‌య‌త్నం చేస్తామ‌న్నారు. ఇంటి స‌మ‌స్యల కు పోలీసులు బాధ్య‌త వ‌హించ‌బోర‌ని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంద‌ని జితేంద్ర స్ప‌ష్టం చేశారు. ప్ర‌తి విష‌యానికీ పోలీసుల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం స‌రికాద‌ని వ్యాఖ్యానించారు.

This post was last modified on December 22, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జీతం తీసుకొని సభకు రారా కేసీఆర్ సారు

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షం.. బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు కేసీఆర్‌.. ప్ర‌జ‌లుక‌డుతున్న ప‌న్నుల‌తో…

3 hours ago

‘మహేష్’ వివాదంపై స్పందించిన శ్రీలీల

ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా జరిగిన ఒక పరిణామానికి సంబంధించి ఓ వీడియో సోషల్…

5 hours ago

పవన్ పారితోషికం లక్షల్లోనే అయినా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్‌గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…

9 hours ago

‘అన్న’ అనే ప‌దానికి జ‌గ‌న్ క‌ళంకం: ష‌ర్మిల‌

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై ఆయ‌న సోద‌రి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి నిప్పులు చెరిగారు. 'అన్న‌'…

11 hours ago

విమాన సంస్థ‌ల‌పై కొర‌డా.. 60 శాతం సీట్లు ‘ఫ్రీ’

దేశంలో విమానయాన సంస్థ‌ల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న…

11 hours ago

ఏపీలో ‘దివ్యాంగ శక్తి’.. క‌లిసి ప్ర‌యాణించిన బాబు-ప‌వ‌న్‌!

ఏపీలో మ‌రో కీల‌క ప‌థ‌కం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, ఉప…

11 hours ago