అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే!
అని అర్జున్ వ్యవహారంపై కామెంట్ చేశారు. ఎవరైనా చట్టం ముందు సమానమేనని చెప్పా రు. బాధితుల పక్షానే పోలీసులు, ప్రభుత్వం కూడా ఉంటాయని తెలిపారు. తమకు ఎవరిపైనా పక్షపాతం ఉండదని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటన విషయంలో తాము ఎవరికీ అనుమతి ఇవ్వలేదని.. సంధ్య థియేటర్ అనుమతి కోరినా.. పరిస్థితిని అర్ధం చేసుకున్న అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు.
హీరోలు.. స్థానిక పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. డీజీపీ సూచించారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారు తమ గౌరవానికి, హుందాతనానికి అనుగుణంగా వ్యవహరిస్తే బాగుంటుందని సూచించారు. అత్యుత్సహం ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంధ్య ధియేటర్ విషయంలో ఇప్ప టికే కేసులు నమోదయ్యాయని, ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందని డీజీపీ వ్యాఖ్యానించారు. తమకు రాజకీయాలను అంటగట్టవద్దన్నారు.
ఇక, కలెక్షన్ కింగ్ మోహన్బాబు కుటుంబ రగడ విషయాన్ని ప్రస్తావించిన డీజీపీ జితేంద్ర .. అది వారి కుటుంబ సమస్యగా పేర్కొన్నారు. అంతర్గత చర్చలతో వారు పరిష్కరించుకుంటే మంచిదేనని చెప్పారు. కానీ.. చట్ట ప్రకారం.. ఎవరు వచ్చినా తాము రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తామన్నారు. ఇంటి సమస్యల కు పోలీసులు బాధ్యత వహించబోరని.. కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుందని జితేంద్ర స్పష్టం చేశారు. ప్రతి విషయానికీ పోలీసులను తప్పుబట్టడం సరికాదని వ్యాఖ్యానించారు.
This post was last modified on December 22, 2024 3:47 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…