అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై కామెంట్ చేశారు. ఎవరైనా చట్టం ముందు సమానమేనని చెప్పా రు. బాధితుల పక్షానే పోలీసులు, ప్రభుత్వం కూడా ఉంటాయని తెలిపారు. తమకు ఎవరిపైనా పక్షపాతం ఉండదని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన విషయంలో తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదని.. సంధ్య థియేటర్ అనుమతి కోరినా.. పరిస్థితిని అర్ధం చేసుకున్న అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.
హీరోలు.. స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. డీజీపీ సూచించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ గౌరవానికి, హుందాతనానికి అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్య ధియేటర్ విషయంలో ఇప్ప టికే కేసులు నమోదయ్యాయని, ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. తమకు రాజకీయాలను అంటగట్టవద్దన్నారు.
ఇక, కలెక్షన్ కింగ్ మోహన్బాబు కుటుంబ రగడ విషయాన్ని ప్రస్తావించిన డీజీపీ జితేంద్ర .. అది వారి కుటుంబ సమస్యగా పేర్కొన్నారు. అంతర్గత చర్చలతో వారు పరిష్కరించుకుంటే మంచిదేనని చెప్పారు. కానీ.. చట్ట ప్రకారం.. ఎవరు వచ్చినా తాము రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంటి సమస్యల కు పోలీసులు బాధ్యత వహించబోరని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుందని జితేంద్ర స్పష్టం చేశారు. ప్రతి విషయానికీ పోలీసులను తప్పుబట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on December 22, 2024 3:47 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…